Posts

Showing posts from March, 2020

VARTULAAVRTAM KAALAM-VAANCHITAM VISVASRAEYADAM.

Image
ఆర్యులు "ఉ" అను అక్షరమును నక్షత్ర సంకేతముగాను," గ" అను అక్షరమును గమన సంకేతముగాను నిర్వచించి,ఉగాది అను సంవత్సరారంభమును బ్రహ్మకల్ప ప్రారంభముగాను గుర్తించారు.యుగ అనే పదమును ద్వయముగా అన్వయించుకుంటే ఈ నక్షత్ర గమనము ఉత్తరదిక్కు-దక్షిణ దిక్కు అను రెండితి వైపు ఉన్నది కనుక యుగాది గాను భావిస్తారు.తెలుగు సంవత్సరాల నామములు వాటి స్వరూప-స్వభావాలను స్పష్టీకరిస్తుంటాయనుట నిర్వివాదము.ఉదాహరణకు సృష్టి ప్రకటితమైన కాల నామమును ప్రభవ అని ముగియు నామమును క్షయ అని తిరిగి ప్రభవిస్తుంది కనుక అక్షయ అని పేర్కొన్నారు.     క్షమాపణ అభ్యర్థిస్తూ   సంవత్సరాది ప్రత్యేకతను తల్లిగా-తండ్రిగా-గురువుగా గుర్తించి,గణుతించే ప్రయత్నము చేస్తున్నాను. బ్రహ్మ కూడ తన నియమిత కాలము ముగియగానే అంతరించి,తిరిగి ప్రభవిస్తాడు సృష్టి రచనకు అని అంటారు.వసంటం ప్రారంభమైన చైత్రశుధ్ధ పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ రస జగత్తును సృష్టిచేస్తాడని ఐతిహాస వచనము.శార్వరి నామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి బుధ వారము ఉషకాలమను తల్లి కొత్తసంవత్సరమునకు జన్మ నిచ్చి పురుడు పోసుకున్నది.ఔషధ స్వభావముతో,తన సంతతిని సమర్థవంతముగా సంతోష ...

TAPASYA MASAMU-PARJANYA

Image
  తపస్య మాస పాలనకై వర్షకారకుడైన ఆదిత్యుడు పర్జన్యుడు తన వృష్టి సర్జన కిరన ప్రసరనకు పయనమౌతున్న సమయమున భరద్వాజ ముని వేదపారాయణతో సుసంపన్నము చేస్తున్నాడు.సేనాజిత్ అప్సరస తన నాత్యముతో,విశ్వ గంధర్వుడు తన గానముతో విశ్వమును విలక్షణము చేస్తున్నాడు.ఐరావత సర్పము రథ పగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.రీతు అను యక్షుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తున్నాడు.వర్స రాక్షసుడు రథము వెనుక నిలబడి,రథమును ముందుకు జరుపుతుండగా అపాం మిత్రుడు పర్జన్య నామధారియై ప్రాణికోటికి జలమును అందించుటకు తన కిరణములను జరుపుచున్నాడు.   తం పర్జన్య ప్రణమామ్యహం.

TAPAS MASA-PUSHA

Image
 " పుష్ణాతి ఇతి పూషా". తన కిరణ శక్తులచే సర్వ జగములను పోషించువాడు పూషా నామధేయ ఆదిత్యుడు.మధ్యాహ్న సమయమును అధిష్టించియున్న సౌరశక్తి.గౌత ముని వేదపారాయణతో శుభారంభమునుచేయుచుండగా తపస్ మాస నిర్వహణకు తరలుచున్నాడు స్వామి.ఘృతాచి అప్సరస ఆనందముతో అడుగులు కదుపుచుండగా,సుసేన గంధర్వుడు గానమును ప్రారంభించాడు.ధనంజయ సర్పము రథ పగ్గములను పరిశీలించి,పటిష్టము చేయుచుండగా సురుచి అను యక్షుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేయుచున్నాడు.వాల రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా జగత్ పోషణకు జగన్నాథుడు తన కిరణములను జరుపుచున్నాడు.    తం పూషా ప్రణమామ్యహం.

SAHASYA MASA-BHAGA

Image
 సహస్యమాసము-భగ  *******************  " భర్జతీతి ఇతి భర్గ" భగ నామ ఆదిత్యుడు సహస్య మాసమునకు ప్రభువు.భ అనగా తేజము.గ అనగా గమనము.తేజోవంతమైన తన గమనముతో(కిరణ శక్తులతో) సమస్త అజ్ఞానమును భర్జింపచేసే మహాతేజస్సు.ఆయుర్ముని వేదపఠనమును ప్రారంభిస్తూ స్వామికి లాంఛనముగా మార్గమును చూపించుటకు సిధ్ధముగా నున్నాడు.పూర్వసిత్తి అను అప్సరస అభినయ నాట్యముతో స్వామిని సేవించుచున్నది.అపూర్వముగా అరిష్టనేమి అను గంధర్వుడు తన గళమును సవరించుచు,మాసమును మంగళప్రదమొనరించుచున్నాడు.కర్కోటక సర్పము రథపగ్గములను పరిశీలించి,ప్రయాణమునకు పటిష్టము చేయుచున్నాడు.యక్షుడు ఊమ సప్తాశ్వములను రథమునకు అనుసంధానము చేస్తూ,ఆనందోత్సాహుడైనాడు.స్పూర్జ రాక్షసుడు రథము వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా సకల లోకములను తన కిరణ ప్రకాశముతో జ్ఞాన వంతము చేయుటకు సన్నధ్ధుడైనాడు స్వామి..     తం భగః ప్రణమామ్యహం.

SAHAS MASAMU-AMSUMAAN

Image
 " అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" లోపల బయట సౌరశక్తిపరముగా వ్యాపించి తన కిరణములద్వారా చైతన్యమయము చేయగల పరంజ్యోతి అంశుమాన్ సహస్ మాస  సంరక్షణకు సన్నధ్ధుడగుచుండగా,పశ్యక (రక్షణ0స్వభావి కశ్యప మహాముని వేదోక్త ప్రారంభమునకు ఆయుత్తుడగుచున్నాడు.ఉర్విని మనోహర మధుకలశముగా మార్చవలెనన్న ఊహకలిగిన ఊర్వశి తన అదుఘులను అతిమనోహరముగా కదుపుచుండగా,ఋతుకర్తను కీర్తిస్తూ ఋతసేన నామ గంధర్వుడు తన గళమును కలుపసాగాడు.యక్షుడు తర్క్య సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధిస్తూ,ఆనందోలాసుడైనాడు.మహాశంఖ సర్పము రథ పగ్గములను పరిశీలిస్తూ,పటిష్టము చేస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు.విద్యుత్చ్చాత్రు రథమును ముందుకు జరుపుటకు ఉద్యమించుచుండగా,ప్రశంసాపాత్రుడు అంశుమాన్ తన కిరణములను ప్రసరించుటకు సన్నధ్ధుడనాడు.  తం అంశుమాన్ ప్రణమామ్యహం.

URJAMASAMU-VSHNU

Image
 "విష్ణుం జ్ష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం."  ఉర్జ్య మాస రంరక్షకినిగా ఉద్యమిస్తున్న "ఆదిత్యానాం అహం విష్ణుః" కు అనేక కోటి నమస్కారములు. యాని నామాని గౌణాని అంటూ,విశ్వ శ్రేయస్సుకై విశ్వామిత్ర మహాముని వేదోచ్చారణమును ప్రారంభించాడు.శుభారంభముగా రంభ యను అప్సరస నాట్యమును ప్రారంభిస్తుంటే,గంధర్వ సూర్యవర్చ గానామృత గమకములతో గణుతిస్తున్నాడు.అశ్వత సర్పము పగ్గములను పరిశీలిస్తున్నాడు.యక్షుడు  సత్యజిత్ సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధిస్తూ,అర్చించుకుంటున్నాడు.మఖపేత రాక్షసుడు స్వామి రథమును వెనుకనుండి జరుపుతూ,జగత్కళ్యానమును కోరుతుండగా వ్యాపకత్వ-అసుర సంహార లక్షనములతో స్వామి కదులుచున్నాడు.  " తం విష్ణుం ప్రణమామ్యహం."

ISHA MASAMTVASHTA.

Image
 " తనూ కరోతి ఇతి త్వష్టా" సృష్టి లోని ప్రతి పదార్థమునకు ఒక నిర్దిష్ట రూపమును కలిగించేవాడు.  "రూపము రూపం బహురూపం బభూవ" జగత్తులోని రూపములు ప్రకటింపబడటానికి,వాని గుర్తించగలగడానికి త్వష్ట యే కారణము.  స్వామి ఈష మాసమున వృక్ష నివాసము చేస్తూ,త్వష్ట నామధేయముతో పరిరక్షిస్తుంటాడు.పెద్దలు త్వష్ట అను నామమునకు మలుచువాడు/తొలుచువాడు అని సమన్వయిస్తారు.మనకు కావలిసిన హరితమును సంభరితము చేస్తూ,ఆహారమునకు కావలిసినవి ఉంచుతూ,కలుపులను తుంచుతూ హరితవాసము చేస్తాడు స్వామి."ఈశావాస్యం ఇదం సర్వం" అన్న సూక్తిని అనుభవైవేద్యము చేస్తాడు.ఆ స్వామికి జమదగ్ని మహాముని వేదసూక్తులతో మోదమునందిస్తుంటాడు.అప్సరస తిలోత్తమ్మ అనుపమాన నాట్యముతో పూజ్స్తుంటుంది.నృత్యం సమర్పయామి అంటూ.దానికి తోడుగా ధృతరాష్ట్రుడను గంధర్వుడు తన భుజబలముతో స్వామి యానగా అవనీతలమును కాపాడుతూ,ఆనందగానము చేస్తుంటాడు.కంబలాశ్వ సర్పము రథపగ్గములను పటిష్టపరుస్తుంటే,యక్షుడు శతాజిత్ తాళ్ళను మెలివేస్తూ,తరలుతున్న గమనశక్తికి గమకము అద్దుతున్నాడు.బ్రహ్మపేత రాక్షసుడు బ్రహ్మాండాధిపతి రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా,జగములకు తన కరుణ...

NABHASYA-VISVAVASU

Image
వ్యాపక లక్షణము కల పరంజ్యోతి వివస్వన్ నామధారియై విశ్వపాలనకు ఉపక్రమించుచున్న శుభతరుణమున భృగుమహాముని వేదపారాయణమునను మోదముతో ప్రారంభించి,స్వామి రథమునకులాంఛన ప్రాయముగా మార్గమును చూపించుటకు సన్నధ్ధుడగుచున్నాడు.అగ్నితత్త్వధారియైన ఆ పరమాత్మను ప్రస్తుతిస్తు అనుంలోచ అను అప్సరస అడుగులు కదపసాగగానే,ఉగ్రసేనుడను గంధర్వుడు ఉత్సాహముతో గానమును ప్రారంభించాడు.శంఖపాలుడను సర్పము పగ్గములను పరిశీలించి పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు అశరణుడు సప్తాశ్వములను స్వామి రథమునకు అనుసంధానము చేస్తూ గమనశక్తిని గమనిస్తున్నాడు.వ్యాఘ్రనామ రాక్షసుడు రథమును వెనుక నిలబడి ముందుకు జరుపుతుండగా నభస్య మాస వైభవమును అందీయుటకు వివస్వంతుడు వెడలుచున్నాడు.     తం వివస్వన్ ప్రణమామ్యహం.

NABHAS-INDRA

Image
వైభవోపేతమైన "నభశ్ మాసము రానే వస్తున్నది.సూర్యనారాయణుడు దేవతలను శత్రువుల నుండి రక్షించుటకు,భవనభాండములను ఐశ్వర్యవంటము చేయుటకు "ఇంద్ర" నామధారియై బయలుదేరుచున్నాడు.అంగీరస ముని మంగళాశాసనములు దిగంతములను చైతన్యవంతము చేయుచున్నవి.ప్రమదముతో అప్సరస ప్రమలోచ హావభావ నాట్యమునకు దీటుగా గంధర్వుడు విశ్వవసు గానము వీనులవిందు చేయుచున్నది.సర్పశ్రేష్టుడు ఎలపాత రథ పగ్గములను పటిష్టము చేయుచు,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు శ్రోత స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధించుచున్నాడు.వార్య రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా,అందరిని బ్రోచుటకు ఇంద్రుడు తన కిరణప్రసార ప్రయోజనమునకు ఉపక్రమించాడు.   తం ఇంద్రం ప్రణమామ్యహం.

SUCHIMASA-VARUNA

Image
 వరదుడడిగో వరుణనామ ధారియైనాడు.శుచి మాస శుభసంకేతమును సూచిస్తూ,వశిష్ట మహాముని వేదఘోషను ప్రారంభించాడు.అంభోరుహనేత్రి రంభ నాట్యమును ప్రారంభించగనే హూ హూ గంధర్వగానము ఓహో అనేలా జతకలిపింది.ఘర్మసర్జన కిరణ ప్రసాదుని రథపగ్గములను యక్షుడు చిత్రస్వనుడు పరిసీలించి,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.శుక్ర సర్పము స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తున్నాడు.సముద్రజలమును త్రాగు స్వామి సంసార మను సముద్రమును దాటించుటకు అవ్యాజ కరుణతో అడుగులు వేస్తున్నాడు.   " తం వరుణం ప్రణమామ్యహం.

SUKRAMASAMU-MITRA

Image
  చాంద్రమాన చైత్ర-వైశాఖ మాసములను (వసంత ఋతువును) పూర్తి చేసి,సౌరమాన శుక్రమాస శుభములను అందించుటకు,చంద్రుని-సముద్రమునందు మిక్కిలి ఆసక్తి గల మన స్వామి "మిత్ర" నామధారియై కనులవిందు చేయుచు కదులు చున్నాడు.అనుకూల స్వభావము కలవాడు మిత్రుడు అని వాచ్యార్థము.మన స్వామి తన కిరణ ప్రసరణము చేత తైలోత్పత్తులను-ఇంధనములను కలిగించుటకు కదులుచున్నాడు.స్వామి అనుగ్రహము వలనే మనము వాటిని గుర్తించి,ఉపయోగించుకొనగలుగుచున్నాము.  త్రిగుణాతీతుడు(రజో-తమో-సత్వ)అత్రి మహాముని.వేదోక్త ప్రకారముగా స్వామిని కీర్తిస్తు,లాంఛనముగా రథమునకు దారిచూపుటకు సిధ్ధమవుతున్నాడు అత్రిమహాముని.జన్మాంతరమున విరాటరాజుగా భావింపబడు హా హా అను పేరుగల గంధర్వుడు పాడుతుండగా,మేనక మనోహరముగా నర్తించుచున్నది.సర్పాధిపతి తక్షకుడు పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,అప్రమత్తతో నున్నాడు.రథస్వనుడను యక్షుడు స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధానము చేస్తూ,అనవరత ధ్యానాసక్తుడైనాడు.పౌరసేయుడను రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా కదులు చున్న మిత్రస్వామి కిరణములు కళ్యాణప్రదములగు గాక.  తం మిత్రం ప్రణమామ్యహం.

MADHAVAMASAMU-ARYAMA

Image
అదిగో మధుమాస సంరక్షణను దిగ్విజయముగా పూర్తిచెసుకొని,    పులహ మహాముని వంశాభివృధ్ధికి కారణమవుతు,వేదవేద్యునికి లాంఛనప్రాయముగా మార్గమును చూపిస్తూ,మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.అప్సరసాంగన పుంజికస్థలి తన దివ్యశక్తులతో నారద గానామృతమునకు అనుగుణముగా నర్తిస్తున్నది.కఛ్చనీరుడను సర్పము ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు ఒద్దికగా.అతౌజుడను యక్షుడు సలక్షణుడై స్వామిరథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తూ,ఆనందిస్తున్నాడు.ప్రహేతి రాక్షసుడు పరాక్రమోపేతుడై రథమును ముందుకు జరుపుతున్నాడు.తన కిరణముల ద్వారా ఉష్ణోగ్రతల పెంచుతు,అవనీతలమును ఆనందమయము చేయుటకు మాధవమాస అధిపతియై "ఆర్యమ" నామాలంకృత శోభితుడై తరలు    వాయు తత్త్వ ప్రధాన స్వామీ.  " తం ఆర్యమ ప్రణమామ్యహం."

MADHUMAASAMU-DHAATA

Image
 మధుమాసము-ధాత  ******************  అదిగో! ఆనందోత్సాహము! ఆస్వాదించండి.  " మననాత్ త్రాయతే మంత్రః" మననము చేసే వారిని రక్షించేదే మంత్రము అను ఆర్యోక్తికి అద్దము పడుతూ,బ్రహ్మ మానసపుత్రుడు,సప్తర్షులలో ఒకరైన పులస్త్యుడు (ప్రథమముగ నుండువాడు),పురాణ సంపదను మానవాళికి చేరువ చేసిన మహనీయుడు వేదవేద్యుని కీర్తిస్తూ,లాంఛన ప్రాయముగా మార్గమును చూపిస్తు మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.క్షీరసాగర మథనానంతరము జలరసముగా ప్రకటింపబడిన/వెలువడిన( అపొ-నీటి-రస-సారము)కృతస్థలి అను అప్సరస అవనీతలమును చిగురింపచేయుటకు ఆడుతూ స్వామిని అనుసరిస్తున్నది.అసమాన సౌందర్యముతో,అప్రమేయ పరాక్రమముతో కోకిలమ్మకు కొత్త కూత నేర్పించుటకా యన్నట్లు,తుంబురుడు తన మధుర గానముతో పరమాత్మను తన్మయ పరుస్తూ,తరించిపోతున్నాడు.   నాగరాజైన వాసుకి ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.  పర్వత పరిరక్షకుడు పరిశీలనా దక్షుడు అయిన రథకృత్ అను యక్షుడు జగములను తన శక్తిచే మాయామోహితులను చేయుటకు స్వామి రథమునకు సప్తాశ్వములకు అనుసంధానమును చేస్తూ, ఆనందిస్తున్నాడు.హేతి రాక్షసుడు రథమునకు వెనుక నిలబడి...

DVAADASAATMAN -NAMOSTUTE.

Image
 ద్వాదశాత్మన్ నమోస్తుతే  **********************   "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.   ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకతే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? మన పొట్ట నింపుకోగలమా?విద్య పై పట్టు సాధించగలమా?వైద్యరంగపు మెట్లు ఎక్కగలమా?కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.ఇవన్నీ కలిగించటానికే " ఏకం సత్ విప్రా బహుదా వదంతే" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప -గుణములతో,తన నుండి ప్రకటింప బడిన ఆరు శక్తులతో కలిసి,...