VARTULAAVRTAM KAALAM-VAANCHITAM VISVASRAEYADAM.

ఆర్యులు "ఉ" అను అక్షరమును నక్షత్ర సంకేతముగాను," గ" అను అక్షరమును గమన సంకేతముగాను నిర్వచించి,ఉగాది అను సంవత్సరారంభమును బ్రహ్మకల్ప ప్రారంభముగాను గుర్తించారు.యుగ అనే పదమును ద్వయముగా అన్వయించుకుంటే ఈ నక్షత్ర గమనము ఉత్తరదిక్కు-దక్షిణ దిక్కు అను రెండితి వైపు ఉన్నది కనుక యుగాది గాను భావిస్తారు.తెలుగు సంవత్సరాల నామములు వాటి స్వరూప-స్వభావాలను స్పష్టీకరిస్తుంటాయనుట నిర్వివాదము.ఉదాహరణకు సృష్టి ప్రకటితమైన కాల నామమును ప్రభవ అని ముగియు నామమును క్షయ అని తిరిగి ప్రభవిస్తుంది కనుక అక్షయ అని పేర్కొన్నారు. క్షమాపణ అభ్యర్థిస్తూ సంవత్సరాది ప్రత్యేకతను తల్లిగా-తండ్రిగా-గురువుగా గుర్తించి,గణుతించే ప్రయత్నము చేస్తున్నాను. బ్రహ్మ కూడ తన నియమిత కాలము ముగియగానే అంతరించి,తిరిగి ప్రభవిస్తాడు సృష్టి రచనకు అని అంటారు.వసంటం ప్రారంభమైన చైత్రశుధ్ధ పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ రస జగత్తును సృష్టిచేస్తాడని ఐతిహాస వచనము.శార్వరి నామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి బుధ వారము ఉషకాలమను తల్లి కొత్తసంవత్సరమునకు జన్మ నిచ్చి పురుడు పోసుకున్నది.ఔషధ స్వభావముతో,తన సంతతిని సమర్థవంతముగా సంతోష ...