శ్లో : కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాన్ఘ్రి- యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లి ష్యాఘ్రాయ స్ఫుట-జలజ-గంధాన్ పరిమళాన్ - అలభ్యాం బ్రహ్మాద్యైర్-ముదమ్-అనుభవి ష్యామి హృదయే ప్రస్తుత శ్లోకము సహస్రారమునుండి ద్రవిస్తు-ఆశీర్వదిస్తున్న సుధాసారమును ప్రస్తావిస్తు,దానిని స్థిరముగా నిలుపుకోవటము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.పూర్వపు శ్లోకము ద్రష్ట్వా అంటూ దర్శనమునకు ముందటి పరిస్థితిని తెలిపితే ప్రస్తుత శ్లోకము దృష్ట్వా అంటు దర్శనభాగ్యమును కలిగించినది.దర్శనము మాత్రమే కాదు స్వామి దివ్య పాదపద్మములను కన్నులలో,శిరములో,కన్నులలో,వక్షములో దాచుకుంటూ,స్వామి పాదపద్మములనుండి పరిమళిస్తున్న సుగంధమును ఆఘ్రాణించే సౌభాగ్యమును ప్రసాదిస్తున్నది. ఇది కేవలము బాహ్య ఇంద్రియమైన నాసిక గుర్తించకలిగినదికాదు.వసి వాడని,వన్నె తగ్గని పరిమళము అందిస్తున్న పరవశమును పొందే భాగ్యము నేను ఎప్పుడు పొందగలనో కదా. ఇంద్రియాతీతమైన అనుభవము.మనసు కేంద్రీకృతము అయినప్పుడు మాత్రమే లభించే అనుగ్రహ ఘ్రాణము.కన్నుల్లో దృశ్యమైన ,మనసులో తిష్ఠవేసుకొనిన పాదపద్మములు చేజారిపోకుండా దాచుకునే ప్రయత్నము మ...