Posts

Showing posts from November, 2022

NA RUDRO RUDRAMARCHAYET-30(SIVANAMDALAHARI)

 శ్లో : వస్త్రోద్-ధూత విధౌ సహస్ర-కరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధ-వహాత్మతా(అ)న్న-పచనే బర్హిర్ -ముఖాధ్య క్షతా పాత్రే కాన్చన-గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడా-మణే శుశ్రూషామ్ కరవాణి తే పశు-పతే స్వామిన్ త్రి-లోకీ-గురో 30

NA RUDRO RUDRAMARCHAYAET-29(SIVANAMDALAHARI)

 శ్లో : త్వత్-పాదాంబుజమ్-అర్చయామి పరమం త్వాం చింతయామి-అన్వహం త్వామ్-ఈశం శరణం వ్రజామి వచసా త్వామ్-ఏవ యాచే విభో వీక్షామ్ మే దిశ చాక్షుషీమ్ స-కరుణాం దివ్యైశ్-చిరం ప్రార్థితాం శంభో లోక-గురో మదీయ-మనసః సౌఖ్యోపదేశం కురు 29

NA RUDRO RUDRAMARCHAYAET-28(SIVANAMDALAHARI)

Image
 శ్లో : సారూప్యం తవ పూజనే శివ మహా-దేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి-ధుర్య-జనతా-సాంగత్య- సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక-తను-ధ్యానే భవానీ-పతే సాయుజ్యం మమ సిద్ధమ్-అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ 28  కరస్థే హేమాద్రి స్లోకములో స్వామి సంపదప్రదుడని కీర్తిస్తు,ప్రస్తుత శ్లోకములో నాలుగు విధములైన ముక్తి రూపములుగా పరమేశ్వరానుగ్రహమును ప్రస్తుతిస్తూ,వాటిలో మూడింటిని సాకార ముక్తిగాను,అవి పొంది తాను కృతార్థుడనైనానని,సాయుజ్యము గురించి స్వామికే వదిలివేస్తున్నానని కృతార్థను తెలియచేస్తున్నారు.  ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.ఏ రూపమో తెలుసుకోలైని మనసు కన్ను అనే ఇంద్రియమును చేరి రూపమును స్వీకరిస్తుంది.అదే పరమేశుని రూపమును ఊహించుకొని దర్శించినప్పుడు దానికి సర్వోపచారములను చేస్తూ సంతసిస్తుంటుంది.దీనిని మనము సారూప్య భక్తిగా భావించవచ్చును.  అంతటితో తృప్తి చెందక మనసు వాగింద్రియమును కూడి సంకీర్తనగా మారి ఆ స్వరూప సమీపమును చేరుతుంది.లేదా ఆ స్వరూపమునకు దగ్గరగా తానున్నానని భావిస్తుంది.  అదే మనసు చెవి అనే ఇంద్రియమును కూడి శ్రవనానందమును పొందుతుది.   సామీప్యమును అందించగలశక్తిని మనసుకు స...

NA RUDRO RUDRAMARCHAYAET-27(SIVANAMDALAHARI)

Image
 శ్లో : కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ గృహస్థే స్వర్భూజా(అ)మర-సురభి-చింతామణి-గణే శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే(అ)ఖిల శుభే కమ్-అర్థం దాస్యే(అ)హం భవతు భవద్-అర్థం మమ మనః 27  ప్ర్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు పరమేశ్వరునకు తన మనసును సమర్పిస్తున్నానని అంతకు మించి తాను అర్పించుటకు స్వామి అడుగుటకు వేరేదేమి లేదని స్వామి వైభవమును ప్రస్తుతిస్తున్నారు.నిజమునకు ఇంతకు ముందు ఆశ్లోకౌలలో పలుమారులు మనసు ప్రస్తావన వచ్చినది.  7.వ శ్లోకములో మనస్తే పాదాబ్జే అంటూ,స్వామి నా మనస్సు నీ పాదపద్మములయందు స్థిరపడియుండునుగాక అన్నారు.  11.వ శ్లోకములో -యదీయం హృత్పద్మం యది భవదధీనం అంటూ మరొక్కసారి నొక్కిచెప్పారు.  12.వ శ్లోకములో సైతము "యస్తైవాంతః కరణం అపి శంభో తవ పదే స్థితం" అని మరీ మరీ చెప్పారు.  అప్పుడు శంకరులవారికి స్వామి అనుగ్రహించిన దర్శనమునకు అతీతముగా ప్రస్తుత శ్లోకములో అనుగ్రహించారేమో అనిపిస్తున్నది.  ఎందుకంటే స్వామి స్థితికారకత్వమునకు సంకేతములుగా ఏవేవి స్వామిని సేవిస్తున్నాయో సంకీర్తిస్తూ,నిజమునకు అవి స్వామి పాదముల దగ్గర సర్వశుభంకరములుగా సన్నుతింపబడుతున్నాయనటం వెనుక సర్వేశ్వర...

NA RUDRO RUDRAMARCHAYAET-26( SIVAANAMDALAHARI)

Image
 శ్లో : కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాన్ఘ్రి- యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లి ష్యాఘ్రాయ స్ఫుట-జలజ-గంధాన్ పరిమళాన్ - అలభ్యాం బ్రహ్మాద్యైర్-ముదమ్-అనుభవి ష్యామి హృదయే   ప్రస్తుత శ్లోకము సహస్రారమునుండి ద్రవిస్తు-ఆశీర్వదిస్తున్న సుధాసారమును ప్రస్తావిస్తు,దానిని స్థిరముగా నిలుపుకోవటము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.పూర్వపు శ్లోకము ద్రష్ట్వా అంటూ దర్శనమునకు ముందటి పరిస్థితిని తెలిపితే ప్రస్తుత శ్లోకము దృష్ట్వా అంటు దర్శనభాగ్యమును కలిగించినది.దర్శనము మాత్రమే కాదు స్వామి దివ్య పాదపద్మములను కన్నులలో,శిరములో,కన్నులలో,వక్షములో దాచుకుంటూ,స్వామి పాదపద్మములనుండి పరిమళిస్తున్న సుగంధమును ఆఘ్రాణించే సౌభాగ్యమును ప్రసాదిస్తున్నది.  ఇది కేవలము బాహ్య ఇంద్రియమైన నాసిక గుర్తించకలిగినదికాదు.వసి వాడని,వన్నె తగ్గని పరిమళము అందిస్తున్న పరవశమును పొందే భాగ్యము నేను ఎప్పుడు పొందగలనో కదా.   ఇంద్రియాతీతమైన అనుభవము.మనసు కేంద్రీకృతము అయినప్పుడు మాత్రమే లభించే అనుగ్రహ ఘ్రాణము.కన్నుల్లో దృశ్యమైన ,మనసులో తిష్ఠవేసుకొనిన పాదపద్మములు చేజారిపోకుండా దాచుకునే ప్రయత్నము మ...

NA RUDRO RUDRAMARCHAYET-25(SIVANAMDALAHARI)

Image
 శ్లో : స్తవైర్-బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిర్- నియమినాం గణానాం కేళీభిర్ -మదకల-మహో క్షస్య కకుది స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిశ్ట- వపుషం కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖండ-పరశుమ్    ప్రస్తుతశ్లోకములో శంకరులు సదాశివుడు        ఇంతకు పూర్వము అధర్మమును ఏ విధముగా అంతమొందించినో తెలుపు సంకేతములుగా త్రినయనం-మన్మథుని మాయంచేసిన నీ మూడవకన్ను ధర్మమునకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నది.నీ నీలకంఠము అసురత్వమును అణచివేసిన దానికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నది .ధర్మమునకు గ్లాని సంభవింపనీయని  నీ చతురతయే నీ ఒక చేతనున్న( విచ్చలవిడి మనస్తత్త్వమునకు సంకేతమైన) మృగము,మరొక చేతను దానిని దండించగల ఖండపరశువు.   అధర్మము అంతరించిన వేళ జరుపుకొను  ఆనందోత్సాహము బ్రహ్మాదుల స్తవములే కావచ్చును,మునుల జయ జయ ధ్వానముల                  స్తోత్రములే కావచ్చును,ఎద్దుమూపురమునెత్తి వేయు రంకెలే  కావచ్చును,ప్రమథగణములు చేయు వాయిద్య సంబరమైనా కావచ్చును.అంతటి సంతోషమునకు కారణము స్వామి ఉమాశ్లిష్టుడై వారికి సాక్షాత్కారమునొసగుటయే కారణము.నేను సైతము అంత...

NA RUDRO RUDRAMARCHAYET-24

Image
  శ్లో :  కదా వా కైలాసే కనక - మణి - సౌధే సహ - గణైర్ - వసన్ శంభోర్ - అగ్రే స్ఫుట - ఘటిత - మూర్ధాన్జలి - పుటః విభో సాంబ స్వామిన్ పరమ - శివ పాహీతి నిగదన్ విధాతౄణాం   కల్పాన్ క్షణమ్ - ఇవ వినేష్యామి సుఖతః     సదయ సుఖయ- సత్వర దర్శన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థించిన శంకరులు ప్రస్తుత శ్లోకములో " కదావై కైలాసే'అంటూ కనక్మణిశోభితమైన కైలాసములో,ప్రమథగణ సేవుతుడగుచున్న స్వామిని ఎప్పుడు చూడగలుగుతానో కదా అని దీనముగా వేడుకుంటున్నారు.  సందర్శన భాగ్యమును కోరిన ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో సాయుజ్య భక్తిని ప్రసాదించమని కోరుతున్నాఉ.దృష్ట్వా-అదృష్ట్వా అను రెండు పదములతో నిత్యదర్శనానుగ్రహమును కోరిన శంకరులు,మనకు నమస్కార ముద్రను పరిచయము చేస్తున్నారు.ఎనిమిది వేళ్ళూ ఊర్థ్వముఖపయనమునకు సంసిద్ధమైనవేళ,రెండు వేళ్ళు సాధకుని అంతరంగము వైపునకు చూపిస్తూ,దశ ప్రాచీ-దశదక్షిణ అన్న తత్త్వానికి అద్దముపడుతుంటాయి.అద్వైత్వముగా జీవాత్మను ఒకచేతి ఐదువేళ్ళు చూపిస్తుంటే,పరమాత్మను మరో ఐదువేళ్ళుచూపిస్తు,జీవాత్మ-పరమాత్మ సంగమమునకు సంకేతమౌతున్నది.నమస్కారము.  ప్రస్తుత శ్లోకము,  కదావా వినే...

NA RUDRO RUDRAMARCHAYAET-23(SIVAANAMDALAHARI)

Image
  శ్లో :  కరోమి త్వత్ - పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వమ్   దిశసి ఖలు తస్యాః ఫలమ్ - ఇతి పునశ్చ త్వాం ద్రష్టుమ్   దివి భువి వహన్ పక్షి - మృగతామ్ - అదృష్ట్వా  తత్ - ఖేదం కథమ్ - ఇహ సహే శన్కర విభో      23 సాధకుడు స్వామి క్షిప్రప్రసాదత్వమును కోరుకొనుచున్నాడు.అదియును నిరంతర దర్శనభాగ్యమును అభిలషిస్తున్నాడు. నిత్యపరమానంద సుఖమును స్వామి వీక్షణము వలన కలుగు పరమానందమును ఆదిశంకరులు కోరుకొనుచున్నారు. హేవిభో-హే పరమేశా! నీ సర్వవ్యాపకత్వమును తెలిస్కొనగలిగిన జ్ఞాననమును,సవమునందు నిన్న దర్శించగల వరమును ప్రసాదించుము. ఈ శ్లోకములో ఆదిశంకరులు స్వామి దర్శన సౌభాగ్యమును వరముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. పూజ అను పదము పునర్జన్మములేకుండా చేయుమని వేడుకొనుటకు సంకేతముగా పెద్దలు భావిస్తారు. ఆదిశంకరులు తాము స్వామిదర్శనమునకు నోచుకోని ఎడల సంభవించే దుఃఖమును భరింపజాలనని కనుక సర్వవేళలందును సన్నిధిలో నుండనిమ్మంటున్నారు. దర్శనాభిలాషను మరింత ప్రస్పుటముచేస్తూ దానికి అవరోధముగా నున్న అహంకారమును తనకు కలుగనీయవద్దన్న దానికి సంకేతముగా బ్రహ్మ హ...

NA RUDROE RUDRAMARCHAYAET-30

Image
 న రుద్రో రుద్రమర్చయేత్-30    *********************  "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై  ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం  బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన  వా  డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరుని, నే శరణంబు వేడెదన్."    బమ్మెర పోతన మహాకవి.(గజేంద్ర మోక్షము)  స్థూలమును గమనిస్తూ,దానిలో దాగిన సూక్ష్మమును   గ్రహించగలుగుటయే   ఈశ్వరానుగ్రహము.                      స్థూలములో తాబేటిని చూస్తుంటే దాని అవయములను కాసేపు ముడుచుకొని,తన డొప్పలో దాచేసుకొని,మరికొంత సేపు బయటకు విస్తరింపచేస్తూ,తాను మాత్రము ఎటువంటి వికారమును పొందకుండా స్థిరముగా నుండు సూక్ష్మ భగవతత్త్వమును అర్థముచేసుకొనగలుట భగవంతుని మీఢుష్టత్వము.    నిక్షిప్త-ప్రక్షిప్త శక్తులను సమయానుకూలముగా వ్యక్తీకరిస్తూ,విశ్వపాలనమును నిర్వహించు పరమాత్మను, నేను శరణము వేడుచున్నాను.  ప్రియ మిత్రులారా!    ఈ కార్తిక మాసమునకు మనము చేయు బిల్వార్చనమునందు "మీఢుష్టమ" అనే పదమును అర్థము చేసుకు...

NA RUDRO RUDRAMARCHAYAET-29

Image
    న రుద్రోరుద్రమర్చయేత్-29   ********************  " జితం జితం తే జిత! యజ్ఞ భావన!    త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః    యత్ రోమగర్తేషు నిలిల్యురధ్వరాః    తస్మైనమః కారణ  సూకరాయతే."-యజ్ఞో వై విష్ణుః.   యజ్ఞవరాహ స్తోత్రము.  యజ్ఞ స్వరూపుడవై,యజ్ఞరక్షకుడవై,వేద స్వరూపుడవై,వరాహరూపములో ప్రకాశిస్తున్న నీ శరీరములోని ప్రతి రోమకణములోను సమస్త యజ్ఞ కార్యములు నిండి యున్నవి.నీ నాలుగు పాదములే ఋత్విక్కులు,నీ నేత్ర చకనమే ఆజ్యము.నీ నాసికయే పెద్ద స్రుక్కు.నాసికా రంధ్రములు చిన్నగరిటెలు.నీ ఉదరము యజ్ఞకుండములోని అగ్ని.నీ చెవులు సోమరస పాత్రలు.నీ నోరు ఆహుతులు.నీ దంతములు అగ్నిహోత్రములు.  యజ్ఞ కర్తవు-యజ్ఞ భోక్తవు-యజ్ఞ హర్తవు నీవే అని దేవతలు యజ్ఞవరాహమూర్తిని ప్రస్తుతిస్తున్నారు.  ప్రియ మిత్రులారా!  సనాతన ధర్మము నా (స్త్రీ) ఉపాధికి నియమించిన పరిమితిలో ,ఈ రోజు బిల్వార్చనమును "యజ్ఞ" శబ్ద వైభవమును గ్రహించే పయత్నము చేస్తాను.   చమకములో చెప్పినట్లు సామర్థ్యమునీయమని అమ్మను ప్రార్థిస్తూ,ప్రారంభిస్తాను.   పరమ పావనమైన  నీపాదరజ కణము...

NA RUDRO RUDRAMARCHAYAET-28

Image
    న రుద్రో రుద్రమర్చయేత్-28  ******************  "" ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం     వందే "మహోదార తర" స్వభావం  ఘృశ్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే"   స్వామి మహా ఔదార్యమును చెప్పకనే చెబుతున్నది పై ధ్యాన  శ్లోకం.   మనో వాక్కాయ కర్మలను మారుస్తూ స్వామి చేసే లీలను మానవమాత్రురాలిని నేనెలా గుర్తించగలను.  నేటి సాత్వికము రేపు తామసమునకు పెద్దపీట వేయగలదు.యుక్తాయుక్తమును దూరముచేయగలదు.మంచి-చెడుల మధ్య తాను దాగి మాయ,  మనలను ఆడించగలదు.లేవలేనంత పతనములోనికి పడవేయగలదు. అదియే తనలో నిజమును గ్రహించలేని మాయాజాలము.  మనము చెప్పుకోబోవు కథలోని రెండు పాత్రలు అక్కా-చెల్లెలు.ఒకరు మాయామోహితులు-మరొకరు మాయాతీతులు.  వారిలో ఒకరిని వశపరచుకొనిన అసూయ తీవ్రమై ఏ విధముగా దురాకృతములను చేయించినదో,మరొకరి దరిచేరలేని అరిషడ్వరగములు స్వామి మహోదారత వలె ,ఎంతటి ఔదార్యమును ప్రదర్శించినదో తెలుసుకుందాము.  ప్రియ మిత్రులారా!     ఈనాటి మన బిల్వార్చనలో మనము " అసూయ" అను పదము తెచ్చిన అనర్థములను గురించి,వానిని అవలీలగా దాటించిన మహోదా...

NA RUDRO RUDRAMARCHAYAET-27

Image
    న రుద్రో రుద్రమర్చయేత్-27  *************************  -బాణాసుర కృత శివస్తోత్రము.  ********************** 1. మహాదేవ మహాగురు సురేశ్వర నీలకంఠ    యోగబీజ యోగరూప యోగీశ్వర నమోనమః. 2.జ్ఞానబీజం జ్ఞానరూపం జ్ఞానానందం సనాతనం   తపోఫలానుగ్రహం దైవం సర్వసంపత్ప్రదాయకం 3.తపోబీజం తపోరూపం తపోధనం సదాశివం   కరుణబీజం కరుణరూపం చిన్ముద్రం చిదంబరం 4..నరకార్ణవతారణం భుక్తి-ముక్తి ప్రదాయకం   అశుతోషం సుప్రసన్నం అవ్యాజము అనుగ్రహం 5.హిమవాసం చంద్రమౌళిం శ్వేతపద్మ ప్రకాశకం   బ్రహ్మజ్యోతి స్వరూపము భక్తానుగ్రహ విగ్రహం. 6.పంచభూతం పంచేంద్రియం పంచామృతం బహురూపం   జలరూపం అగ్నిరూపం నింగిరూపం దిగంబరం 7.వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహాత్మకం   చిద్రూపం స్వస్వరూపం విరూపాక్షం విశ్వరూపం 8.శక్తిస్వరూపం ఈశ్వరం భక్తానుగ్రహ విగ్రహం   వేదస్తుతం పరమపూజ్యం త్రిభువనరక్షకం. 9..అపరిచ్చిన్నం ఆదిదేవం అవాఙ్మానస గోచరం   వ్యాఘ్రచర్మాంబరధరం మందస్మితం మహేశ్వరం   త్రిశూల పట్టిధరం కరుణం చంద్రశేఖరం. 0.శంకరం చరణంశరణం నిత్యం బాణసన్నుతం    భక్తహృదయనివాసం దుర్వ...

NA RUDRO RUDRAMARCHAYAET-26

Image
     న రుద్రో రుద్రమర్చయేత్-26    **************************   " యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై   సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే."   సద్భక్తిని-ముక్తిని ప్రసాదించగల విశేషపూజనీయునకు నమస్కరించుచున్నాను.   ఈశ్వరార్చనకు ఉపాధి నియమములేదు అనుటకు మనము ఎన్నో కథలను విన్నాము.కావలిసినది నిష్కళంకభక్తి మాత్రమే.ఆ భక్తి తాత్కాలికమే అయినప్పుడు దాని వలన లభించిన వరప్రభావము కూడా బాహ్యముగానే ఉంటుంది కాని భగవంతుని చేరదానికి చేదోడు కాలేదు.   ప్రియ మిత్రులారా ఈ నాటి బిల్వార్చనలో మనము "యాతుధాన్య:" పదమును తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.  పెద్దల అభిప్రాయము ప్రకారము,  "యాతులు" అనగా దుఃఖమును కలిగించు మాయలు.అట్టి మాయలు కలిగినవారలు యాతుధాన్యులు.  నమకములో సైతము వీరి ప్రసక్తి వచ్చినది.  నమకములో అసుర శక్తులు-వానిని తొలగించి మనలను రక్షించే రుద్ర ప్రస్తావనము.  1. అనువాకము-6వ మంత్రము  " అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్    అహీగుంశ్చ సర్వాన్ జంభయంథ్ సర్వాశ్చ యాతుధాన్యః."   ఇందులోని ...

NA RUDRO RUDRAMARCHAYAET-25

Image
   న రుద్రో రుద్రమర్చయేత్-25   **********************  "మథురం శివమంత్రం మదిలో మరువకె ఓ మనసా  ఇహపరసాధనమే-       నరులకు సురుచిర పావనమే  ఆగమ సంచారా-నా స్వాగతమిదె గొనుమా  భావజ సంహార- నన్ను కావగ రావయ్యా."   ప్రియ మిత్రులారా ఈ రోజు బిల్వార్చనములో మనము "ఇషు" శబ్ద ప్రాశస్త్యమును తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము.  ధనుస్సు- నారి- బాణములు విలుకాని ఆభరణములు.  సంరక్షణకు ఆయుధములు.  అందులో మనకు కనిపించునవి పదునైన బాణములు చేయుచున్న పరాక్రమములు.కాని నిజమునకు ధనువు సహాయము చేయకపోతే అవి నిర్వీర్యము .ఆ ధనువునకు కట్టబడిన గుణము/నారి బిగుతుగా లేకపోతే విలువిద్య విలువేమిటో  తెలుసుకోగలమా?  కాని నిజమునకు విల్లు- నారి- శరములు  మన ప్రవర్తన           సంకేతములు.    మనము చర్చింకోబోతున్న కథనము నరునిది/అర్జునునిది.    కాదు కాదు నరులది.అంటే మనందరిది.  అందులో ప్రకటించిన కోపము-ప్రదర్శించిన రోషము జీవుని-దేవుని మధ్య అనవరతము జరుగుచున్నదనుట కాదనలేనిది.   తపము నెపము.తపమును తాపముగా/కోపముగా...

NA RUDRO RUDRAMARCHAYAET-24

Image
     న రుద్రో రుద్రమర్చయేత్-24    ************************     జటాజూటధారి-శివాచంద్రమౌళి    నిటాలాక్ష నీవే-సదా మాకు రక్ష.    ప్రియమిత్రులారా ఈనాటి బిల్వార్చనలో మనము జట శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   శిష్తరక్షన-దుష్టశిక్షణ చేయగల స్వామి ప్రకటన శక్తి జట.   భగీరథుని అనుగ్రహించినది స్వామి. జటాజూట సహకారమేకదా .శాపగ్రస్తుదైన చంద్రుని శిరోలంకారముగా మలచినది స్వామి జటాజూటమే.స్థితికార్య సంకేతము స్వామి జటాజూటమే.జీవుల శరీర నాడుల ముడులు స్వామి జటాజూటములే.  దక్షయజ్ఞ సందర్భముగా ఆ జటనుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షుని అహమును నశింపచేసినాడు కదా.   స్వామి ఆకాసతత్త్వమును చెప్పునది స్వామి ఊర్థ్వ కేశపాసమే కదా.   ఎన్నో పుణ్నదులను ప్రవహింపచేస్తున్నది స్వామి జటయే.   నమకములో జట శబ్దమును,  2.వ అనువాకము 5వ మంత్రము  " నమో హరికేశాయ ఉపవీతినే " స్వామిని హరికేశునిగా వర్ణించినది.    నల్లని కేశములుగా కనుక అన్వయించుకుంటే   నమః శివాభ్యాం-నవ యవ్వనాభ్యాం"   ఆకుపచ్చని కేశములుగా అన్వయించుకు...