SARVANAMDAMAYACHAKRAMU-PARICHAYAMU

"కదంబ వన చారిణీం ముని కదంబ కాదంబినీం నితంబ జిత భూధరాం సురనితంబినీ సేవితాం నవాంబురుహలోచనాం అభినవాంబుదశ్యామలాం త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీం ఆశ్రయే" అనిప్రస్తుతించారు అమ్మను ఆదిశంకరులు. హయగ్రీవ-అగస్త్యసంవాదమైన లలితా రహస్య సహస్రనామస్తోత్రము, "మూలప్రకృతి అవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణి"అని సంకీర్తించింది. వ్యాపినీ వివిధాకారావిద్యావిద్యాస్వరూపిణి గా సన్నుతించింది. మూలప్రకృతి అంటే ఏమిటి? అది వ్యక్తరూపముగా ఎప్పుడుంటుంది? అది అవ్యక్త రూపముగా ఎప్పుడుంటుంది? పరమాత్మ తాను ప్రకాశ+విమర్శ రూపమైన పరంజ్యోతిగా ప్రకాశించటము పరారరహస్యయోగము.అదియే మనము బిందువు రూపముగా తెలుసుకోబోతున్న "సర్వానందమయ చక్రము" పరంజ్యోతి పరమేశ్వరి , 'సత్యజ్ఞానందరూపా-సామరస్య పరాయణా" గా ప్రకాశములో అంతర్లీనమైన అద్భుత సన్నివేశము. సర్వానందమయ చక్రము-తొమ్మిదవ ఆవరణము ***************************** సర్వసిద్ధిప్రద-సర్వమంగళకారిణి అయిన పరమేశ్వరి, సర్వులకు-సర్వవేళల-సర్వవిధములుగా ఆనంద...