CHIDAANAMDAROOPAA-ERIPAATA NAAYANAARU
"ప్రౌఢోஉహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ
దష్టో నష్టోஉవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మేஉపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"
చిదానందరూపా- ఎరిపాత నాయనారు
*********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కనుగానక కమ్మిన మైకము హానిని చేయనీయక
పరశును చేతదాల్చి పరమేశుని భక్తుల సేవచేయు
తా చేసిన పాప-పుణ్యముల తడబడనీయక
చూసిన శివాపరాధమును చివాలున గొడ్డలి విసిరివేయు
ఏనుగు చేసిన ఘోరము ఎదకోయగ ఆ ఎరిపాతకు
ఏమరుపాటును సేయక ఆ కరినే తను హతమార్చెను
కామ సంహారుని కొలువగ తానును సంహారమునెంచు కొనియెగ
గజవదనుని తండ్రిని చేరగ గజమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక
అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు. శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.) .
దష్టో నష్టోஉవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవీచింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మేஉపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"
చిదానందరూపా- ఎరిపాత నాయనారు
*********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కనుగానక కమ్మిన మైకము హానిని చేయనీయక
పరశును చేతదాల్చి పరమేశుని భక్తుల సేవచేయు
తా చేసిన పాప-పుణ్యముల తడబడనీయక
చూసిన శివాపరాధమును చివాలున గొడ్డలి విసిరివేయు
ఏనుగు చేసిన ఘోరము ఎదకోయగ ఆ ఎరిపాతకు
ఏమరుపాటును సేయక ఆ కరినే తను హతమార్చెను
కామ సంహారుని కొలువగ తానును సంహారమునెంచు కొనియెగ
గజవదనుని తండ్రిని చేరగ గజమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చు గాక
అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు. శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.) .
Comments
Post a Comment