ADIVO-ALLADIVO RAAMAANUJAARYULU
సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి శయనములు
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
పెరుంబుదూరులో కాంతిమతి కేశవాచార్యులకు
ఇళయపెరుమాళ్ళుగా ప్రకటితమైనది ఆదిశేషువు
కులవ్యవస్థను ఖండించె కంచిపూర్ణుని గురువుగ దలచె
ఆళ వందార్ విశిష్తాద్వైత బహుళ వ్యాప్తి చేసె
అత్యంత గోప్యమనే అష్టాక్షరి మంత్రమునే
శ్రీ రంగరాజ గోపురమెక్కి అందరికి ఉపదేశించె
యమునాచార్య హస్త సంకేతమును గ్రహించి
మూడు మంచిపనులతో ముజ్జగములను బ్రోచె
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థము చాటి రామానుజుడు పూజనీయుడాయెగ.
Comments
Post a Comment