SAUNDARYA LAHARI-01

  శ్రీమాత్రే నమః
  ***********
  పరమ పావనమైన సౌందర్య లహరి ఆవిర్భావమునకు సంబంధించిన ఒక ప్రస్తావనతో నేను నా ప్రయత్నమును ప్రారంభిస్తాను.పరమశివుడు 5 స్పటిక లింగములను ,అమ్మవారు ఒక పుస్తకమును మన శంకరులకు వాత్సల్యముతో అనుగ్రహించారట.కాని నందీశ్వరుడు వానిని తీసుకుని పుస్తకములోని సగభాగమును మాత్రమే శంకరులకు ఇచ్చి,కాగల-రాగల మి గిలినభాగమునకు కారణమయ్యాడట.అవియె 41 శ్లొకములు గల ఆనంద లహరి,51 శ్లోకములు గల సౌందర్యలహరి.పరమేశ్వర లీల పరిణామములు పరమాద్భుతములు-పతిత పావనములు. 

  అమ్మ అనేది ఒక రూపముకాదు.అది ఒక తత్త్వము.మనము బాహ్య రూపముతో ఆగిపోకుండా సాగిపోతు అమ్మ తత్త్వమును తెలిసికొని,తన్మయమగుటకు ప్రయత్నించాలి.ఆనందకరమైన అచంచలమైన అజరామరమైన ప్రతిది అందమే.సర్వ ఉపనిషత్తులు ప్రతిపాదింపబడిన తత్త్వమే అమ్మ.పరబ్రహ్మ తత్త్వమే ఆనందము.చిదానందము అంటే ఇంద్రియాతీత పరతత్త్వము.శుభకరమైన శుభములను ప్రసాదించునదైన అందమే సౌందర్యము. 

        స్థూల,సూక్ష్మ,సూక్ష్మ తర,సొక్క్ష్మ తల సౌందర్యము.నాలుగు కలిసినది సౌందర్యము.ముందు స్ఫురించేది స్థూల సౌందర్యము ఆ సౌందర్యము జ్యోతిర్మయము.మనది మాంస మయము...పుట్టుట,కొంతకాలము ఉండుట,మార్పు చెందుట,పెరుగుట,క్షీణించుట,,నశించుట 
 అను ఆరు దోషములు కలది మానవ శరీరము.అమ్మకు ఆ ఆరు దోషములు లేవు.ఎప్పుడు ఉండే తత్వము అమ్మ అందుకే అనవద్యాంగీ.సూక్ష్మ సౌందర్యము మంత్రము.స్థూలము కంటే సూక్ష్మమునకు శక్తి ఎక్కువ..స్థూలమునకు సారమే సూక్ష్మము ఎన్ని మంత్రములో అంతమంది దేవతలు.శక్తివంతమైన శబ్దమే మంత్రము.మంత్రము సూక్ష్మసౌందర్యము.మంత్రశక్తి ఆ రూపములో ఉండును.ఆ శక్తియె సౌందర్యము.ఆ సౌందర్యము సుధాసాగరమున అనుగ్రహమను కెరటములతో అనవరతము మనలనందరిని అనుగ్రహించు లావణ్య లహరి.అట్టి మణిద్వీపవాసినిని నా మనముననిలుపుకొని స్తుతులను మీ మీకు అందించుటకు యధాశక్తి ప్రయత్నిస్తాను.


    పెద్దమనసుతో దోషములను సరిదిద్దుతారన ఆశిస్తు-నిమ్మగడ్డ సుబ్బ లక్ష్మి.

  సౌందర్య లహరి-01
  *******************
 అర్థనారీశ్వరము  నా ప్రార్థనలు విన్నదో
 కామితార్థమీయమని కన్న కొడుకుతో నన్నదో

 అంబా సుత అవ్యాజ అనుగ్రహ పరిణామమొ
 అస్తవ్యస్త మస్తకము పుస్తకముగ మారినదొ

 చేతిలో ఘంటము తానై  చెంతనె యున్నదో
 శిరమొడ్డినదె తడవుగ నన్ను ఒడ్డునకు చేర్చినదో

 ఆదిపూజ్యుని తల్లి నీ పాదధూళి రేణువునై
 అక్షరములను అమర్చనీ అద్భుత స్తోత్రములుగ

 అసాధ్యములు  నీ దయచే సుసాధ్యములగుచున్నవేళ,
 అవ్యాజ కరుణ వైపు అడుగులు వేయుచున్న వేళ,నీ

 మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ  సౌందర్య  లహరి.

    నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.నీ దయచే నా అవకతవక మైన తెలివి అమరిన పుస్తకమైనది.తల్లి నాచేయి పట్టుకుని తన గురించి తానే వ్రాసుకొనుచున్నది.ఎటువంటి ఆటంకములను దరికి రానీయవద్దని కన్నకొడుకైన వినాయకునితో చెప్పినది.అక్షర రూపలను జతచేయుచు అందమైన స్తోత్రములను అందించుచున్న జగజ్జనని, నీ ప్రక్కనే నున్న నా వేలిని ఎన్నడు విడిచిపెట్టాకమ్మా.నీకు
నమస్కారములు.  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)