SAUNDARYA LAARI-30

సౌందర్య లహరి-30
పరమ పావనమైన నీ పాద రజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఉండి,పోవునవియేగ మానవ నాలుగుదశలు
ఉండి పోవునవి యేగ మనిషి కోపతాపములు
ఉండి,పోవునవియేగ ఋతువులు ఏడాదిలో
ఉండి, పోవు వారేగ రవిచంద్రులు దినములో
ఉండి, పోవునవేగ ఆకలిదప్పులు జీవికి
ఉండి ,పోవునదియేగ ఈ జగతి ప్రళయములో
ఉండి,పోవునవియేగ మంచిచెడులు మనుగడలో
ఉండి,పోవు ఈ జీవి నీ పదములకడ ఉండిపోవుచున్నవేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న ఓ తల్లీ.ప్రతి మనిషి జీవితములోని బాల్య,కౌమార,యవ్వన,వార్థక్య దశలు ఉండి మారిపోవు చుండును.పగలు సూర్యుడు,రాత్రి చంద్రుడు ప్రకాశించి అస్తమించుచుందురు.మనిషిలోని స్వభావములు మారుచుండును.ఋతువులు కాలచక్రములో మారుచుండును. జగతి ఉండి ప్రళయములో మునిగిపోవు చుండును.ప్రతి జీవి జనన మరణ చక్రములో తిరుగుచు ఉండిపోవును.ఉండి-పోవు ఈ ప్రాణి నీ చరణములకడ ఉండిపోవునట్లు అనుగ్రహించుము.అనేక వందనములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)