PARICHAYAMU

శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే ********************************* " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే". శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు.బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు . " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం." ఆళ్వారులులలో ఒకరైన ఆండాళ్ తల్లి (సాక్షాత్తు భూదేవియే) తనను తాను ఒక సామాన్య గోపిక వలె భావించుకొని,వివిధ స్వభావములు కలిగిన గోపికలను ఎంతో ఓర్పుతో-నేర్పుతో తనతో కలుపుకొనుచు,అందరు కలిసి పర ...