MARGALI MALAI-21
మార్గళి మాలై-21
******************
ఇరవైఒకటవ పాశురం
****************
ఏత్తి కలంగళెదిర్పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియం వళ్ళన్ పెరుం పశుక్కళ్
ఆత్తపడైత్తాన్ మగనే! అరివురాయ్
ఉత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్ర శూదరే!తుయిళెలాయ్;
మాత్తార్ ఉనక్కు వలితులైందు ఉన్ వాశర్ కణ్
అత్తాదు వందు ఉన్ అడిపణియు మాపోలే
పోత్తియాం వందోం పుగళందు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
శ్రీనీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము.
తల్లడిల్లు గోపికలకు తలుపును తెరిచినది నీల
మరువలేదు మీ ప్రార్థనలను నేనును మీ పక్షమే
స్వామికి నివేదించ తగిన సమయమునకై వేచితిని
మరియొక మాట మగువలార! భగవానుని మరిమరి
మానవుడు-మన వాడను భావనను కలుగచేయవలెనుగా
గోపాలురు-గోసంపద-గోపికలను జ్ఞప్తిచేయు విధముగ
యశోద-నందులను మరిమరి కీర్తించండి
యదుకుల భూషణుడను లీలలను చాటండి
దాసోహులు గోపికలు దర్శన ధన్యత గాంచిరి
ఆనందింపచేయదలచినది అమ్మ తాను ఆచార్యుడై.
అత్యద్భుతమైన ఈ పాశురములో అమ్మ స్వామి గోవింద అవతార విశేషములను గుర్తుచేస్తూనే,నీలమ్మ ద్వారా చమత్కర సంభాషనా చాతుర్యమును మనకు పరిచయము చేస్తున్నది.
మొదటిది గోకుల పశువులు ఏ విధముగా పాలు కుండలనుండి వస్తున్నాయా-లేక వాటి పొదుగు నుండి వస్తున్నాయా తెలుసుకోలనట్లున్నడట గోసంపద.
గోదమ్మ గో-వాక్కులను,తమకు తామే అనుగ్రహముతో కురింప్పించు ఆచార్య వైభవమును స్వామిని కీర్తిస్తూ,తెలియచేస్తున్నది.
గొల్లవాడు ఏ విధముగా గోవులను కట్లువిప్పి కొంచముసేపు బయటకు తీసుకుని వెళ్ళి,తిరిగి వాటిని రాటకు బంధిస్తాడో,అదే విధముగా మన గొల్లవాడు జీవులను మనలను సంసారమనే రాటికి కట్టుతూ-విప్పుతూ లీలలను చేస్తుంటాడు.
ఇంతలో నీలమ్మ ఏమయ్యా స్వామి నీవు పాలకడలిలో శేషసాయివై నిదురిస్తున్నావా? మా ప్రార్థనలు నీకు వినబడుటలేదనుకుందామా అంటే/ కానేకాదు గోపికలైన మమ్ములను ఉధ్ధరింపగ గోపాలుడిగా గోకులములో పుట్టినావు.
పోనీ వైకుంఠములో లక్ష్మీపిరాట్టితో పాచికలాడుచున్నావా అంటే అదియును కాదు.ఎందుకంటే నీలాదేవి సాక్షాత్తు లక్ష్మీస్వరూపమే కదా! దీనజనోధ్ధరణకై తానును గోపికల పక్షము వహించి,(పురుస్షకారము చేసి) స్వామితో మేలమాడుతున్నట్లుగా కనిపించే హెచ్చరికను చేస్తూ,మేల్కొని వచ్చి మమ్ము అనుగ్రహించమంటున్నది.
Comments
Post a Comment