00

 జై శ్రీమన్నారాయణ.
*****************
భగవత్ బంధువులారా!సవినయ నమస్కారములు.

  సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించు సమయము ధనుర్మాసము.
మన శరీరము పంచేంద్రియములకు ప్రతీక."ధనుస్సు" అనే పదమునకు శరీరము అనే అర్థమును కూడ పెద్దలు నిర్వచించారు కదా.మన మనస్సు శరముతో పోల్చబడినది."పరమాత్మ అనుగ్రహము" అను గురి చూస్తు,మన శరీరమును ధనువులా సారించి,మనసు అనే బాణముతో,సర్వస్య శరణాగతి అను విలు విద్యను ఉపయోగించి,పరమాత్మ అనుగ్రహమునకు పాత్రులమగుటయే "ధనుర్మాసము" అని ఆర్యోక్తి.

  క్షమాపణ నమస్కారములతో నేను ఆండాళ్ తల్లి విరచిత తిరు-పావై దివ్య వ్రతమును మీతో పంచుకొనుటకు ప్రయత్నిస్తాను.ఎందుకంటే పరమాత్ముని గుణవైభవ సంకీర్తనమును పదిమందితో కలిసి చేసి,పరమానందమును పంచుకొనుట ఈ వ్రత లక్ష్యము కనుక.పరమాద్భుతమైన ఈ ద్రవిడ ప్రబంధము నవవిధభక్తి సమ్మేళనము.నవనీతచోరుని దివ్యలీలా తరంగము.

 మార్గళి మాలను సంస్కరించి,సుగంధభరితము చేయుట పెద్దసన్మానముగా భావించి పెరుమాళ్ స్వరూపులు నన్ను ఆశీర్వదించెదరు గాక.




ధన్యతనందించే ధనుర్మాస వైభవమును మనసా,వచసా,కర్మణా స్తుతించి,ఆచరించి,దర్శించి కృతకృత్యులైన మహాను భావులు ఎందరో
.
" అందరికి వందనములు."
మంద బుద్ధినైన నాపై అమ్మ కృపాకటాక్షము ప్రసరించినదేమో తెలియదు కాని,పదిమందితో పంచుకోవాలనే పరమార్థ తత్వమును, "నా" అనబడే ఈ జీవిలో ప్రవేశింప చేసి,
" నీ పాదము పట్టి నిల్చెదను
పక్కనె నీవు ప్రస్తుతి వ్రాయుమా" అని పలికించినది.

అవ్యాజమైన (ఏ అర్హత లేకుండానే) అమ్మదయతో, ఆండాళ్ తల్లి,అసలు పటుత్వమేలేని,నా చేతిని తాను పట్టుకొని,, శ్రీ రంగనాథ కృపా కటాక్షమనే కలమును పట్టించి,నా మస్తకమనే పుస్తకముపై,శ్రీ వ్రత శుభ సమయములో,"మార్గళి మాలై" అను దివ్య పరిమళ పారిజాత మాలను,"స్వామి కైంకర్యమునకై" అల్లుతోంది.ఇంతలోనే,ఇదేమి చోద్యమో! మాయా మోహితమైన (నా) అహంకారము దొంగలా ప్రవేశించి దోషములను ముళ్లను చేర్చుతోంది.
కావున సత్ చిద్రూపులారా! అన్యధా భావించక,మాలను సంస్కరించుటను," శ్రీ గోదా-రంగనాథుల సేవ" గా భావించి,సహకరించగలరని ఆశిస్తూ,
సవినయ నమస్కారములతో -మీ సోదరి.
సద్గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు.
( ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)