SARVASAUBHAAGYADAAYAKA CHAKRAMU-04
శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
సర్వార్థసాధక చక్రము-04
*****************************
పదునాలుగు శక్తుల అంతర్ చతుర్దశారము.సమ్యక్ప్రాదాన స్థానము.అదే సంప్రదాయ యోగినుల అనుగ్రహభావనము.
మనము నవావరన గమనమును మూడుభాగములుగా కనుక వర్గీకరించుకుంటే మనము మొదటి భాగమైన మూడు ఆవరనములను సందర్షించి యోగినిశక్తుల అనుగ్రహమునకు పాత్రులమైనట్లే.త్రైలోక్యమోహనచక్రములోని 28 యోగినులు,దర్వాశాపరిపూరకములోని 16 యోగినులు,సర్వసంక్షోభన చక్రములోని 8 యోగినులు రేకులుగా మార్గమధ్య బిందువులుగా మనకు సూచింపబడినారు
ఈ విభాగము మనకు త్రికోణ సంకేతములతో,ఒక ఊహావృత్తము చుట్టు ఉన్న 14 త్రికోనములను పరిచయము చేస్తున్నది.ఇకమీదట మనకు త్రికోణములే శక్తులకు ప్రతీకగా వివరింపబడతాయి.సూక్ష్మత్వమునకు ప్రతీకలుగా నాలుగు త్రికోణములు ఊర్థ్వముఖముగాను,స్థూలత్వమునకు సంకేతముగా ఐదు త్రికోణములు అథోముఖముగాను శ్రీచక్రములో సూచింపబడినాయి.ఊర్థ్వముఖకోనలను శివ కోణములగాను,అథోముఖకోణములను శక్తి కోణములగాను కూడా భావించే సంప్రదాయము మనది.
ఈ ఆవరనములోని పదునాలుగు శక్తులను పదునాలుగు లోకములతోను,పదునాలుగు మానవశరీర ముఖ్య నాడులతోను పోలుస్తూ అంతరార్థమును చెబుతుంటారు.
నాడీమండలముతో పోలిక ఉన్నప్పుడు మన్వస్రము అంటారు.బ్రహ్మనాడి యైన సుష్మ్న పనితీరును వివరిస్తూ,దానికి కుడి ఎడమనున్న ఇడ-పింగళ ప్రాధాన్యమును,మిగిలిన నాడీవ్య్వస్థను ,సాధకునికి అవగతము చేస్తారు.
రెండవపోలిక ఐన పదునాలుగులోకములలో ఏడు ఊర్థ్వలోకములు-ఏడు అథోలోకములు అని చెబుతూ,భౌతికముద్వరా ఆధ్యాత్మికమునకు వంతెనకట్టే ప్రదేశము.ఇందులోగల సర్వ ద్వంద్వ క్షయంకరీ శక్తి అనుగ్రహమే సౌభాగ్యప్రదము.ద్వంద్వములను వీడుట అంత సులభముకాదు.ద్ర్శ్యాదృశ్యములను సమీకరించుకోగల సామర్థను కలిగియుండవలెను.
మూడవ ఆవరణములోని అనంగ శక్తుల అనంతత్త్వమును గ్రహించిన సాధకుడు నాల్గవ ఆవరణములో వాని ఉనికిని సంక్షోభనము-విద్రావణము-సమ్మోహనము-స్తంభనము-జృంభణము మొదలైన స్థితులనధిగమించి ఏకత్వమును నకు వశుడై,రంజనుడై,మునిగిపోయి,ఆనందసంపదకు స్వాధీనుడై,ప్రణవములో మునిగి ద్వంద్వాతీతుడగుచున్నాడు.సత్తువైపునకు దృష్టిని మరల్చిన త్రిపురవాసిని నమస్కరించి,ఆరవ ఆవరణమువైపునకు తన అడుగులను వేయుచున్నాడు.

Comments
Post a Comment