Posts

Showing posts from September, 2022

PAAHIMAAM SIVADUTI-

Image
పాహిమాం శివదూతి-శివంకరీ-శ్రీమత్ సింహాసనేశ్వరీ **************************************  " బాలసూర్య ప్రతీకాశాం బంధుక ప్రసవారుణాం    విధి విష్ణు శివస్తుత్యాం దేవగంధర్వ సేవితాం    రక్తారవింద సంకాశం సర్వాభరణ భూషితాం    "శివదూతీం" నమస్యామి రత్నసింహాసన స్థితాం"    ఉదయభానుని ప్రకాశముతో ఎర్రని అరవింద పుష్పముల ప్రభలుకలిగిన ఆభరణములతో అనవరము బ్రహ్మ-విష్ణు-రుద్రాదులచే ,దేవ-గంధర్వులాదులచే స్తుతింపబడుతు రత్నసింహాసనమున ఆసీనురాలైన శివదూతి మాత మనలను అనుగ్రహించుగాక.  ఇక్కడ రక్తబీజుడు అనురక్తితో తన శరీరమునుండి కారుచు నేలపై బడుచున్న రక్తబిందువులచే అనేకానేక రక్తబీజులను వరప్రభావముతో సృష్టిస్తూ,తమ సైన్యములను పెంపొందించుకుంటు అమ్మను చూస్తూ,హేలనగా మాట్లాడుతున్నాడు.  అదే సమయములో వాని సంస్కరించదలచినదేమో అమ్మ అన్నట్లుగా అమ్మ ముందు శివుడు ప్రత్యక్షమై, "తతః ప్రతివృతాస్తాభిరీశానో దేవశక్తిభిః  హన్యంతాం అసురాః శీఘ్రం మమప్రీత్య... హ చండికాం" ఓ చండికా! నేను సంతసించురీతిగా ఈ రాక్షసులందరిని త్వరగా సంహరింపుము.అని పలుకగానే  అనగానే తల్లి అసలే  "శివా స్వాధీన వ...

PAAHIMAAM RAKTABEEJA NIHAMTRI-RAJARAJESVARI SAILASUTE

Image
 

SAPTAMATRKAA SAMSTHITA-SAILAPUTRI NAMOSTUTE

Image
   పాహిమాం సప్తమాతృకా సంస్థిత-రమ్యకపర్దిని శైలసుతే  ***************************************  "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై   అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి."    అని శ్రీదేవి స్తుతిమాలలో చెప్పబడినది.   శ్రీదేవిఖడ్గమాలగా ప్రసిద్ధికెక్కిన స్తోత్రములో వీరి ప్రస్తావన వస్తుంది.   "బ్రాహ్మీ-మాహేశ్వరీ-కౌమారీ-వైష్ణవీ-వారాహీ-మాహేంద్రీ-చాముండే-అనునవి పరోక్షముగా బ్రహ్మ-మహేశ్వరుడు-కుమారస్వామి-విష్ణుమూర్తి-వరాహస్వామి-మహేంద్రుడు మొదలగువారి శక్తుల యొక్క స్త్రీరూపములు.  సమరమున  చండ-ముండులు సమసిపోవుట తెలుసుకొని,రెట్టించిన క్రోధముతో శుంభుడు తనదగ్గరనున్న అనేకానేక దైతేయులను-ధౌమ్రులను-కాలకులను-కాలకేయులను దేవిపై దండెత్తుటకు రక్తబీజుని ఆజ్ఞాపించెను. నిజమునకు ఇక్కడ జరుగుచున్న సమరము చంచల మానవస్వభావమునకు-అచంచల దైవత్వమునకు సంకేతముగా చెప్పబడుచున్నది.  అనేకానేక తామసగుణ అవిరామ స్వైరవిహారము ఒకవైపు-ఏకత్వం జగత్యత్ర ద్వితీయం కం? మరొకవైపు.  దానిని గుర్తించలేని తామసమే తల్లిని బంధించుటకు చేయుచున్న నిష్ఫల ప్రయత్నములు.   తన నైజమును మార్చు...

PAHIMAAM CHAMUMDESVARI -RAMYAKAPARFINI SAILASUTE

Image
 పాహిమాం చాముండేశ్వరి-చల్లని తల్లి శైలసుతే  ************************************  జయస్వదేవి చాముండె-జయభూతాపహారిణి  జయసర్వగతేదేవి-కాలరాత్రి నమోస్తుతే  విశ్వమూర్తి యుతేశుద్ధే-విరూపాక్షి త్రిలోచని  భీమరూపే శివే విద్యే-మహామాయె మహోదరె  మనోజయె-మనోదుర్గే-భీమాక్షి క్షుభితక్షయే  మహామారి విచిత్రాంగి-గీతనృత్యప్రియే శుభే  వికరాళిమహాకాళి-కాళికే పాపహారిణి  పాశహస్తే-దందహస్తే-భీమహస్తే భయానకే  చాముండే జ్వాలామాలస్యే-తీక్ష్ణ దంష్ట్రే మహాబలే  అన్న స్తుతిని వింటున్నప్పుడు అప్రయత్నముగా మనోవీధిలో చాముండా దేవి దర్శనమిస్తుంది కరుణతో.  ఇప్పటివరకు మధుకైటభ సంహారము విష్ణువు ద్వారా అమ్మ పరోక్షసక్తిగా చేయించింది.  మహిషాసురుని సమిష్టి శక్తిగా మారి సంహరించింది.    దైవకార్య నిమిత్తము పార్వతి కౌశికి అను శక్తిని తన శరీరమునుండి ప్రకటింపచేసి,కాళిగా తాను హిమాచలమునకు మరలినది.   శుంభ-నిశుంభులను సంహరించుతకు వచ్చిన కౌశికి/అంబిక ,చండముండులకు ముక్తిని ప్రసాదించుతకై "కాళి" అను మరొక శక్తిని తన భృకుటినుండి ప్రభవింపచేసినది.  వారి మాటలు వినిన శుంభ...

paahimaam paramesvari kausiki-Sumbhanishudini sailasutae

Image
పాహిమాం కృపాకరి కౌశికి-రమ్యకపర్దిని శైలసుతే  ***********************************  " ఓం ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుః సాయకం    హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశు తుల్యప్రభాం   గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా   పూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్ధినీం."   ఒకసారి గంగాతీరమునందు సకలదేవతలు శరణార్థులై, " నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః   నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం"     అని ప్రార్థించుచుండగా, " భావనామాత్ర సంతుష్ట హృదయ" యైన భవాని గంగా జలములలో స్నానమాచరించుటకు అటుగా పోవుచు,వారిని చూసి,  మీరు ఎవెరిగురించి స్తోత్రములు చేయుచున్నారని అడిగెను.   వారు సమాధానమును ఇవ్వలేని దీనస్థితిలోనుండుట గమనించి,  పార్వతి శరీర కోశమునుండి ఒక దివ్యసుందర శక్తి ప్రకటింపబడి,తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానముగా,   వీరందరు శుంభ-నిశుంభులచే రాజ్యమునుండి తరుమవేయబడి,కనీసము హవిస్సులను సైతము పొందలేక జగన్మాతవైన నీ పదకమలముల శరణు కోరుతున్నారనెను.   ఇది సమరమునకు ఒకవైపునున్న ప్రకటనము.   మరొకవైపు?  ఎవరా శుంభ-నిశ...

PAAHIMAAM MAHISHAASURAMARDINI-RAMYAKAPARDINI-02

Image
  "శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి  చిదగ్నికుండ సంభూతా-దేవకార్య  సము సముద్యతా"  అని శ్రీలలితాసహస్ర రహస్యనామము నుతించుచున్నది.   అమ్మ చిత్ అగ్ని కుండమునుండి ఉదయిస్తున్న అసంఖ్యేయ సూర్య కాంతుల ప్రకాశముతో ఆవిర్భవించినది.శివుని త్రినయనమునుండి ప్రజ్వలింపచేసిన యజ్ఞకుండమునుండి అమ్మ అత్యంత ప్రకాశవంతముగా ఆవిర్భవించినది.సర్వదేవతా శక్తులకు  తన స్పర్శచే ,,సామర్థ్యమును ప్రసాదించినది.ముచ్చటగా తిరిగి వారిచ్చిన శక్తులను లాంఛనముగా తాను స్వీకరించినది.  అంతా అమ్మ లీలా వైభవము  ఇక్కడ అసురీశక్తులు-అద్వితీయముతో పోరాడుటకుసన్నిద్ధమగుచున్నవి.  " నాదం తనుమనిశం శంకరం"-శుభప్రదమైన ఓంకారము ఒక పక్కన "ఓంకార పంజరశుకీ "గా దర్శనమిస్తుంటే,  ప్రత్యర్థిగా   "నాదం తమసనిశం భీకరం" అంటూ విచక్షణతను మరచిన హుంకారము,    హుంకారము-ఓంకారముతో చేయు యుద్ధము,    అంతేకాదు  కన్నుపొడుచుకున్న కానరాని చీకటి-ఉదయిస్తున్న అనంత సూర్య బింబములతో చేయబోవుతున్న సమరము అమరమే కదా    ." మహిషాసుర నిర్ణాశి  భక్తానాం సుఖదే నమః  రూపం ద...

PAHIMAM MAHISHASURAMARDINI-RAMYAKAPARDINI SAILASUTE-01

Image
      పాహిమాం మహిషాసురమర్దిని-రమ్యకపర్దిని శైలసుతే *********************** ॥ (సౌందర్యలహరి)  "భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం-   ఇతి స్తోతుం వాంఛన్ కథయతి" భవాని" త్వమితి యః ।   తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం   ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా."   తల్లీ భవానీ!  ముకుంద-బ్రహ్మేంద్రాదులు వారి రత్నమయ కిరీటములతో శిరసు వంచి నీపాదపద్మములకు హారతులు పట్టుచున్నారు అని అమ్మను సంస్తుతిస్తున్నారు శ్రీ ఆదిశంకరులు.    క్షీణే పుణ్యం...పుణ్యము యొక్క హెచ్చు-తగ్గుల లెక్కలే కూడికల-తీసివేతలే జీవుల కర్మఫలితములు అని తెలియచేయు దివ్యచరితములే దేవికథలు-కథనములు.సూత్రధారియైన ఆ జగన్మాత ఎన్నో పాత్రలను/ఎందరో పాత్రధారులను కల్పించి కామితార్థములను అనుగ్రహిస్తుంది. అందుకు ఉదాహరణమే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాదులు,(మకుటనీరాజిత.)  భవాని త్వం దాసే అంటూ అమ్మను స్తుతించటము.    త్రిమూర్తులు మాత్రమే కాదు  శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో నుతింపబడినట్లు,తల్లి  "దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా"       ఆ పరాత్పరి అన...

PAHIMAAM sREERAJARAJESVARI-02

Image
   పాహిమాం మధుకైటభనాశిని-మంజులభాషిణి శైలసుతే  ***************************************  " ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీం శిరః     శంఖం సందధీతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం       నీలాస్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం       యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతం మధుకైటభం."     ఖడ్గము-చక్రము-గద-బాణములు-విల్లు-పరిఘ-శూలము-ఆయుధములుగా ధరించి,చేతిలో అగ్నిపాత్రతో,శంఖముతో,మూడుకన్నులతో,భూషణములతో,నీలమణి కాంతులతో ప్రకాశించుచు ,     ఎవరు   కలవరపడుచున్న కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మను,యోగనిద్రలో నున్న అనంత నాభుని మధుకైటభుల బారి నుండి రక్షించినదో,    ఆ జగన్మాత నిర్హేతుక కృప,నా కరమున కలముగా మారి,కళ్యాణప్రదమైన తన అనుగ్రహమును వివరించుచున్నవేళ,నన్ను గమనించనీయకుండా నా అహము దానిలో తప్పులను కుప్పలుగా కుప్పిస్తూ తనపని తాను చేసుకుని పోతూనే ఉంటుంది.  " యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం".....తత్సర్వం క్షమ్యతాం దేవి"   ఆ తల్లి నా దోషములను సవరించి,నన్ను మన్నించును గాక.    ఎవరీ మధు-కైటభులు...

PAAHIMAAM SREE RAAJARAAJESVARI-INTRO

Image
పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి- కృపాకరి శంకరి ************************** "అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయినీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరి" ఏది ప్రమాదమో/ఏది ప్రమోదమో తెలియక జీవులు ఇంద్రియములచే బంధింపబడి,విచక్షణను మరచిపోయి,వింతపోకడలతో కన్నుమిన్నుకానక విధ్వంసమునకు సిద్ధమైన సమయమున, "దేహి ముదం దేహి సింహవాహిని దయా ప్రవాహిని" అని సకలజగములు నిస్సహాయులై ప్రార్థించుచున్న వేళ,అవ్యాజకరుణతో, "పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే" తల్లి తనకు తానే బహుముఖములుగా ప్రకటితమయే బాధ్యతను స్వీకరించి,భవబంధనములను తొలగించివేస్తుంది. అట్టి పవిత్ర చరితములను స్మరించుట వలన,శ్రవణము వలన కలుగు జ్ఞానము సైతము శ్రీమాతఅనుగ్రహమే..ముగురమ్మల మూలపుటమ్మ ,సురారులమ్మ నిర్హేతుక కరుణయే. దేవిశరన్నవరాత్రుల పుణ్యసమయము.శరత్కాలపు వెన్నెల అమ్మ దరహాస చంద్రికలేగా. " ప్రపంచం శించతీ" అన్నారు ఆదిశంకరులు అమ్మ సౌందర్యమును స్తుతిస్తూ. మనము చకోరములై ఆస్వాదించుటకు సిద్ధమౌదామా ప్ర...

DEVAKARYA SAMUDBHAVA-RAKTESVARI/KALI

Image
  " రక్తబీజ వధే దేవి చండ-ముండ వినాశిని     రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి"       చందముండాసురులు చాముండ చేతిలో సమసిన తదుపరి దేవ-దానవ యుద్ధము కొత్తరూపును సంతరించుకున్నది.   తరగని తామసము తనసైన్యమునంతటిని కూడ దీసుకుని తల్లిని వధియింప వచ్చుచున్నది.దానికి మేము సిద్ధము అంటూ దైతేయులు-కంబులు-అనేకానేక వీర్యులు-ధౌత్రులు-కాలకులు-మౌర్యులు-కాలకేయులు శుంభ-నిశుంభ పక్షమున సన్నద్ధమగుచున్నారు.   వానితో కాసేపు వినెదించవలెననుకున్నదేమో మన తల్లి సప్త మాతృకలను పోరాదనిచ్చి వాని సైన్యమును సమరాంగనమును వీడిపారిపోవునట్లు చేసినది. ఈ ఘట్తములో తల్లి శివుని వానికదకు రాయబారిగా సాంతి సందేశతో పంపి శివదూతిగా కీర్తింపబడుతున్నది.   సైన్యము పలాయనము చిత్తగించుతను చూసి తమతో పోరాడుచున్న సప్తమాతృకలకు ధీటుగా సుంభ-నిస్-శుంభులు రక్తబీజుని రణరంగమునకు పరిచయము చేసిరి.  కొన్ని కథనముల ప్రకారము వీడు స్వయముగా మహిషుని తండ్రియైన రంభుడు అని దేవిపై పగ సాధించుతకై తన శరీరము నుండి కిందపడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరొక రక్తబీజుడు జనించు వరమును పొందియున్నాడు కనుక జయము తథ్యము అన్న నమ్మకము శుంభు...

DEVAKAARYA SAMUDBHAVAA-CHAMUMDAA

Image
   ధూమ్రాక్షుని మరణము శుంభునిలోని విచక్షణను మరింత దాచివేసి,వాచాలత్వమును మరింత ప్రకోపింపచేస్తూ,తన గొయ్యి తానే తవ్వుకొనుటకు చండ-ముండుల రూపములో ముందుకు వచ్చి నిలిచినది.   రాజసము తాను విశ్వరూపముతో పగను రాజిల్లచేస్తుంటే,వాడు చండ-ముండులతో,  " తథా శేషాయుధైః సర్వైః అసురః వినిహంత్యాం    తస్యాం హతాయాం దుష్టాయాం సింహేచ వినిపాతతే"    ఓ చండ/ఓ ముండ,   మీరు పెద్ద సైన్యముతో అటకేగి ఆ "ఆడుదానిని" తాళ్ళతో కట్టియో,తలపట్టుకుని ఈడ్చియో ,ఆయుధములతో యుద్ధము చేసియో సింహముతో సహా నా దగ్గరకు తీసుకుని రండి అని హుంకరించాడు.    స్వామి కార్యమునకై తక్షనమే బయలుదేరి శైలపర్వతమును చేరిన వారికి కాంచనశిఖరమునందు సింహవాహినియై మందహాసముతో నున్న దేవి దర్శనమిచ్చినది.    వారు కయ్యమునకు కాలుదువ్వుతూ,తమ వింటినారిని బిగుతుగా లాగి,కత్తులను చేత బట్టుకుని బంధించుటకు సిద్ధమైనారు.     తల్లి ముఖము నల్లగా మారినది.కోపము కోరలు సాచినదా అన్నట్లుగా కనుబొమలు ముడివడినవి.కాళి యను కొత్తశక్తి కదనరంగమున వారిపై యుద్ధముచేయుటకు సిద్ధమాయెను.   ఆ శక్తి,  " భృకుటీ కుటిలాత్తస్...

DEVAKAARYASAMUDBHAVA-SUMBHA NISUMBHA-maata KAUSIKI

Image
 శుంభస్యైచ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని  రూపందేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి   శుంభ/నిశుంభులను ధూమ్రాక్షుని సంహరించి ధర్మమును కాపాడుచున్నతల్లి నా ఇంద్రియములను సైతము నిన్ను ఆరాధించుటకు సుముఖము చేసి నా అంతర్/బహిర్ శత్రువులనుండి నన్ను రక్షింపుము.    పరాశక్తి మధు/కైటభులను,మహిషాసురునికి సంబంధించిన అసురులను,వానిని,ధూమ్రాక్షుని,చండ/ముండులను ,రక్తబీజుని సంకేతనామములుగా నున్న ఇంద్రియముల బలహీనతలను నిర్మూలించినది.ఇక మిగిలిన వారు శుంభ/నిశుంభులు.నేను అను అహంకారము-నాది అను మమకారము.  వీటి గురించి వీటిచే ప్రభావితమైన ఇద్దరి గురించి మనము ఒకసారి మాట్లాడుకుందాము.    మార్కండేయ పురాణములో మహర్షి సురథుడు అను రాజు రాచరికమును కోల్పోయి వేట నెపముతో ఒంటరిగా గుఋఋఅము నెక్కి అడవులకు పోయెను.  పేరు సురథుడు.దశరథుడు మనకు దుర్తుకు వస్తాడు కద.మంచి ఇంద్రియములు కల శరీరము కలవాడు.గుర్రమునెక్కి ,మనసు మాట విని అడవులకు పోయెను.ఒక విధముగా బుద్ధిని పనిచేయనీయనిచోటు.  కనుకనే పరహస్తగతమైన తన రాజ్యముపై భ్రాంతిని వీడలేని పరిస్థిలో నున్నాడు.    వేరొక వ్యక్తి సమాధి.వైశ్యుడు.ధనము ...