KURYAAT KATAAKSHAM KALYAANI-05
*********************
ప్రార్థన
****
అమూం తే వక్షోజావమృత మాణిక్య కుతుపౌ
న సందేహోస్పందో నగపతిపతాకే మనసివ@
పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచదళనౌ.
శ్లోకము
****
"కుంబావతీ సమవిడంబా గళేన నవ తుంబాభవీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురంబా కదంబ విపినే
అంబా కురంగ మద జంబాళి రోచిరిహ లంబాలకా దిశతు మే
శం బాహులేయ శశి బింబాభిరామ ముఖ సంబాధిత స్తనభరా."
స్తోత్ర పూర్వ పరిచయము.
****************
దేవర్షి గణ సంభూత యైన ఆ స్కందమాత కదంబవనములో లీలగా క్రీడిస్తూ పరిపాలనమును గావిస్తున్నది.ఎందరోమహానుభావులను తన చరణధూళిని స్వర్గసోపానములుగా మలచి కటాక్షించినది.సంసార సర్పద్రష్టులను ఆడ ముంగిసయై ఆదుకున్నది.సంసార సాగరమును ఈదలేని వారిపైజాలిపడి, తాను సూర్యశక్తిగా ప్రకటింపబడుతూ వాటిని ఇంకింపచేసి తరింపచేయునది అయిన ఆ మాతృమూర్తి నా హృదిలో ప్రకాశించుచు,శుభములను చేకూర్చును గాక అని మహాకవి ప్రార్థించుచున్నాడు.
పదవిన్యాసము.
***********
" సింహాసన గతానిత్యం
పద్మాశ్రిత కరద్వయం
శుభదాస్తు సదాదేవి
స్కందమాతా యశస్విని." నమోనమః.
1.స్తనభరా-
*********
ఉన్నతమైన-నిండైన -వక్షోజములు కలతల్లి.
సంబాధిత-స్తనభరా
వాత్సల్యముతో కూడిన బాధను పొందుచున్న -వక్షోజములు కలతల్లీ.
ముఖ-సంబాధిత-స్తనభరా
శిశువు క్షీర పానముచేయువేళ శిశువు ముఖములోని తృప్తిని చూచుచున్న- వాత్సల్యముతోకూడిన బాధను పొందుచున్న వక్షోజములు కలతల్లీ.
అభిరామ-ముఖ-సంబాధిత-స్తనభరా
మనోహరమైఅ-శిశువు ముఖమును చూచుచు-మాతృ వాత్సల్యముతో కూడిన బాధను పొందుచున్న వక్షోజములు కలతల్లీ.
శశిబింబ-అభిరామ-ముఖ-సంబాధిత-స్తనభరా
చంద్రబింబ-మనోహరమైన-శిశువు ముఖమును చూచుచు-వాత్సల్యముతోకూడిన బాధను పొందుచున్న తల్లీ.
బాహులేయ-శశిబింబ-అభిరామ-ముఖ-సంబాధిత-స్తనభరా.
బృహత్తుయే(సర్వము-సమస్తము)శిశువుగా మారి -క్షీరపానము చేయుచున్న -చంద్రబింబ -మనోహరమైన-ముఖమును పొందిన కుమారుని/స్కందుని చూస్తూ-వాత్సల్యముతో కూడిన బాధను పొందుతున్న వక్షోజములు కలతల్లీ
నీవు,
"యాదేవి సర్వ భూతేషు పుష్టి రూపేణ సంస్థితా" గా నున్నావు.కనుకనే,
భావయత్రి -కారయత్రి వై,
" ఐశ్వరస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః
జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణా "భగ"ఇతీరిణా.
సమగ్రమైన ఐశ్వర్యము-ధర్మము-యశము-శ్రేయము-జ్ఞానము-వైరాగ్యము అను ప్రకాశ-గమన శక్తులను,షణ్ముఖములుగా చేసుకుని శిశువునకు నీ స్తన్యమును బాహులేయునకు అందించుచున్నావు.
2.మరొక పాఠాంతరము.
***************
ఉత్పత్తిం ప్రళయం చైవ
భూతా నామం గతింగతిం
వేత్తి విద్యామవిద్యాంచ
న వాచ్యోభగవాన్ ఇతి."
సృష్టి-ప్రళయం-ప్రాణుల రాక-ప్రాణుల పోక-విద్య-అవిద్య ఎరుక కలిగినవాడు బాహులేయుడు.ఆ ఎరుకను అందించు ఎరుకల సాని కుంబావతీ జగజ్జనని.
ఆరుగురు కృత్తికల స్తన్యపానముచేసి,అమ్మ చే ఆరు తలల శిశువుగా మార్పుచెంది విజ్ఞాన వికసనమునకు మూలమైన ప్రణవమును పరమేశ్వరునకు ఉపదేశించుటకా యన్నట్లు బాహులేయుడు సకల శాస్త్రార్థ సారములను గుహ్యముగా సేవిస్తున్నాడు.
తారకాసుర సంహార సమయమున సుబ్రహ్మణ్యుని శరీరము నుండి ఉద్భవించిన శక్తిని బాహులేయునిగా/వీరబాహునిగా భావించే మరొక పాఠాంతరము కలదు.
ఆదిశంకరులు "సౌందర్యలహరి" స్తోత్రములోని "అరాలకేశేషు" శ్లోకములో అమ్మవారి రూపవైభవమును దర్శింపచేస్తూ,శిరీషాభా చిత్తే,మందహసితా,ప్రకృతి సరళా అని ప్రస్తుతిస్తూనే.వక్షోజములను మాత్రము,
"ద్రుషదుపల శోభా కుచ తటే" అంటూ సౌష్టవమైన స్థిరమైన సన్నికల్లుతో పోల్చి కరుణను సంకేతించారు.
" యాదేవి సర్వభూతేషు స్థితి రూపేణ సంస్థితా."
2.
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా.
అంబ-జగజ్జనని
నికురంబా-సమూహము కలది
ఆది-నికురంబా
మొదలైనవారి సమూహము కలది.
ఆయుధ-ఆది-నికురంబా
ఆయుధధారులైనవారి-సమూహముకలది.
శంబ-ఆయుధ-ఆది-నికురంబా
వజ్ర-ఆయుధధారులు-మొదలగువారి-సమూహముకలది.
వజ్రాయుధాది-(ఇంద్రాది) సమూహము కలది.
వినత-శంబ-ఆయుధ-ఆది-నికురంబా
వినమ్రులై నమస్కరించుచున్న-ఇంద్రాది దేవతా-సమూహము కలది
కదంబ విపినే-వినత-శంబ-ఆయుధ-ఆది-నికురంబా
కదంవనములో-వినమ్రులై నమస్కరించుచున్న-ఇంద్రాదిదేవతా-సమూహము కలది.
సురార్చిత పదా-నమోనమః.
.3.కాళికా స్వరూపముగా,
" మాణిక్యావీణాం ఉపలాలయంతీం
మదాలసాం మజుల వాగ్విలాసాం."
జగజ్జనని,
సవిధా-పోలికను కలిగియున్నది
ఆభ-సవిధా
తలపించు-పోలికను కలిగియున్నది
నవతుంబ -ఆభ-సవిధా
లేత సొరకాయను-తలపించు-పోలికను-కలిగియున్నది.
గలేన-నవతుంబ-ఆభ-సవిధా
కంఠ సౌకుమార్యము-లేతసొరకాయను -తలపించు-పోలికను-
కలిగియున్నది
వీణ-గళేన-నవతుంబ-ఆభ-సవిధా
అమ్మలగన్న అమ్మ-మెడలో-లేతసొరకాయను-తలపించు-పోలికను -కలిగిన-వీణను-ధరించి
కుంబావతె విడంబా- కొండజాతి స్త్రీని,తాను పోలియున్నది.
కుంబావతీ-సమ--గళేన-నవతుంబా- వీణ-ఆభ-సవిధా
ఎరుకలసానివలె-కంఠమున -లేతసొరకాయ-పోలికను తలపించు-వీణను-ధరించి బోయస్త్రీ వలె అమ్మ సాక్షాత్కరించుచున్నది.
"ఎరుకకలిగిన శివుడు ఎరుకగా మారగా,
తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా".
"కిమపి మహతాంపశ్యంతి" అని జగద్గురువులు స్తుతించినట్లుగా మహాకవి కాళిదాసు అమ్మయొక్క ఎరుకలసాని రూపప్రకటనములోని అంతరార్థమును గ్రహించి ధన్యుడైనాడు. గిరిజ అనగా కొండజాతికి సంబంధించినది..ఆమెబోయస్త్రీ.అనగా దుష్కర్మలను కౄరమృగములను వేటాడునది.మహాపద్మాటవి వంటి మనమన్సులోనికి విషయవాసనలను విషపు భావములను రానీయనిది. సర్వజ్ఞ. కంబావతీ సంబోధనములో రూప సామ్యము-నామసామ్యము-సమర్థతా సామ్యము పరిపూర్ణముగా ప్రకటింపబడుచున్నవి.
5..
5.అంబ-మూలపుటమ్మ
దిశతు-ప్రసాదించునుగాక
శం-దిశతు-శుభములను ప్రసాదించునుగాక
ఇహ-శం-దిశతు-
ఈ జన్మలోనే ప్రసాదించునుగాక
మే-ఇహ-శం-దిశతు
నాకు-ఈ జన్మలోనే-శుభములను
ప్రసాదించునుగాక.
అంబ-మే-ఇహ-శం-దిశతు
జగదంబ-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించునుగాక.
బింబ+అథర-అంబ-మే-ఇహ-శం-దిశతు
దొండపండు వంటి క్రిందిపెదవి కల అమ్మ నాకు-ఈ జన్మలోనే-శుభములను ప్రసాదించును గాక.
అంబ-దిశతు
లంబ+అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు
పొడవైన/వేలాడుచున్న కురులుగల-జగజ్జనని-నాకు-ఈ జన్మలోనే-శుభములను-అనుగ్రహించును గాక.
రోచిస్-జంబల-లంబ _అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు
ప్రకాశిస్తున్న-పొడవైన/వేలాడుచున్న కురులుగల-జగజ్జనని-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించునుగాక.
జంబాల-రోచిస్-లంబ-అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు
లేపనముతో-ప్రకాశిస్తున్న-పొడవాటి/వేలాడుచున్న-కురులుగల-జగజ్జనని-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించునుగాక.
కురంగ మద-జంబాల-రోచిస్-లంబ-అలకా-అంబ-మే-ఇహ-శం-దిశతు.
కస్తురి పరిమళ-లేపనముతో-ప్రకాశిస్తున్న-పొడవాటి/వేలాడుతున్న -కురులు గల-జగదంబ-నాకు-ఈ జన్మలోనే-శుభములను-ప్రసాదించును గాక.
" శేఖరీభూత శీతాంశు రేఖా మయూఖావళీ
బద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే"
నమోనమః
స్కందమాతగా అమ్మ అనుగ్రహమును,సు-బ్రహ్మము తానైన కుమారస్వామి తత్త్వమును మందార మకరందముగా చేసి అమ్మను అభిషేకించారు.
అమ్మను ఎరుకలసానిగను,అమ్మ ధరించిన వీణను లేతసొరకాయతోను,కిందిపెదవిని దొండపండుతోను పోల్చి"ఉపమా కాళిదాసస్యను" సార్థక పరుచుకున్నారు
.,శంబాయుధ-నికురంబా-జంబాక-బాహులేయ-బింబాభిరామ-సంబాధక-అంబా అను పదములలోని"0 బా" అను
బిందుపూర్వక దుష్కర ప్రాసలతో నాదభూషణములను అలంకరించారు.
యాదేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
అమ్మదయతో అర్చన కొనసాగుతుంది.
Comments
Post a Comment