ADITYAHRDAYAM-SLOKAM-11


  




 ఆదిత్యహృదయము-శ్లోకము-11


 ********************


 ప్రార్థన


 *******


 "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం


  హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం


  అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం


  సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 *********



 పరమాత్మ హిరణ్యగర్భునిగా,తన తేజస్సుతో అగ్నిగర్భుడై,రవి యై తపమును కలిగిస్తూ,శిశిరమును తొలగిస్తున్నాడు.అంటే ఘర్మసర్జన కిరణములతో శబ్దస్వరూపునిగా ప్రకాశిస్తున్నాడన్న అగస్త్యుడు,


 ప్రస్తుత శ్లోకములో ఆ శబ్ద వైశిష్ట్యమును-జలతత్త్వమును-దక్షిణాపథ గమనమును ,విజ్ఞానప్రదాత్వమును స్పష్టముగా తెలియచేస్తున్నాడు.


 శ్లోకము


 *****


 " వ్యోమనాథః తమోభేది ఋగ్యజుసామ పారగః


   ఘనవృష్టిః అపాం మిత్రో  వింధ్యవీధి ప్లవంగమః"



  స్వామి వ్యోమ వాసియై తన రశ్ములచే చీకట్లను తొలగించువాడు.ఇది వాచికము.


  స్వామి ఆత్మస్వరూపియై తన జ్ఞానముచే అజ్ఞానమును పారద్రోలువాడు.


   స్వామి త్రయీమూర్తిం వేదం అన్న ఆర్యోక్తిని నిజముచేస్తూ ,సుప్రభాత సమయమున ఋగ్వేదముగాను

-మద్యాహ్న సమయమున యజుర్వేదముగాను -అస్తమాన సమయముబ సామవేదముగాను,మూడువేదములచే  సంస్తుతింపబడుతున్నాడు.


 వేదములను ద్రష్టించిన మహానుభావులున్నారు కాని సృష్టించినవారు లేరు.


 విత్ అను ధాతువు నుండి వేదము అను శబ్దము జ్ఞాన సూచికగా వెలువడినది.కనుక్జనే అవి అపౌరుషేయములు.స్వయంసిద్ధములు కనుక ఆమ్నాయములు.శ్రవణముచే అభ్యసించవలసినవి కనుక శ్రుతులు.


 ఋగ్వేదమునకు  -ఆయుర్వేదము ఉపవేదముగాను


 యజుర్వేదమునకు -ధనుర్వేదము ఉపవేదముగాను


 సామవేదమునకు-గాంధర్వ వేదము ఉపవేదముగాను కీర్తింపబడుతున్నాయి.


 ఆదిత్యుడు  ఆకాశనివాసి. ఆత్మ నివాసి.           ఆకాశమునకు శబ్దము గుణకము./తన్మాత్ర.


 ఆకాశనివాసి/ఏమీ అంటని  ఆత్మస్వరూపమైన ఆదిత్యుడు శబ్దప్రధానమైన వేదవేద్యుడు.ఆ దివ్యశబ్దములు మానవ కర్ణములు వినలేవు.మహా తపసంపన్నులు మాత్రమే దర్శిస్తూ-వినగలరు.కనుకనే అవి మహామంత్రములు.(గాయత్రీ మహా మంత్రము.)


 " ఆకాశం  శరీరం బ్రహ్మం" అన్నది ఆర్యోక్తి.

  ఆ-సమస్తాత్-కాశం-ప్రకాసం



   అది శబ్దబ్రహ్మ స్వరూపము కూడా.


 కనుకనే విష్ణుసహస్రనామ స్తోత్రము,


 'వేదో వేద విదవ్యంగో వేదాంతో వేదవిత్కవిః" అని శ్లాఘిస్తున్నది.


 " అనంతా  వై వేదాః" 


 వాటిని అర్థము చేసుకొనుటకు,ఇంద్రియజ్ఞానము సరిపోదు.


 ప్రత్యక్ష-అపరోక్ష-పరోక్ష జ్ఞానములు సరిపోవు.


 అథోక్షజ-అప్రాకృత విజ్ఞానమే వేదమును తెలిసికొనగలదు.


 


  మన ఇంద్రియములతో గ్రహించుతకు వీలుకానిది అథోక్షజ జ్ఞానము.


 పరమాత్మ అగోచరుడు కనుక అథోక్షజుడు.


 ప్రకృతికి అతీతుడు కనుక అప్రాకృతజ్ఞానులు మాత్రమే శబ్దమును-రూపమును గ్రహించగలరు.



 మొదటిపాదములో జ్ఞానభాస్కరుని దర్శింపచేసిన అగస్త్యమహాముని,రెండవ పాదములో,


 అపాం మిత్రునిగా/జలమునకు అథిపతిగా కీర్తించుచున్నాడు.


 ఘనవృష్టి అనగా గొప్పవర్షము/మేఘములనుండి వచ్చు జలసర్జన కిరణముల ప్రభావము.ఆదిత్యుని దక్షిణాయన పయనము.


  ఆదిత్యుడు,


 వియత్వీధిలో/వింధ్యవీధిలో ( ఆకాశవీధిని వింధ్యవీధి అనికూడ అంటారు)


 జలసమృద్ధిని ఏర్పరచుటకై,దక్షిణాయన కాలములో-దక్షిణాపథము వైపునకు,


 'నిమిషార్థే నైకేన ద్వేచ శతే-ద్వేచ సహస్రే"  -అంటూ,


 కనురెప్పవేయు సగకాలములో,


2200యోజనములవిస్తీర్ణమును -ప్లవంగము వలె (కోతివలె)దుముకుతు  విస్తరిస్తూ,జలసర్జన కిరణములను విస్తరింపచేస్తూ,       జలసమృద్ధిని కలిగిస్తాడు అని ఆదిత్యవైభవమును వినుతించుచున్న వేళ,


 " తం సూర్యం  ప్రణమామ్యహం."






Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)