ADITYAHRDAYAM-SLOKAM-15


   ఆదిత్యహృదయం-శ్లోకం-15

  ***********************

 ప్రార్థన

 ******


 "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

  తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాసం

  అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."

 పూర్వరంగము.

 ***********


 " తేజసామపి తేజస్వి"  మండల వాసియై  తన శక్తులచే నక్షత్రములను-తారలను-గ్రహములను-జ్యోతిర్గణములను 

నిర్మించి,వానిచే వెలువడుచున్న రశ్ములచే సకలభువన సాక్షియై,


 " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై  తోచుచు,

 ప్రస్తుత శ్లోకములో

  జయజయ ధ్వానములచే కీర్తింపబడుచున్నాడు.


 శ్లోకము

 ******

 " జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః

  నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః"


   నమోనమః శబ్దమును మూడుసార్లు ప్రయోగించారు మహర్షి వాల్మీకి.కొంతమంది దీనిని పునరావృతముగా భావిస్తే త్రికరణములతో సమర్పించు నమస్కారముగా ఉపాసకులు భావిస్తారు.


 ప్రస్తుత శ్లోకము ఆదిమూర్తి యైన ఆదిత్యుని,

 1.జయప్రదునిగా

 2.జయభద్రునిగా

 3.సహస్రాంశునిగా

 4.హర్యశ్వనునిగా , పూజిస్తున్నది.


  హరితము పచ్చదనము అభిలషించు మనసును హర్యశ్వముగా,భావనచేస్తూ,అదియును అనేకానేకములు/సహస్రములు,పరమాత్మను ధ్యానిస్తే,జయములు ప్రాప్తిస్తాయి-ప్రాప్తించిన జయములు భద్రముగాఉంటాయి అంటూ,చతుర్విధ ఫలములైన/ధర్మార్థ కామమోక్షములను సంకేతిస్తారు.

  "యోగ-క్షేమం వహామి అహం' అంటుంది భగవద్గీత.

 " జయంతి అనేన ఇతి భక్తా సంసారేతి" జయాయా .నమామి.

 

1. తాను సృష్టించిన ప్రపంచ/సంసార దుఃఖములను దాటించి  (ప్లవంగ)సంసారసాగరమునకు ప్లవంగమై/పడవయై దాటించి,శాశ్వత ఆనంద ప్రాప్తిని కలిగించువాడు.జయభద్రుడు.

 జయాయ-జయభద్రాయ నమోనమః.

2.వేద మంత్రము చెప్పినట్లు,

 " భద్రం కరోభిః శృణుయాం దేవాం"

  సమస్తమునకు సత్వమునకు-సౌభాగ్యమునకు భద్రతను కలిగించువాడు ఆదిత్యుడు/జయప్రదుడు-జయభద్రుడు.

3.శ్రీరాముని పరముగా,

   జయుడు-విజయుడు

   భద్రుడు-సుభద్రుడు

   చండుడు-ప్రచండుడు

   ధాత-విధాత  స్వామి వికుంఠ ద్వారముల పరిరక్షకులు.

 జయ-విజయుల శాపమును తొలగించి,వారి వైకుంఠ ద్వారపాలక స్థానమును భద్రతగా నిలుపువాడు ఆదిత్యుడు.

4 తన రథ అశ్వములైన,

  " జయో జయశ్చ విజయ జితప్రాణో జితశృతిః

    మనోజవో-జితక్రోధో వాజినః సప్త కీర్తితః'

   తన ఏడు ప్రథాన కిరణ స్వరూపములుగా భాసిల్లే అశ్వముల నామధేయములతో,మనలను అనుగ్రహించువాడు ఆదిత్యుడు.

 జయాయ-జయభద్రాయ-హర్యశ్వాయ నమోనమః.

5హరితః-అశ్వః-హర్యశ్వః

  స్వామి రథ సప్తాశ్వములను నామములను ప్రకటించిన తరువాత వాటి స్వభావమును వివరిస్తున్నారు అగస్త్యభగవానుడు.

  హరిత-శుభప్రదములు-

  హరిత-పచ్చదనమును అందించునవి/పత్రహరితము

  హరిత--దోష హరనమును కలిగించు పరమాత్మ స్వభావము

  హరిత-శ్రీరామ చంద్రుని మేనిఛాయ/ఆశ్రిత వాత్సల్యము

  హరిత-స్థితికార్యమును నిర్వహించుసామర్థ్యము

  మిక్కిలి ముఖ్యమైన అన్వయము

 తాను స్థిరశక్తిగా /అంతర్యామిగా లోనుండి

 అశ్వభావనముతో/రశ్ములతో గమనమును చేయుచున్న ,

  హర్యశ్వాయ-నమోనమః.

     శ్రీరాముని పరముగా అన్వయించుకుంటే,

 హరి అనగా కోతి.హరి అనగా విష్ణువు.

 హరితానై-హరిని వాహనముగా కలిగిన(హనుమంతునికి వాహనసేవను అనుగ్రహించిన వాడు-కిష్కింథలో)


   జయాయ నమోనమః

   జయభద్రాయ నమోనమః

   హర్యశ్వాయ నమోనమః

   సహస్రాంశ నమోనమః

   ఆదిత్యాయ నమోనమః.

  అని నేలనాలుగు చెరగుల నమోవాకములతో కూడిన జయజయధ్వానములు మారుమ్రోగుచున్నవేళ,

 " తం సూర్యం  ప్రణమామ్యం."


  

 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)