TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02


  

1-

   అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.

 కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.

 స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.

 అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.

 చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు.

నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు.

1.బ్రాహ్మీ

2.మహేశి

3.కౌమారి

4.వైష్ణవి

5.వారాహి

6.మాహేంద్రి

7.చాముండా

    మహాలక్ష్మి,

 యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,

 ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడుల యుద్ధభూమిగా అనుకుంటే వాటిలోని చెడును నిర్మొలించుటకు,

1.బ్రహ్మీ శక్తి

   జీవునకు అనేక సత్సంకల్పములను కలిగించుచున్నది.సృష్టి సర్వము బ్రహ్మీశక్తియే.ఆ తల్లి దృశ్యమాన జగతి అశాశ్వతమును సాధకునకు తెలియచేసి,బ్రహ్మానంస్థికి మార్గము చూపుతుంది.

2.మాహేశ్వరి శక్తి

 సంహారిణీ రుద్రరూపా అనికీర్తిస్తుంది లలితా సహస్రనామ స్తోత్రము.

 తల్లి రుద్ర రూపముతో సంహరించేది అజ్ఞానమనే చీకటిని.తల్లిధర్మ స్వరూపిణి.ధర్మమునాశ్రయించిన జ్ఞానమే సత్వగుణ ప్రకాశము.మాయను అల్లునదిమహేశ్వరి దానినితొలగించునదియును మహేశ్వరియే.

3.కౌమారి/కుమారి

కు అనగా దుర్మార్గం.దానిని పూర్తిగా తొలగించునది కౌమారి.యుద్ధభూమిలోశక్తిసేనా నాయకియై అసురత్వమును అంతమొందించినది.

 సాధకుని ఇంద్రియ గతి వక్రముగాకుండా నియంత్రించునది కౌమారిమాత.

4.వైష్ణవి/గరుడవాహిని.

  గరుత్మంతుని/సుపర్ణునీధిష్టించునది.

 సు అనగా మంచివైపునకు మార్గముచూపు పర్ణములు రెక్కలు.

కర్మ-జ్ఞానము అనురెండు మంచి ఆలోచన-ఆచరణ  అను రెండు రెక్కల సహాయముతో,దేహమే ఆత్మ అను భావమును తొలగించిద్వంద్వములనువిడిడిగా చూపు శక్తి.

5 వారాహి

 కల్పపరిమితమైన  కాలమునకు సంకేతముగా  వారాహి శబ్దము ,శ్రేష్టమైన ఆత్మ ను తెలియచేయు వర శబ్ద ప్రాధాన్యముగాను వారాహి మాత కొలువబడుచున్నది.ఈ చైతన్యసక్తిని ఆధారముచేసుకుని సర్వము/సకలము సంభవించుచున్నది.

6.మహేంద్రి 

 "ఈర్" ధాతువునకు గతి/నడక అని అర్థము.

 వారాహి శక్తీంద్రియగమనమునుతెలియచేస్తుంటే/

మాహేంద్రి ఇంద్రియ గమనమును నియంత్రిస్తూ సాధకునికి మనసు చలించకుండాసహకరిస్తుంటుంది.

7.చముండా/చండ-ముండ

  కథనములో రాక్షసులు.వారిని సంహరించిన శక్తి.

మనమనసులోనీఅలోచనలప్రవృతియే చండ-నివృతియే ముండ.ఆలోచనలను నియంత్రించే అద్భుత శక్తియే చాముండా.

8.మహాలక్ష్మి/మూలస్వరూపము.

 శుభప్రదాయిని  మహల  అను అసురుని మర్దించినది.

 ఈ ఆవరనములోని మాతృకానుగ్రహముతో సాధకుడు,తనయొక్క సప్తధాతువులు-మనసు శుద్ధిచెందుటచే పాపరహితుడై,రజోగుణ విహీనమైన ప్రకాసమును పొంది,చక్రేశ్వరి అయిన త్రిపురేశి కి నమస్కరించి,మూడవ చతురస్త్రాకారములోనిప్రవేశించి,ముద్రాశక్తులానుగ్రహమును పొందగలుగుతాడు.


   శ్రీ మాత్రే నమః.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)