TANOTU NAH SIVAH SIVAM=26@SIVATANDAVASTOTRAMU
"వాగర్థావివసంవృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"
కథానుసారముగా స్తోత్రకర్త సుకృతమో సదాశివ అనుగ్రహమో ఒకదానిని మించి మరొకటి పోటీపడుతు,
ప్రతి సుఖమునకు కారనము తమ సామర్థ్యమే అన్న దేహ భ్రంతితొలగి న-మః నేనుకాదు నాలోదాగియున్న ఈశ్వరచైతన్యమే మూలకారణమన్న విషయము బోధపడినది.
" కదా నిలింపనిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్
విముక్త లోలలోచనో లలాట ఫాలలగ్నక
"శివేతి" మంత్రముచ్చ్రేత్ సదా సుఖీభవామ్యహం"
జీవుని రెండువిషయములు సర్వం శివమయము అన్న భావనలో రమించుటకు అడ్డుపడుతున్నాయి.అవి,
చంచల నేత్రములు నిశ్చలత్వమును వీడి బాహ్యదర్శనము వైపునకు పరుగులు తీస్తున్నాయి.
దానికితోతోడుగా ,
చంచలమైన మనస్సు శిరసానమామి ఈశ్వరదివ్యతేజం అననీయుటలేదు.
ఈ రెండింటికి ఏకాగ్రత వస్తేకాని శివ మంత్రమును వాకునకు ఆభరనముగా,సవినయ శివచైతన్య దర్శనమునకు మనస్సునకు శిరసా నమామి అను ఉపచారముగా సమర్పించుటకు ఫాలనేత్రమున్న అజ్ఞాచక్రమున పరమాత్మనునిలిపి తురీయావస్థను నేను పొందలేను.
కనుక ఓ సదా శివా ,
అహం-భవం-సుఖం,
నాపుట్టుకకు పరమార్థమున్నదంటే అది త్రికరణశుద్ధితో కూడిన నీ సేవాసక్తతయే.
దానిని పొందాలంటే నా ఆలోచనలనే తరంగములు నిర్మల గంగాతరంగములవంటి పరిశుద్ధతను కలిగియుండాలి.నీ నివాసమైన నాహృదయము ఎటువంటి ప్రలోభములకు వశపడని గంగాతెర్రమున గల ఒక పొదరిల్లుగా మారాలి.ఆ పొదరింటిలో నేను సుఖాసీనుడనై నీతో బాటుగా శుభస్వరూపుడైననిన్ను దర్శిస్తూ,నీ నామమను మంత్రమును ఉచ్చరిస్తూ,ఆత్మానందస్థితిని పొందగలగాలి.
ఆ ఆత్మానందము సదాఎల్లవేళల నన్ను వీడకుండాలి.అటువంటి స్థితి ఎప్పుడో కదా అని ఆతురతతో ఆత్మనివేదనమునకై వేచియున్నాడు రావణుడు.
ఏకబిల్వం శివార్పణం.
Comments
Post a Comment