CHIDAANAMDAROOPAA-SUMDARA NAAYANAAR.


  చిదానందరూపా-సుందర నాయనారు-24





" పిత పిరాయి సూడి."

  చిదానందరూపా- సుందరమూర్తి నాయనారు
 *******************************************

     కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 హాలాహలధరుని  సఖుడు   అలల సుందరారు
 సదయ-ఇసయల  సుతుడు ఇలను పేరు అరూరారు

 నరసింగ మానై ఇంట పెరుగుచు,నగజపతిని  నమ్మి కొలుచు
 అల్లుడితడని పెండ్లిచేయ నందకవి  సుందరారుని పిలిచె

 తానొకటి తలచినవేళ దైవము వేరొకటి తలచు అని అన
 తాళికట్టనీయకనే తగవుగ  వానిని తన బానిసనియెగ

 పితకు బానిసననియున్న పత్రము  పెద్ద విచిత్రమునే చేసెగ
 పినాకపాణి కృపనుపొందగ పిత అను పిలుపు  కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

     నవ విధ భక్తులలోనిదైన సఖ్య భక్తితో శ్రీకృష్ణుని కొలిచినది కుచేలుడైతే,పరమేశ్వరుని కొలిచినది సమయాచారపరుడైన సుందరారు నాయనారు.జగద్రక్షణార్థము కేవలము 18 సంవత్సరములు మానవ శరీరమును ధరించిన మహా జ్ఞాని.క్షీరసాగర మథనమునందు జనించినహాలాహలమును తన అరచేత ధరించి పరమేశునకందించుటచే హాలాహల సుందరారు అని,కాల క్రమేణ అలల  సుందరారు అని కీర్తింపబడుచున్నాడు.

       సుందరారు మానవ శరీరమును ధరించుటకు రెండు కారణములను పెద్దలు ప్రస్తావిస్తారు.
 1.కైలాసములో నున్నప్పుడు శివపూజకు పూవులను సేకరించు సమయమున,అక్కడకు పూలనిమిత్తమువచ్చిన పార్వతీదేవి చెలికత్తెలైన,కమలిని-అనిందితిని అను వారిని క్షణకాలము మోహదృష్టితో చూచినందులకు ఆగ్రహించినఆదిదేవుడుమానవుడై పుట్టి వారిని మనువాడమనుట.తప్పు తెలిసుకొని శరణువేడిన సుందరుని చూసి,శంకరుడు సాప పరిధిని తగ్గించుట.
 2 రెండవది బాహ్యమునకు శాపము కారణమైనప్పటికిని,తద్వారా సుందరారు కీర్తనలను-కీర్తిని లోక పూజ్యము చేయుటకు అనుగ్రహము ఆగ్రహ మేలిముసుగును ధరించి మేలుచేసినది.
 ఓం నమః శివాయ.

  తిరునావలూరులో సదయ నాయనారు-ఇసయజ్ఞాని నాయనారులకు దైవానుగ్రహము వలనపుత్రుడుగా జన్మించిన సుందరారు నామధేయము నంబి అరూరారు
" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
  త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం సమార్పణం'
 అటువంటి ఏకబిల్వమే సదయ-ఇసయ-సుందర నాయనార్ల కుటుంబము. .

    సుందరారు తాళికట్టు సమయమునకక్కడికొక పిచ్చివాడు చేతిలో ఒక పత్రముతో వచ్చి, పెండ్లిని అడ్డుకొనెను.వాని చేతనున్నపత్రమును పెద్దలకు చూపిస్తు,వీడు నా బానిస కనుక నేను వీడిని నాతో తీసుకొని పోతాను అని చెప్పెను.సాక్ష్యమైనపత్రమును చదువగా అందులో " నేను పితకు (పిచ్చివానికి) వాని వంశమువారికి బానిసనని త్రికరణగా అంగీకరిస్తున్నానని వ్రాసి,సుందరారుచే సంతకము చేయబడి ఉన్నది.సంతకము సరిపోవుటతో చేయునదిలేక వారు పెండ్లికొడుకును తనతో తీసుకొనిపోవుచున్న పిచ్చివానిని వాని ఇల్లుచూపమని వెంబడించిరి.కొంతదూరము సాగిన తరువాత వారిరువు గుడి దగ్గర అదృశ్యమైనారు."ఓం నమః శివాయ."

" నా మనసంతా నిండె శివ పదమె
  గురువై నడిపించె శివ పథమే' అని కీర్తించుచున్న సుందర నాయనారును ఆనందపరచుచున్న ఆ మహాదేవుడు మనందరిని శివ పథము వైపు నడిపించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం)



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)