CHIDAANAMDAROOPAA-SADAYA NAAYANAARU.


" నమే మృత్యుశంకా నమే జాతి భేదా
పితా నైవ నేనైవ మాతాన జన్మ
న బంధుః నమిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూప శివోహం శివోహం."
చిదానందరూపా-సదయ నాయనారు.
*******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
సదయ నాయనారు సదాశివుడనుటయే సత్యము
అగణిత భక్తిప్రపత్తుల ఆరాధన అనునిత్యము
సుదతి-సుతుడు-సృష్టియు శివకుటుంబీకులే అని అను
సుతుని దత్తతనిచ్చియు శివాధీనమే తాను అను

చింతను దరిరానీయక సంతసమున తానుండును
చిదానంద సరస్వతిచే సంతత వినుతులనందును
గతజన్మపు ఘనతలు తోడుగ గణనీయతనొందగ
అగణిత గుణ సంపన్నుని సుందరారును మనకందీయగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

" మాతాచ పార్వతీ దేవి-పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్త్యాశ్చ స్వదేశో భువనత్రయం"
శెళిక్కర్ అందించిన పెరియ పురాణము ప్రకారము ఆదిసైవుదైన అరూరారుకు దైవానుగ్రహముగా జన్మించినవాడు సదయ నాయనారు.తిరుమురైవడిలోని సదయ నాయనారు ధర్మపత్ని ఇసయజ్ఞాన నాయనారు.దైవాంస సంభ్హొతురాలు.వీరు వీరి కుమారుడు సుందరారుల నాయనార్ల కుటుంబము శివుని అత్యంత ప్రీతిపాత్రమైనది.
వీరి ఔన్నత్యమును మరింత ప్రకటింపబడుటకై సదాశివుడు తేజోవంతుడైన సుందరారును,రాజైననరసింగ మునైయార్ దత్తతస్వీకారమును అడుగగా,
" అంతామిధ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువునిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి చెందక....
...........................పరమసంతోషముతో అంగీకరించి సంతోషముగా అప్పగించి,ప్రశాంతముగ పరమేశ్వర ధ్యానమునకు ఉపక్రమించెను.నిశ్చల భక్తి తత్పరతచే నిటలాక్ష సాయుజ్యమునొందిన,సదయ నాయనారు సత్కథా పఠనము మనందరిని సదాశివుని కృపకు పాత్రులను చేయుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

Comments