SAUNDARYALAHARI-CHAMUNDA-79
సౌందర్యలహరి-చాముండా-75
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పరమేశ్వరి క్రోధపు కనుబొమల ముడినుండి
దంష్ట్రా-కరాళ వదనముతో ప్రభవించితివి
దంష్ట్రా-కరాళ వదనముతో ప్రభవించితివి
ధర్మ సంస్థాపనమునకై ప్రచండ యుద్ధము చేసి
చండ-ముండ శిరములను ఖండించితివి, స్వస్తి.
చండ-ముండ శిరములను ఖండించితివి, స్వస్తి.
సప్త మాతృకవో నీవు సంతృప్త శ్రీమాతవో
పుడమి పుణ్య క్షేత్రమైన చాముండి కొండమీద
పుడమి పుణ్య క్షేత్రమైన చాముండి కొండమీద
మాయాసతి శిరోజములు మహిమాన్వితమైనవి
కాళియే చాముండిగా మమ్ము కాపాడుచున్న వేళ
కాళియే చాముండిగా మమ్ము కాపాడుచున్న వేళ
నీమ్రోలనే నున్న నా కర్లు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" దం ష్ట్రా కరాళవదనే శిరోమాలా విభూషణే
చాముండే ముండమదనే నారాయణి నమోస్తుతే"
చాముండే ముండమదనే నారాయణి నమోస్తుతే"
చండముండాసుర శిరస్ఛేదము చేసిన తదుపరి సింహవాహిని యైన కాళి పరమేశ్వరిని దర్శించగా, తల్లి చండముండ ఖండిత శిరములను కాళి రెండుచేతులలో చూసి" చాముండా" అని పిలిచినదని దేవీభాగవతము పేర్కొంటున్నది.చాముండి పర్వతముపై వెలిసిన తల్లి కనుక చాముండేశ్వరీదేవి అనికూడా కొలుస్తారు.శుంభ- నిశుంభులు తమ స్వార్థమునకు బ్రహ్మగురించి తపమాచరించి వరములు పొందిన తరువాత కన్నుమిన్ను కానని వారుగా మారి పరమేశ్వరిని పొందవలెనని చండముండాసురులను అమ్మపై యుద్ధమునకు పంపిరి ఇది బాహ్యార్థము..తామస రజోగుణములు (శుంభ నిశుంభులై )సత్వగుణమూర్తియైన తల్లిని( శరణు)కోరుకున్నవి ఇది ఆంతర్యము..అనుగ్రహించ దలచిన తల్లి చండ-ముండులను నిమిత్త మాత్రులను చేసి,నిర్వాణమొసగినది.అసురత్వము అధికమై గగనమునకెగబాకి యుద్ధముచేయుచున్న వారిని,గరుత్మంతుని రెక్కలయందు బంధించి,శుంభ-నిశుంభులను పునీతులుగ చేసిన చాముండా దేవి నాకు అండయైన సమయమున చెంతనే నున్న నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు..
Comments
Post a Comment