PRAPAsYANTEE MAATAA-02
ప్రపశ్యంతీ మాతా-02
*******************
యా దేవి సర్వభూతేషు తారా రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః.
శక్తి చిఛ్చక్తిగా ప్రకటింపబడుతోంది తారాదేవిగా.తృ అనే ధాతువునుండి ఏర్పడిన నక్షత్రము అనే భావమిచ్చునది తల్లి నామము.అంతే కాదు తరింపచేయునది.
కాళి అను మూలము నుండి వేరొక రూపకల్పనకు సహాయపడు నాభీస్థాన నివాసిని తల్లి.బొడ్డుతాడు ఏవిధముగా తల్లికి పెరుగుచున్న శిశువుకు వారథిగా ఉండి సహాయపడుతుందో అదేవిధముగా కాళి తత్త్వమునుండి తనకు కావలిసినవి స్వీకరించి కొత్తరూపును సంతరించుకున్నది తారాదేవి. కాళిని నల్లని చీకటిగా కనుక మనము భావిస్తే దానిని చీల్చుకొని తేజమును-శబ్దమును వెంట తీసుకుని వచ్చిన శక్తి తార.మూలమైన శక్తి కాళియై సృష్టిని చేసింది.ఇంకొక శక్తిని ప్రకటింపచేసి,సృష్టిలోని అజ్ఞానమును కత్తిరించమంది.అందుకు వెలుగును వాక్కును సహాయకారులుగా పంపించింది.
తారాదేవి ముఖ్యముగా వాగ్రూపశక్తి
.వాక్కు పర-పశ్యంతీ-మధ్యమ-వైఖరి అని నాలుగు విధములుగా విభజింపబడినది.స్థూలములో గమనిస్తే ఉరుములు-చెట్టు కొమ్మలనుండి వచ్చు శబ్దములు-అలల ఘోష-జంతువుల అరుపులు-మానవ సంభాషణలు తల్లి వాగ్రూపముగా చెప్పుకొనవచ్చును. మూలము నుండి బయలు దేరిన వాక్కు-దర్శనమై-భావమై-భాషయై బహుముఖముల విరాజిల్లుతుంటుంది.
కాళిమాత మన గుండెను పనిచేయిస్తుంటే,తారామాత మన వాక్కుకు వారధియై వ్యక్తపరిచేటట్లు చేస్తుంది.
తల్లీ నీవు అత్యంత దయతో నీ నివాసమైన నా
నాభీక్షేత్రము నుండి నాకొరకై పైపైకి పాకుతు
మూలకారణమైన పరావాక్కును పశ్యంతీ గా దర్శింపచేస్తూ,ూ,మధ్యమగా దానిని భావముగా మారుస్తూ,వైఖరి గా భాషను అలది బహుముఖములుగా వీనుల విందు చేయుచున్నావు.నిన్ను ప్రస్తుతించక మనగలనా తల్లీ.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Comments
Post a Comment