Posts

Showing posts from February, 2023

SIVATANDAVASTOTRAMU( TAAMDAVA SIVAM KAROTI)--11

Image
  జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస- -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ | ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||     ప్రస్తుత శ్లోకములో సర్వ చరాచరముల పరిణామములను సంకేతించుచు,విష్ణువు మృదంగధ్వని క్రమముగా స్వామి నర్తనము జరుగుచున్నదని వివరిస్తున్నారు.అదే విధముగా సర్పముల శ్వాసప్రక్రియ యొక్క రాక-పోకల లయము/లీనత్వమును వివరిస్తూ,లలాట నేత్రము ఏ విధముగా కీలలతో జ్వలితమగుచున్నదో వర్ణించబడినది. విత్తు స్థితి నుండి మొలక స్థితికి జరిగే పరిణాములో/మార్పులో పూర్వస్థితి-తదుపరి స్థిలో కలిసిపోతుంది.ఆ మొలక మొక్కగా మారువేళ రెండు స్థితులు అవే బీజస్థి-మొలకస్థితి-మొక్క స్థితిని పొంది,తదుపరి వృక్షస్థితికి చేరునపుడు నాలుగు స్థితులను ఒక స్థితిలో ముందటి స్థితిని లీనము చేసుకుంటూ ముందుకు సాగుతుంది.అదే విధముగా స్వామి తాండవము సైతము ఒక స్థితి నుండి మరొకస్థితి తన పూర్వస్థితిని తనలో లీనము చేసుకొని తదుపరి స్థితిని పొందుటకు ముందుకు సాగుతుంటుంది.  మొదటి శ్లోకములో డమడమ డమ అంటూ డమరుక శబ్దముతో ప్రారంభించిన తాండవమును ధిమి ధిమి ధిమి అను మ్ర్దంగ ధ్వనికి అనుగుణముగా నర...

SIVATANDAVASTOTRAM( MADHUVRATAM AHAM BHAJE)-10

Image
అఖర్వ   సర్వమంగళాకళాకదంబమంజరీ రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ | స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||    "పరిత్రాణాయ సాధూనాం -వినాశాయచ దుష్కృతాం"    అన్న పరమాత్మ నియమమే మధువ్రతము.ఒక చక్కని నియమము.ఆ విషయమునే సాధకుడు ప్రస్తుత శ్లోకములో సుస్పష్టము చేయుచున్నాశ్డు.  అంతేకాదు సాధకుడు స్వీకరనము-సంహరనము అను రెండు విరుద్ధ చ్విషయములను తెలియచేస్తున్నారు.  ఒక పదార్థము కాని-ఒక విషయము కాని స్వీకరణమునకు యోగ్యతను పొందాలంటే దానిలోని దోషములు తొలగ్ఫింపబడాలి.ఆ విషయమునే అమ్మ పరముగా-అఖర్వ సర్వమంగళా గా కీర్తింపబడుతున్నది క్రియారూపముగా. అఖర్వ-దోషరహితమైన సర్వమంగళ కర్తగా స్వామి ప్రస్తుతింపబడుతున్నాడు.  స్వామిని సాకారముగా కీర్తించాలనుకుంటే స్వామి మన్మథుని-త్రిపురాసురుని-దక్షుని-గజాసురుని-అంధకాసురుని-యముని అంతమొనరించి -దోషరహితమైన అమృతత్త్వాని-కదంబ పుష్ప మధువును గ్రహించు వ్రతమును పూనియున్నాడు.  అంతరార్థమును గమనిస్తే స్వామి జనన-మరణ చక్రమునుండి విముక్తులను కావించుచున్నాడు.  కనుకనే, " పునరపి జననం-పునరపు మరణం   పునరపి జననీ-జఠరే...

SIVATANDAVASTOTRAM(AHAM cHIDAM BHAJAE) -09

Image
   ప్రస్తుత శ్లోకములో సాధకుడు తం భజే నిన్ను భజించవలెన్న ఆకాకంక్షను స్వామికి నివేదించుకుంటున్నాడు.  కథాపరముగా అన్వయించుకుంతే జలమయమయిన ప్రపంచము నల్లనికాంతులీనుతున్నది.దానినే "ప్రపంచకాలిమప్రభా" అని స్తుతిస్తున్నాడు.సర్వం అగోచరము.రంగులు లేఉ.గుణములు లేవు.రేయి-పగలు లేదు.త్రిగునములు లేవు.జీవులు లేరు.అంతా ఒకేఒక నల్లనైన ముద్ద.  కాని ఆ నల్లని ముద్దలోని స్వామి అనుగ్రహమనే చైతన్యము ప్రసరించగానే నల్లకలువగా పూర్తిగా విచ్చుకుంటూ దానిలో దాగియున్న ద్వంద్వములను వేరువేరు చేసి చూపిస్తున్నది.అదియే చీకటిని దాటిన ప్రకాశము.మంచిచెడులను గుర్తించగల వివేకము.మనము సున్నను శూన్యము అని భావిస్తాము-పూర్ణము అని కూడా అంగీకరిస్తాము.అదే జరుగుతున్నది ఇక్కడ గుప్తముగా నున్న స్థితి నుండి ప్రకటనము జరుగుచున్నవేళ,ఎన్నో నామములతో-ఎన్నెన్నో స్వభావములతో ఉత్పన్నమైన శక్తులను ఛేదించి-విడదీసి అమనకు చూపించుచున్నది స్వామి కరుణ.అవియే, 1.స్మరత్-మన్మథుడు 2.పురత్-త్రిపురాసురులు 3.భవ-జన్మము 4.మఖము-దక్షుడు 5.గజాసురుడు 6.అంధకాసురుడు 7.యముడు   స్వామి మన్మథుని తన మూడవకంటితో దహించివేశాడు.త్రిపురములను మట్టుపెట్టాడు.పుట్టుక...

SU-IVATANDAVASTOTRAM( TANOTU SRIYAM JAGADDURAMDHARAHA)-08

Image
  నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్- కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః | నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||   స్వామి సేవించిన గరళము గళములో నల్లని కాంతులతో నిగనిగలాడుచున్నది.ఆ నల్లదనము  వర్షించుటకు సిద్ధముగా ఏర్పడిన మేఘసమూహముల కాంతిని తోసివేసినది.అంతే కాదు చిక్కని చీకటికి ప్రతీక అయిన కుహు అమావాస్యను మించినది.ఒక్కొక్క మాసములో వచ్చు అమావాస్య తిథి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగియుంటుంది.సినీవాలి కూడ అటువంటి ప్రత్యేకతను కలిగినదే.పాములతో గట్టిగా చుట్తుకొనబడి యున్నది.నల్లని రంగులో నున్న ఏనుగు చర్మమును ధరించియున్నాడు.స్వామి నిరంజనుడు.నలుపు-తెలుపు వర్ణములకు అతీతుడు.కనుకనే నల్లని వాటితో పాటుగా తెల్లదనముతో స్వఛ్చముగా ప్రకాశించుచున్న సురగంగను-చంద్రవంకను శిరోభూషములుగా అలంకరించుకొనినాడు.సర్వము స్వామి మయమే.స్వామి ప్రకాశమే.ద్వంద్వాతీతుడు. కళానిధానమును నియంత్రించువాడు.అనగా  తిథుల ద్వారా చంద్రుని నుండి సూర్యుని దగ్గరకు,సూర్యుని నుండి చంద్రుని దగ్గరకు కళలను చేర్చుతు పున్నమిని/అమావాస్యను కల్పించువాడు.అంతేకాదు సకల కళలలు నిధానము నెలవు అయినవాడు.సం...

SIVATANDAVASTOTRAM(EKA SILPI TRILOECHANAE MATIRMAMA)-07.

Image
  కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల- ద్ధనంజయాధరీ/  హృతీ  కృతప్రచండపంచసాయకే | ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక- -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||      భాషాపరముగా గమనిస్తే ప్రస్తుత శ్లోకములో రెండు విరుద్ధ విషయములు త్రిలోచనుడు చేసినట్లు కీర్తించబడ్డాయి.  మొదటిది తన మూదవకన్నును యజ్ఞవేదికచేసి తాను ధనంజయుడై/అగ్నిరూపుడై పంచశరములవానిని/మన్మథుని యజ్ఞపురుషునకు హవిస్సుగా అర్పించునాడు.అంటే కాముని దహించివేసినాడు.  రెండవది తన మూడవకన్నును కామప్రకోపితమైన అమ్మవారి వక్షస్థలమును వస్త్రము చేసి తన మనసును కుంచె చేసి తానొక అసమాన శిల్పియై మకరికాపత్ర రచనను చేసినాడు.  అట్టి విరుద్ధస్వభావములు కల స్వామి త్రిలోచనునిపై   నా మనసు లగ్నమై యుండునుగాక అనునది శ్లోక భావము.  సాధకుని దృష్టిలో కాముని దహించినది-కామిని కుచములను సింగారించినది ఒకేఒక లోకాతీత శక్తి.  దానికి ఇంద్రియ లౌల్యము లేదు.సమ్హారము అను పేర అది జీవుని సంస్కరించి తిరిగి పంచకృత్యములను ప్రారంభించినది.  నిజమునకు మన్మథుడు చావలేదు.అహమును తొలగించుకుని,అనంగుడై తన కర్తవ్యమును నెరవేర్చుచున్నా...

SIVATANDAVASTOTRAM( NAH: NAMAT MAHAKAPALI SAMPADE) -06.

Image
  లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా- -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ | సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6   ప్రస్తుత శ్లోకము స్వామి ఆయుధములే-ఆభరనములు/ఆభరణములే ఆయుధములు.అనగా ఆహార్యమే అనురాగముగా ఒకొప్పడు-ఆగ్రముగా ఒకొప్పడు మారుచుండునను చమత్కారమునకు నిదర్శనము.  రెండవశ్లోకము స్వామి ఫాలనేత్రము లలాటమున ధరించిన ఎర్రటి వస్త్రము వలె ధగధగ ప్రకాశించినదట .కాని ప్రస్తుతము ఆ కన్ను అలంకారముకాదు.స్వామి లలాటమనే యహ్నవేదికనుండి వెలువడిన ధనంజయ రూపమై పంచబాణుడైన మన్మథుని దహించివేసినది.  మరొక ఉపమానము చకోర బంధువుగా వెన్నెలలు కురింపించిన చంద్రరేఖ ప్రస్తుత శ్లోకములో అమృతకాంతిగల శిరోభూషణముగా విరాజిల్లుతోంది.    అవి పరాక్రమించిన-ప్రకాశించిన దానికి కారణములు వాటిని గుర్తించలేని మనోదౌర్బల్యమే.దానిని సవరించుటకు స్వామి ఘోర-అఘోర /అగ్ని-సోమాత్మకమును అర్థముచేయించుతకు చెప్పబడినవి.  "మహాకపాలి" బ్రహ్మ కపాల కథను చెప్పకనే చెప్పుచున్నది.ఓ సదాశివ నాకు నీ విశ్వాత్మకతను గుర్తించి అందులోని ఒక చిన్న సూక్ష్మమే నేనను భావనను నా యందు సదా నిలుపుము.   ఏక బిల్వం శివార్పణం...

SIVATANDAVASTOTRAM(SRIYAI CHIRAAYA JAAYATAAM)-05

Image
  సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః | భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||    మొదటి శ్లోకములో శివమును విస్తరింపచేయవలెనన్న ఆకాంక్షను వ్యక్తపరచిన సాధకుడు ప్రస్తుత శ్లోకములను శ్రియమును /సంపదలను స్వామి తాండవము విస్తరింపచేయవలెనన్ను ఆకాంక్షను తెలుపుతున్నాడు.   ఇప్పటివరకు మనతో స్వామి జటలను,గంగమ్మను,కరిచర్మమును,డమరుకశబ్దమును ఆహార్యములో చూపిస్తూ,అగ్నిసోమాత్మకుని అర్థనారీశ్వరునిగా ఆరాధిస్తూ ఆ పవిత్ర తాందవము సకల చరాచరములను ఏ విధముగా చైతన్యము చేస్తున్నదో వివరిస్తున్న సాధకుడు మనకు దేవతలను వారి వినయ నమస్కారములతో రాలిపడిన పుప్పొడులతో వింతరంగులో ప్రకాశించుచున్న స్వామి పాదపీఠమును సాక్షాత్కరింపచేయుచున్నాడు.    సాథకుని ఆకాంక్ష స్వామి సంపదలను సకలజగములపై విస్తరింపచేయుట.  ఆ విషయమును నాలుగు విశేషములద్వారా మనకు తెలియచేస్తున్నాడు.  స్వామి సిగను కీర్తించునప్పుడు చంద్రుని చకోరబంధువుగా. వెన్నెలతాగి ప్రాణమును నిలుపుకొనునది చకోరపక్షి.దానిని అనుగ్రహించు శక్తిని పొందిన చంద్రుని సిగపూవుగా ధరించినవాడు స్వామి.శాపవశమైన చం...

SIVATANDAVASTOTRAMU( ADBHUTA VINODAM BHIBHARTU)04

Image
 4.జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే | మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||  మొదటి శ్లోకములో స్వామి తాండవ స్థలిని-స్వామి తాండవవము ద్వారా సమస్త మంగళములను విస్తరింపచేయుటను ప్రస్తావించిన సాధకుడు,  రెండవ శ్లోకములో స్వామి ఆహార్యమును అట్టి మంగళ తాండవమును తన చిత్తములో నిలుపుకొనవలెనను ఆకాంక్షను తెలియచేసినాడు.  మూడవ శ్లోకములో తాండవ వినోదమునందించు వస్తువుల యొక్క అగ్ని-సోమాత్మకతను అన్వయిస్తూఏ వానిలో దాగిన అర్థనారీశ్వర పరమార్థమును ప్రస్తుతిస్తూ ఆ నందము యొక్క శాశ్వతవమును ఆకాంక్షిస్తున్నాడు.   ప్రస్తుత శ్లోకములో సాధకుడు రెండేరెండు ఉపమానములను 1) సర్పములు 2)గజచర్మము తీసుకుని అనుపమాన స్వామి తేజమును తెలియచేస్తున్నాడు.  ఇప్పటి వరకు మనము స్వామి జటలు అడవి వలె నున్నవని,కటాహము వలె నున్నవని చెప్పుకొనినాము.     ఇప్పుడు ఆ జటలు పాములచే చుట్టబడినవట.అంటే మొదటి శ్లోకములో గళమున అలంకారముగా హారము వలె మెరిసిన సర్పము/సర్పములు చరచర పాకి జటలను చుట్టుకొనినవట.కాదు కాదు  స్వామి తన జటలను ఎర్రని వర్ణములుగల...

SIVATANDAVASTOTRAMU-(ETU VASTUNI-MANOVINODAM)-03

Image
 3.ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||   శివములను సర్వత్ర విస్తరింపచేయు శివతాండవమును సదా నా మనసులో చూడాలనే ఆకాంక్షను వ్యక్తము చేసిన సాధకుని పురాకృతపుణ్యమా అనునట్లుగా అగ్నిసోమాత్మకమిన శివస్వరూపము అర్థనారీశ్వరముగాను సాక్షాత్కరించుచున్నది.తనకోరికను తీర్చుటకు ఆలంబనములైన సంఘటనలను సైతము వ్యక్తము చేయుచున్నది.అవి స్వామి అమ్మతో కలిసి జతగా చేయు తాండవము ద్వారా కరుణావీక్షనములను ప్రసరింపచేయుచు దుర్భరమైన ఆపదలను దూరముచేయుచున్నాడట.అంతే కాదు తనకున్న వైరాగ్యమునకు-వ్యాపకత్వమునకు గుర్తుగా దిగంబరుడిగా ప్రకాశించుచున్నాడు.అన్నీ తానే-అంతా తానైన చైతన్యము సమస్త జగములను జాగృతపరచుచున్నవేళ సమస్త సంతతి ప్రమోదముతో నిండియుండునుకదా.దానికి కారణమైన శివశక్త్యాత్మకమైన చైతన్యము నన్ను వీదకుండుగాక.  స్వామి స్వరూపమునకు సంకేతము దిగంబరములను అనగా దిక్కులనే వస్త్రములుగా ధరించినవానిని-అఖండుని దర్శిస్తూ,దుర్లభమైన ఆపదలను సైతము దగ్గరికి చేరనీయని దయావీక్షణము నన్ను ఆశీర్వదించుగాక.    ఏక బిల్వం శివార్పణం....

SIVATANDAVASTOTRAM-02 ( RATI PRATI KSHANAM MAMA)

Image
 2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2.     మమ పతి క్షణం రతిః-ప్రస్తుత శ్లోకములో  మనకు సాధకుడు తెలియచేస్తున్న ఆకాంక్ష.  రతిః-స్థిరమైన ఆనందమును శివతాండవము ద్వారా పొందవలెనన్నది కోరిక. కాని మొడటి శ్లోకములు మంగళాశాసనముగా స్వామి శుభంకరుడై తన తాండవము ద్వారా శుభములకు సమస్తమునకు విస్తరింపచేస్తాడని కీర్తిస్తున్నది.  కాని భాషాపరముగా అన్వయించుకుంటే అది  చ కార చండ తాండవం-జరిగిపోయిన తాండవము.అందులో కేవలము రంగస్థలము ఏ విధముగా సంప్రోక్షణము గావింపబడినదో,స్వామిని సర్పము ఏ విధముగా చుట్టుకొని సత్కరించినదో,డమరునాదము స్వామి కదలికలకు మంగళ వాయిద్యముగా మ్రోగినదో కీర్తించబడినది.  కాని సాధకుని చిత్తములో అది నిత్య-సత్య చైతన్య తాండవము.దానిని ప్రతిక్షణము అనుభవిస్తూ ఆనందపడటమే ఆకాంక్ష.కనుక రెండవ శ్లోకములో,  శాశ్వతానందమును పొందుతకు సహకరించుచున్న నాలుగు ఉపమానములను సాధకుడు ప్రస్తావించుచున్నాడు. 1.మొడటిది-స్వామి   మూర్థని-శిరము పైభాగము.అది ఇప్పుడు అడవిగా నున్న జటలతో...

SIVATANDAVASTOTRAMU-01( " TANOTU NA SIVAH SIVAM)

Image
 SLOKAM. 1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||    ప్రస్తుత శ్లోకము పరమాత్మ సాకారమును అగ్నిసోమాత్మకముగా,అనగా ప్రజ్వలనము-ప్రకాశము మేళవించుకొనినట్లున్నదట.దానికి ఉదాహరనముగా స్వామి జటాజూటము-అందులో బంధింపబడియున్న గంగమ్మ అటు-ఇటు కదలలేక సుడులు తిరుగుచున్నదట.జటా స్వరూపము ఘోరత్వమునకు-గంగ జలము చల్లదనమునకు సంకేతములుగా నున్నవి.అంతేకాదు స్వామి ఫాలనేత్రము-అగ్ని తత్త్వమునకు-వేడికి-సిగలోని చంద్రరేఖ చల్లదనమునకు సాఖ్యముగా నున్నవట.స్వామి తాండవమునకు కైలాసము వేదికయైనది.ఆ వేదిక స్వామి తలపై నుండి జారిపడుచున్న గంగమ్మ దైవ ప్రవాహ జలముతో సంప్రోక్షితమైనది.నర్తకుడు కూడా తన గలములో సర్పమును మాలగా ధరించి సభామర్యాదతో గౌరవింపబడుతున్నాడు.మంగళవాయిద్య సూచకముగా స్వామి చేతనున్న డమరుకము ధ్వనులను చేయుచున్నదట. ప్రథమ పాదము వేదిక ప్రాభవమును ప్రస్తావించుచున్నది.  స్వామి చేయబోతున్నది చండ తాండవము-అనగా దానికదేసాటి.అసమానమైనది.ఆ తాండవము శివః-శుభస్వరూపునిచే,సివం-శుభములను-తనోతు-విస్తరింపచేయునది.  సకలచరాచరములలో...

SIVATANDAVASTOTRAMU-INTRODUCTION

Image
  "ప్రదోషం రజనీముఖే" ఆర్యోక్తి.ఆ సమయ ప్రాశస్త్యమును తెలియ్స్చేయునది శివ తాందవ స్తోత్రము.    శివము అంటే నిత్యము-సత్యము అయిన మూలము.అది నిరాకారముగా నున్న భావనలో.ఆ మూలము తాను నిశ్చలముగా నుండి సకల చరాచరములను స్పందింపచేయుటయే తాండవము.ఇతిహాసము అనగా ఈ విధముగా జరిగినది అని చెప్పబడు సాహితీవిధానము.నిశ్చలమైన తత్త్వమును తెలిసికొనవలెనన్న దాని చుట్టు చలించుచున్న మరొక ఉదాహరనమును చూపితేగాని అర్థము చేసికొనుట కష్టము.కనుక సనాతనము నామరూపములను ప్రకటించేసినట్లు,ఆ ప్రకటిత స్వరూపము ఒక సభాస్థలిని-సమయమును-సందర్భమును,స్వభావమును వివరిస్తూ,సాక్షాత్కారమును కలిగిస్తూ,సత్కృపను వర్షిస్తుంది.దానిని అందుకొనుటకు హృదయమనే పాత్రను శుభ్రపరుస్తుంది.సిద్ధము చేస్తుంది.ముద్దు తీరుస్తుంది.దానికి ఉదాహరణమే మనము చర్చించుకునే "శివతాండవ స్తోత్రము".వేదిక కైలాసము.సమయము ప్రదోషము.సందర్భము రావణ దర్శనము-అనుభవము." సాహిత్యము పంచ చామర వృత్తము.పూజావసాన సమయమున స్తోత్ర పఠనము సర్వార్థసాధకమని చెప్పబడినది ఫలసృతిగా.ఈ స్తోత్రము 15 భాగములుగా/శ్లోకములుగా వానిలో రెండు ఫలశృతిగా,మిగిలిన 13 భక్తుని ఆకాంక్షగా స్వామి తాండవ సంరంభము,సాక్ష...

SIVATANDAVASTOTRAMU-PRATIPADAARTHAMU-BHAAVAMU.

Image
    శివతాండవ స్తోత్రము-రావణకృతము   ************************** 1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||  శివతాండవము జరుగు పవిత్రస్థలమును గురించి చెప్పబడినది మొదటి భాగము.  జటాటవి- అడవి వలె జటలున్న ప్రదేశమునుండి,  గలజ్జల- పవిత్రమైన జలము,  ప్రవహించి_ ప్రవాహ  పావిత-పవిత్రమొనరించిన,స్థలే-స్థలము అది.శివజటాజూటమునుండి గంగాజలము సంప్రోక్షించబడి పునీతమైన ప్రదేశములో తాండవము  ప్రారంభమగునట.అదియె వికార రహితమైన మన హృదయసీమ. గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.   స్థలమును గంగ పవిత్రమొనరించినది.వెంటనే, భుజంగములు గళమున మాలుకలుగా తమను తాము అలంకరించుకొని తరించినవి.  .డమడ్దమ నినాదవడ్దమర్వయం,  గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమడమ నినాదముతో స్వామి చేతిని అలంకరించి,అర్వయం -ప్రకాశించుచున్నది. చకార చండతాండవం తనోతు నః శివః శివమ్-అనుగ్రహమును అర్థించు చమకమునకు ఫలముగా స్వామి తన తాండవముతో మనలను అనుగ్రహించుగాక.ఓం నమః శివాయ. 2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్...

PARUGULELA PATTUKONAGA-OM NAMASIVAYA

Image
      పరుగులేల పట్టుకొనగ-ఓం నమః శివాయ   ******************************  స్పూర్తినిచ్చిన సిద్ధార్ శివవాక్కియర్ కు నమస్కారములతో (ఓడి-ఓడి-ఓడి-ఓడి-పరుగులు తీసి తీసి పట్టుకోగలవా) ఈ చిన్ని ప్రయత్నము.పెద్దలు తప్పులు సవరించగలరు.  1.వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి నీటిమీది వ్రాతలే    మాసి మాసి మాసి మాసి ముసురుకున్న మాయలో    చూసి చూసి చూసి చూసి మోసపోయి శంకరా    రోసి రోసి రోసి రోసి సమసిపోయిరెందరో.      ఓ పరమేశా!మాయముసుగులో నిన్ను కనలేక స్థిరముగా నిలువని నీటి ప్రవాహముపై నీ నామమును వ్రాసి,నిన్ను దర్శించాలని పరుగులు తీసి తీసి కనుగొనలేక కనుమరుగు అయినవారెందరో.అట్టి అజ్ఞానమును మన్నింపుము.  2.నీది ఏది? నాది ఏది? నీదినాది కానిదేది?    జననమంటు-మరణమంటు ఆటలాడుచున్నదేది?    రాజు అంటు-గురువు అంటు మాటలాడుతున్నదేది?    వేరుచేసి చూపుచున్న" నేను"  అన్న భ్రాంతియే.      ఓ మహేశా! నేను అన్న దేహభ్రాంతి నిన్ను నా నుండి వేరుగా భ్రమింపచేస్తూ,చావు పుట్టుకలగురించి,నీవు-నేను అన్న ద్వంద్వముల గురించి వి...