ADITYAHRDAYAMU-SLOKAMU-31
ఆదిత్యహృదయము-శ్లోకము-31 *********************** ప్రార్థన ******* "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో , మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట. శ్లోకము ****** "అథ రవిరవదన్నిరీక్ష రామం ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్య గతో వచస్వరేతః" ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం." ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవ...