Posts

Showing posts from March, 2024

ADITYAHRDAYAMU-SLOKAMU-31

    ఆదిత్యహృదయము-శ్లోకము-31   ***********************  ప్రార్థన  *******  "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం   అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  ***********  పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో ,  మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట.  శ్లోకము  ******  "అథ రవిరవదన్నిరీక్ష రామం   ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః  నిశిచరపతి సంక్షయం విదిత్వా  సురగణ మధ్య గతో వచస్వరేతః"    ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే    ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం."   ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవ...

ADITYAHRDAYAM-SLOKAM-30

   ఆదిత్యహృదయము-శ్లోకము-30  ***********************  ప్రార్థన  ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాపద్వేష దుఃఖస్యనాశం   అరుణ కిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."    పూర్వ రంగము.    ***********     మనముఇప్పటివరకు సూర్యభగవానుని కరుణామృతవర్షమును గురించి తెలుసుకునే ప్రయత్నములో ఒక్కసారి 'పదకవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనను ప్రస్తావించుకుందాము.  " నీవొక్కడివే సర్వాధారము    నిన్నే ఎరిగిన అన్నియునెరుగుట   .....  నీ యందె బ్రహ్మయు రుద్రుడు ఇంద్రుడు   నీ యందె ఋషులు  నీయందె గరుడ గంధర్వులు  నీ వలననె కిన్నెర కింపురుషులు  నీ వలననె అచ్చరులు ఉరగులు    ఎంతటి అద్భుతము " నీ యందె ద్వాదశాదిత్యులు"    ఓ పరమాత్మ! ఓ పరంధామ  నీలోనె అన్నియును  నిన్నర్చించిన -నిఖిల తృప్తికరము అని ప్రత్యక్ష పరమాత్మ తత్త్వమును ప్రస్తుతించినాడు.  మరొకమహానుభావుడు,  నారాయణా! నారాయణా  నను కావుమో సూర్యనారాయణా ...
   ఏక ఏవహిలోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః-భాగవతపురాణము.  ప్రంచ స్థితికి పూర్వస్థితిచీకటియే కదా.తమోగుణప్రధానులైన హర్తి-ప్రహేతిమొదలగు రాక్షసులు సూర్యభగవానుని రథమును ముందుకుజరుపుతుంటారు.  సూర్యభగవానునిప్రతికిరనము నాదమయమే.ధర్మసంకేతము.  నాదాత్మకమైన సూర్యకిరన శక్తియే గాయత్రీమంత్రము.  గాతారం ధారయతీతి గంధర్వః.గానధరులు గంధర్వులు.  చాందగ్యోపనిషత్తు సూర్యపరమాత్మ నుండిజనించు నాదమును ప్రణవముగా కీర్తిస్తుంది.  వాలిఖ్యాది మునులు సూర్యకిరనములనాశ్రయించుకుని తపోసంపన్నులుగా అలరారు తున్నారు. వారుసూర్యరథమునకు అనవరతముమంగళాశాసనములనుసమర్పిస్తుంటారు.వాలిఖ్యము నగాఖండము. ప్రతిసూర్యమాసమునందు ఒక్కొక్క ఋషి రథముకదలబోవు సమయమున దానికి ముందునిలబడి,స్వామి రథగమనమును సంకేతిస్తారట.  పాతాళలోక సాంరక్షణమునకు స్వామిని సర్పములు స్వామి రథ పగ్గములను సవరించి,పయనమునకు సిద్ధము చేస్తాయట.  ఋషులు-గంధర్వులు-యక్షులు,నాగులు,రాక్షసులు-అప్సరసలు దేవతలు అను సప్పగనములతో సేవింపబడుతూ స్వామిసర్వమంగళములనూనుగ్రహిస్తాడు.  యక్షులు వీరూపదేవతలు.వీరు స్వామి రథమునకూశ్వములనూనుసంధానముచేస్తుంటారు.భూగర్భ స...
   శ్లోకము  *******  " సర్వ మంగళమాంగల్యం సర్వపాప ప్రణాసకం    చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం."   ఆదిత్యహృదయ స్తోత్రము సర్వమంగళములకు మూలాధారము.సర్వపాపములను నశింపచేయునది.చింతాశోకనిర్మూలమునకు కారణభూతమైనది.    మనము ఆదిత్యహృదయ స్తోత్ర సారమును పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ఒక చక్కటికీర్తనతో అర్థమయేలా వివరించారు.  "నీవొక్కడివే సర్వాధారము   నిన్నే ఎరిగిన అన్నెయు నెరుగుట   అంటూనే సర్వము గురించి విశదీకరించారు.  1.నీ యందె బ్రహ్మయు రుద్రుడుఇంద్రుడు    ఆదిత్యహృదయము సైతము   ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద అంటూ,   దేవతలప్రసక్తి తెచ్చినది.   పరబ్రహ్మపరిపాలన నిమిత్తము తననుండి కొన్ని శక్తులను ఆవిర్భవింపచేసి వారిలో/వాటిలో తాను ప్రవేశించి పరిపాలించుచున్నాడు.  2.నీ యందె మనువులు-వసువులు-ఋషులు    సూర్యనారాయణుడు పన్నెండు సౌరమాసములకు అదే మధుమాసము-మాధవమాసము ఇత్యాది పన్నెండు విభాగములకు పన్నెండు స్వరూప-స్వభావములతో,నామరూపములతో సృష్టి-స్థితికార్యములను నిర్వహిస్తున్నాడు.ఆ విషయమునే,  3.నీ యందె ద్వ...

ADITYAHRDAYAM-SLOKAMU-29

Image
     ఆదిత్యహృదయం-శ్లోకం-29   ********************  ప్రార్థన  *******  'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హిరణ పాప  ద్వేష  దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."   పూర్వరంగం   **********  ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుట కు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు.  శ్లోకము  ******  " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్    సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్."  ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము.   దీనిలో దాగిన మర్మము మహాద్భుతము.  భగవద్గీతలోని గుణత్రయవిభాగమును  మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే.   ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము.  రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు.   ...

ADITYAHRDAYAM-SLOKAM-28

Image
         ఆదిత్యహృదయము-శ్లోకము-27   **********************  ప్రార్థన  ******  "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం  తం నమామి.   పూర్వ రంగము   ********  అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .   ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా  విధానము  పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.   ఆచమనము అనగా   భాషా[అరముగా                  ద్రవమును స్వీకరించుట,త్రాగుట.   సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి  లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూ...

ADITYAHRDAYAM-SLOKAMU-26

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-26  *******************  ప్రార్థన  *****  " జయతు  జయతు సూర్యం  సప్తలోకైక దీపం    తిమిర  హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువనవంద్యం  భాస్కరం  తం నమామి."    పూర్వ రంగము    ********** యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.  తత్ఫలితముగా రాముని రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు.   సీతమ్మ  ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నాది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.    యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు.  అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.  సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట.    తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము  సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస...

ADITYAHRDAYAM-SLOKAM-25

Image
        ఆదిత్యహృదయము-శ్లోకము-25   *********************  ప్రార్థన  ****  " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం    తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."  పూర్వరంగము  *********  శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,సకలంభువనం-చకలము-బుకలము,ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే,  ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన  పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు.  ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో  ఉపాధి నిరపేక్ష అనుసంధానము.   ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ.  ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో   ...

ADITYAHRDAYAM-SLOKAM-24

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-24  **********************   ప్రార్థన   ********  " జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ  గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం    సకల భువన వంద్యం భాస్కరం తం నమామి"   పూర్వరంగము   **********   సూర్య ఆరాధనము వలన ఏ విధముగా స్థితప్రజ్ఞత అనుగ్రహింపబడుతుందో వివరించిన తదుపరి,ఆరాధనము ఏవిధమైన లక్షణములను కలిగియుండాలి అన్న అంశములను వివరిస్తున్నారు.పరమాత్మ "దేవదేవుడు.జగత్పతి.     అని పరమాత్మను కీర్తిస్తూ,  త్రిగుణితం-అన్న పదమునకు మూడుసార్లు అని సంఖ్యాపరముగాను,  మూడు గుణములతో అని స్వభావ పరముగాను మూడు శభ్దమును "అనంత పరముగా 'విశ్లేషిస్తారు.  కనుకనే సహజకవిపోతన,  ముగురమ్మల మూలపుటమ్మగా -పరాశక్తిని ప్రస్తుతించారు.  అదే విషయమును అగస్త్య భగవానుడు సైతము ప్రస్తుత స్తోత్రములో,  " ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-సివ-స్కంద-ప్రజాపతి-మహేంద్రో-ధనదః-కాలః-యమః-సూర్యః" అంటూ తెలియచేసారు.   త్రిగుణితము అన్న పదమునకు అనంతత్త్వమును అ...

ADITYAHRDAYAM-SLOKAM-23

Image
    ఆదిత్యహృదయము-శ్లోకము-23   **********************  ప్రార్థన  ***** " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణ సమిత పాప ద్వేష  దు@ఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం  నమామి."   పూర్వరంగము   **********  ఆదిత్యుని విశ్వాత్మకునిగా-విశ్వరక్షకునిగా-  అగ్నిహోత్రునిగా-అగ్నికార్యమైన క్రతువుగా సంభావించిన అగస్త్య భగవానుడు ,పూర్వ శ్లోకములలోని ప్రతిపదము ఫలశృతియే యైనప్పటికిని,ప్రస్తుత శ్లోకము నుండి తదుపరి శ్లోకములను "ఫలశృతిగా/ఫలసిద్ధిగా"పరిగణిస్తారు దైవజ్ఞులు.  ఇంకొక విశేషమేమిటంటే అగస్త్య భగవానుడు, "రామ రామమహాబాహో" అన్న శ్లోకములో రామచంద్రుని సంబోధనము తరువాత గుహ్యముగా చెప్పవలసినది పూర్తిచేసి,రాఘవ శబ్ద ప్రయోగముతో ప్రియతాత్మజ అని యుద్ధోన్ముఖుని చేసి యుద్ధరంగమును నిష్క్రమించినాడు.  పరమాత్మను విష్ణుస్వరూపునిగా భావించి,కొలిచేవారు,  "ఆర్తా విషణ్ణా-శిధిలాశ్చ భీతా   ఘోరేషుచ వ్యాధిషు వర్తమానా   సంకీర్త నారాయణ శబ్ద మాత్రం   విముక్త దుఃఖః సుఖినో భవంతు"  అని ఫ...

ADITYAHRDAYAM-SLOKAM-22

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-22    *******************  ప్రార్థన  *****  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."    పూర్వరంగము    ***********  ఏషచైవాగ్ని హోత్రంచ-ఫలంచావైగ్నిహోత్రిణాం"  అంటూ,స్థూలము నిద్రాస్థితిలో నున్న వేళ సైతము తాను జాగరూకతతో నుండి,తన అగ్ని అను శక్తిచే సర్వ దోషములను /మలినములను శుద్ధిపరుస్తూ,ప్రకృతిని-ప్రజలను చైత్న్య వంతము చేస్తున్న సూర్యభగవానునకు నమస్కారములు.   ప్రకృతిలోని పంచభూతములలోను,ప్రజలలోని పంచేంద్రియములను నిరతరము దాగియున్న చైతన్యశక్తియే అగ్నిహోత్రము.   ప్రకృతిలో అదిలోపించనచేభూమండలము గడ్డకట్టి స్తంభించిపోతుంది.   మనలో అదిలోపించినచో మనుగడ స్తంభించిపోతుంది.  కనుకనే రుద్ర చమకము ప్రథమ అనువాక ప్రథమ శ్లోకము,  " ఓం అగ్నా విష్ణుం సజోషసేమా వర్థంతు.,"  అంటు మీరిద్దరు నా పట్ల సద్భావనను కలిగి యుండండి అని అర్థిస్తున్నది,  స్థితికార్యమునకు అగ్ని శక్తి యొక్క ...

ADITYAHRDAYAM-SLOKAM-21

Image
        ఆదిత్యహృదయం-శ్లోకము-21       *********************  ప్రార్థన  ******  "జయతు జయతు సూర్యం  సప్త లోకైక దీపం   తిమిరహిరణ పాప ద్వేషదుఃఖస్య నాసం   అరుణకిరన గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."     పూర్వ రంగము   ***********  పరమాత్మ నాశయత్వేవ  వైభూతం  తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను   1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు.    శ్లోకము  ******  "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః   ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."   అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు.   ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్షముగా నున్నది అన్నది ప్రస్తుతము.  ...