ఏక ఏవహిలోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః-భాగవతపురాణము.

 ప్రంచ స్థితికి పూర్వస్థితిచీకటియే కదా.తమోగుణప్రధానులైన హర్తి-ప్రహేతిమొదలగు రాక్షసులు సూర్యభగవానుని రథమును ముందుకుజరుపుతుంటారు.

 సూర్యభగవానునిప్రతికిరనము నాదమయమే.ధర్మసంకేతము.

 నాదాత్మకమైన సూర్యకిరన శక్తియే గాయత్రీమంత్రము.

 గాతారం ధారయతీతి గంధర్వః.గానధరులు గంధర్వులు.

 చాందగ్యోపనిషత్తు సూర్యపరమాత్మ నుండిజనించు నాదమును ప్రణవముగా కీర్తిస్తుంది.

 వాలిఖ్యాది మునులు సూర్యకిరనములనాశ్రయించుకుని తపోసంపన్నులుగా అలరారు తున్నారు.

వారుసూర్యరథమునకు అనవరతముమంగళాశాసనములనుసమర్పిస్తుంటారు.వాలిఖ్యము నగాఖండము.

ప్రతిసూర్యమాసమునందు ఒక్కొక్క ఋషి రథముకదలబోవు సమయమున దానికి ముందునిలబడి,స్వామి రథగమనమును సంకేతిస్తారట.

 పాతాళలోక సాంరక్షణమునకు స్వామిని సర్పములు స్వామి రథ పగ్గములను సవరించి,పయనమునకు సిద్ధము చేస్తాయట.

 ఋషులు-గంధర్వులు-యక్షులు,నాగులు,రాక్షసులు-అప్సరసలు దేవతలు అను సప్పగనములతో సేవింపబడుతూ స్వామిసర్వమంగళములనూనుగ్రహిస్తాడు.

 యక్షులు వీరూపదేవతలు.వీరు స్వామి రథమునకూశ్వములనూనుసంధానముచేస్తుంటారు.భూగర్భ సంపదలను వృక్ష సంపదలనుకాపాడుతుంటారు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)