శ్లోకము

 *******

 " సర్వ మంగళమాంగల్యం సర్వపాప ప్రణాసకం

   చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం."


  ఆదిత్యహృదయ స్తోత్రము సర్వమంగళములకు మూలాధారము.సర్వపాపములను నశింపచేయునది.చింతాశోకనిర్మూలమునకు కారణభూతమైనది.

  

మనము ఆదిత్యహృదయ స్తోత్ర సారమును పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ఒక చక్కటికీర్తనతో అర్థమయేలా వివరించారు.

 "నీవొక్కడివే సర్వాధారము

  నిన్నే ఎరిగిన అన్నెయు నెరుగుట

  అంటూనే సర్వము గురించి విశదీకరించారు.

 1.నీ యందె బ్రహ్మయు రుద్రుడుఇంద్రుడు

   ఆదిత్యహృదయము సైతము

  ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద అంటూ,

  దేవతలప్రసక్తి తెచ్చినది.

  పరబ్రహ్మపరిపాలన నిమిత్తము తననుండి కొన్ని శక్తులను ఆవిర్భవింపచేసి వారిలో/వాటిలో తాను ప్రవేశించి పరిపాలించుచున్నాడు.

 2.నీ యందె మనువులు-వసువులు-ఋషులు 

  సూర్యనారాయణుడు పన్నెండు సౌరమాసములకు అదే మధుమాసము-మాధవమాసము ఇత్యాది పన్నెండు విభాగములకు పన్నెండు స్వరూప-స్వభావములతో,నామరూపములతో సృష్టి-స్థితికార్యములను నిర్వహిస్తున్నాడు.ఆ విషయమునే,

 3.నీ యందె ద్వాదశాదిత్యులు" అనినొక్కి వక్కాణించాడు.

   వారు ఎవరితో/ఏ ఏ శక్తులతో ఏ ఏ విధముగా గ్రహములమధ్యన,భూభ్రమనమునందు ,జలవనరుల,వాతావరనపరిరక్షనమునందు,ఒకరికొకరు సహాయపడుతూ ఋతుచక్రమును సమర్థవంతముచేస్తారో వివరించాడు.

  4. నీ యందె ఉరగులు-యక్ష-రాక్షసులు

  5.నీ వలననేచ్చరలు-కిన్నెర కింపురుషులు

  6.గ్రహములు-నక్షత్రములు

    నీలోనె అన్నియును

    నిన్నర్క్హించిన నిఖిలతృప్తికరము,


   అసలు ఈ దంధర్వులు,మునులు,యక్షులు,నాగులు,కిన్నెరలు,రాక్షసులు,అపసరసలు వీరిప్రసక్తి ఎందుకు వచ్చింది.వీరికి పరమాత్మతో నున్నానుబంధం ఏమిటి? అని ఆలోచిస్తే,

   సూర్య పురానము సైతము సూర్య రథగమనసమయమునవీరందరి ప్రాముఖ్యతన చక్కగా వివరించింది.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI