Posts

Showing posts from April, 2024

TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02

Image
   1-    అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.  కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.  స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.  అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.  చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు. నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు. 1.బ్రాహ్మీ 2.మహేశి 3.కౌమారి 4.వైష్ణవి 5.వారాహి 6.మాహేంద్రి 7.చాముండా     మహాలక్ష్మి,  యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,  ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడు...

TRILOKAMOHANCHAKRPARICHAYAMU --01

Image
  1-  "విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసుః"   అని పరమేశ్వరిని ప్రస్తుతిస్తుంది లలితరహస్యసహస్రనామ స్తోత్రము.   శృంఖలములు /సంకెలలోబంధింపబడియున్నదెవరు.పరమేశ్వరి వాటిని తన అనుగ్రహముతో ఎలా తొలగిస్తున్నది అన్న అవ్యాజకరుణయే దేవీఖద్గమాలా స్తోత్రములోని నవావరణ ప్రాధాన్యము.  నిరంతరము మనలను అల్లుకుంటున్న మాయతెర మనలో దాగిన శక్తులను నిద్రాణముచేస్తూ,మనము గుర్తించలేని స్థితిలో ఉంచుతుంది.మూలాధారము తమోమయము.దానిలో నుండి ఊర్థ్వపయనము ప్రారంభించనంతవరకు పశుపక్ష్యాదులకు వలెనె మానవులకు సైతము "ఆహార-నిద్రా-భయ-మైథునస్య" ఏ సమస్తముగా ఉంటుంది.అమ్మ అనుగ్రహముతో ఇది కాదు జీవితపరమార్థము అన్న నిజమును గుర్తించి,దానిని తెలుసుకొనుటకు ఉపక్రమించెదరు.  మానవ మేథస్సు పరిమితమైనది.అమ్మ తత్త్వము అపరిమితము.కారుణ్యము కరావలంబమవుతుంది.మనము ఏ విధముగా ఒకే స్థలములో నున్న వివిధ గదులను వంటిల్లు,నిదురిల్లు,ముందుగది,పెరడు అను వివిధ నామములతో,ఆప్రదేశములో నున్నప్పుడు వివిధ ప్రవృత్తులతో ఉంటాము.అదేవిధముగాబడి-గుడి-వైద్యశాల-గ్రంధాలయము అంటూ వివిధ పనులకు అనువుగా భవనములను పిలుస్తుంటాము.  మన ఆలోచనలకు అనుగుణముగా/సులభ...

CHAKRESVARI-PARICHAYAMU

Image
   " కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం    మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం    దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం    త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."    శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,  మహత్తు-అహంకారము  శివశక్తులు  స్థావర-జంగమము  ప్రకృతి-పురుషులు గా   ప్రకటింపబడుతూ,   పంచకృత్యాసక్తులై,  పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి, మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.  ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.   సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.  త్రిపురాను ఉపసర్గనుపొందిన,  1.త్రిపుర ...

AMGADEVIS-PARICHAYAMU-02

Image
   " హంస హంసాయవిద్మహే    పరమహంసాయ ధీమహి    తన్నోహంసః ప్రచోదయాత్"   హంస మానవ ఉపాధి చేస్తున్న శ్వస ప్రక్రియ.పరమ హంస లోపలి చైతన్యము జ్వలిస్తున్న విశ్వాస ప్రక్రియ.  పరమేశ్వరి సర్వారుణ-అనవద్యాంగి అనికీర్తిస్తున్నదిలలితా రహస్య సహస్రనామస్తోత్రము.అంటే షడంగ శక్తులూనవద్యములు.లోపరహితములు.శ్రేయోదాయకములు.   షడంగదేవతల ప్రస్తావనము అంగన్యాస/కరన్యాసముల పూజాప్రక్రియలో వస్తుంది.   పరమానందము ఎక్కడో లేదు అది పరమాత్మనివాసమైన మన హృదయము లోనే ఉన్నదను విషయము మన మిథ్యాప్రపంచ వ్యామోహము అడ్డుగా నిలిచి,అర్థము కానీయకున్నది.   దానినితొలగించుకొనినతరువాత,  ప్రతిశబ్దము  ఓంకారమే  ప్రతి దృశ్యము మమకారమే  పంచభూతములు స్నేహితమే  పంచకృత్యములు పరమార్థమే.    క్షణభంగురములకు తావులేదు.   సర్వమంబామయం జగం.ప్రపంచము-పరమేశ్వరి అవిభ్  సర్వము అనాజ్యములు.అందులో నేనొక భాగము అను ఎరుకకలిగిన నాడు,సాధకుడు, 1.తనహృదయమున ప్రాణశక్తిని గుర్తించగలుగుతాడు.ఆ ప్రాణ శక్తికి తెలియని విషయములేదు.జ్ఞానమే హృదయము.కనుకనే ఆ పరమేశ్వరి  అరుణాం కరుణా తరంగితాక్షిమ...

AMGADEVIS-PARICHAYAMU-01

Image
    సనాతనములో ఉపాసనా విధానములు, ఉపాధి సహిత-ఉపాధి రహిత అని రెండు విధములుగా చెప్పబడినది.  ద్వంద్వ భావనతో ఎదురుగా ఒకయంత్రమునో/మూర్తినో/మేరువునో అసీనము చేసి తాను జీవుడనను భావనతో స్తోత్రము చేయుచు ఆ యాస్థలములలో/ఆవరణములలో పుష్పార్చనకాని,హరిద్ర-కుంకుమార్చనము కాని చేయు విధానము.  ఆపరమేశ్వరి అనుగ్రహము అవ్యాజముగా ప్రసరించినచో ఆ సాధకుడు చేయుచున్న అజపావిధానమే వానిలో తానొక ఉపాధి మాత్రమే కాదని దానిలో దాగిన ఆదిశక్తి చైతన్య స్వరూపుణియై ప్రాణశక్తి తానై అనేకానేక శక్తులుగా పంచేంద్రియములుగా భాసిస్తున్నదని తెలిసికొనిన వేళ తనకుఇన్నాళ్ళు అడ్డుగా నున్న మిథ్యాప్రపంచమును గుర్తించగలిగి,ఏకాగ్రచిత్తముతో పారమార్థికము వైపు పయనించగలుగుతాడు.  పరిపక్వతనొందిన అర్చన తన లోని షడంగములను అమ్మౌంకిని గుర్తించుటకు-అమ్మ అనుగ్రహమునుపొందుటకు సాధనములుగా మలచుకుంటాడు.  అమ్మ, "షదంగ దేవతాయుక్త" అను దివ్యానుభూతికిలోనవుతాడు.  హంస సోహం/సోహమ్హంసను గుర్తించి,  దేవిఖద్గమాల స్తోత్రమును పారాయణము చేయునపుడు,  మమఖడ్గ సిద్ధ్యర్థం మూలమంత్రేణ షడగన్యాసంకుర్యాత్" అంటూ, "ఐం-క్లీం_సౌ" అను మంత్రమును మూడుసార్లుకాన...

NITYA DEVIS-PARICHAYAMU

Image
    " ఆద్యాయాం లలితాదేవీ-అన్యాత్ పంచదశాంగనా"    లలితా నిత్యరూపేణా అన్నది ఆర్యోక్తి.     పరదేవతా ప్రకాసమే ప్రతిబింబములుగా "బిందు సమన్విట"త్రికోణము చుట్టు ఎనిమిదవ ఆవరణముగా శ్రీచక్రములో అలరారుచున్నది నిత్యామండల సంకేత నామముతో.  ఉత్పత్తి నాశనము లేనిదినిత్యామండలము.  ఆత్మచైతన్యము వైపు సాధకుని దృష్టిని శాశ్వతముగానిలుపునదినిత్య మండలము.  15 మంది నిత్యాశక్తులు అమ్మవారి రూపలావణ్యములతో నున్నప్పటికినివృద్ధి-క్షయ విషయములో వ్యత్యాసము కలదు.  అమ్మవారు షోడశి నిత్యకళ.  ఏకం-అనేకం,అనేకం-ఏకము నకు ఉదాహఋఅనముగా ఈపదిహేను శక్తులు శూన్యము నుండి-సంపూర్ణం వరకు,సంపూర్నమ్నుండి శూన్య వరకు పున్నమి-అమావాస్య నామములో కాలశక్తులుగా/జ్ఞానశక్తులుగా ,  కుండలినీ శక్తిని,నిద్రాణమైనకుండలినీ శక్తిని జాగృతపరచి,సాధకుడు తనౌనికిని కనుగొనుటకు సహాయపడుతుంటాయి.  ఆదిశంకరవిరచితసౌందర్యలహరిస్తోత్రము ఈపదహారు కళలను "షోడశాక్షరీ" మంత్రముగా భావించి కీర్తిస్తుంది.  నిత్యాశక్తులు తమకళలను సూర్యునినుండి చంద్రుని వద్దకు చేరుస్తూ ప్రకాశిస్తుంటాయి.   వైదికులు సూర్యుని ఆత్మస్వరూ...

SREERAMANAVAMI-2024

Image
  " జానక్యా: కమలా మలాంజలి పుటే  యా: పద్మరాగయితా:    న్యస్తా రాఘవ మస్తకేచ  విలసత్ కుంద  ప్రసునాయితా:    స్రస్తా: శ్యామల కాయకాంతి  కలితా: యాఇంద్ర నీలాయితా:    ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"   రారా మాఇంటి దాక ! సీతారామా ********************************** స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి   నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి, బుధ  వారము 177_04-2024,  ఉదయము గంటలు 11-30 నిమిషాలకు,  ఆశ్లేష  నక్షత్ర యుక్త   మిథున లగ్న పుష్కరాంశ  సుముహూర్తమున   యస్.బి.ఐ కాలనీ - కొత్తపేట్ లో  భక్తాగ్రేసరులచే   లోక కళ్యాణా రార్థము దిగ్విజయముగా /కన్నులపందుగగా జరుగుచున్న,      శ్రీ సీతారామ కళ్యాణములో **************************   తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా   జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత   వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి   అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు   కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు  ...

SVAMINI-YOGINI PARICHAYAMU

Image
     చేతనులు ప్రపంచముతో అనుబంధమునేర్పరచుకుంటే మోహము.పరమేశ్వరితో అనుబంధమేర్పరచుకుంటే మోక్షము.కనుకనే,  "మనసేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షకం" అన్నారు పెద్దలు.  శ్రీదేవి ఖడ్గమాలలో తొమ్మిది ఆవరనలు ఉన్నాయి.  అంచలంచలు లేనిమోక్షము చాలా కష్టము కనుక సాధకుడు అణిమ శక్తితో తన పయనమును ప్రారంభించి బిందువునకు చేరవలసి ఉంటుంది.  ఇది స్థూలము నుండి సూక్ష్మ దిశగా పయనము.  కారణము,  బిందువు త్రికోణముగా తన విస్తరణను ప్రారంభించి త్రైలోక్య మోహన చక్రము వరకు విస్తరించి హద్దులను ఏఋపరచినది.   తొమ్మిది విభాగములు ఒక్కొక్కచక్రేశ్వరి కొంతమంది యోగినులతో/సహాయక శక్తులతో నిండియుంటుంది.  ఆనిర్ణీత చక్ర ప్రాంతమునకు అధికారిణి పరిపాలిని చక్రేశ్వరి.ఆమెను స్వామిని అనికూడా అంటారు.పరమేశ్వరి అంశయే స్వామిని.భగవతి.  భగవతి/స్వామిని అధీనములో మరికొన్ని శక్తులు సాధకుని స్వామిని దగ్గరకు చేర్చుటకు సిద్ధముచేసి సహాయపడుతుంటాయి.   మనకు అర్థమయ్యే విధముగా చెప్పుకోవాలంటే స్వామిని దగ్గరకు /భగవంతుని దగ్గరకు చేర్చగల "గురువులు" ఈ యోగినులు.  అహం బ్రహ్మాస్మి అన్న విషయము అర్థముకావాలంటే జగ...

KHADGAMALA-PARICHAYAMU

Image
   " తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై    అష్టాదశ మహాద్వీపం సమ్రాడ్భోక్తా భవిష్యతి"    పరమేశ్వరుడు-పరమేశ్వరికి వివరించినది ఈ "ఖడ్గమాలా స్తోత్రము"  ఖడ్గము అంటేస్తుతివచనములు.ఖడ్గమాల అంటే బిందు-తికోణములుగా ప్రకటింపబడిన పరమేశ్వ-పరమేశ్వరి ప్రస్తుత వచనముల హారము.  మరొక అన్వయము ప్రకారము చేతనుని ఆవరించియున్న అమంగళములను/అజ్ఞానమును తొలగించి,స్వస్వరూపమును తెలియచేయు సాధనము.  ఒకే తత్త్వమును వివరించు రెండు విధములైన అనుగ్రహములు  1.శ్రీ చక్రము 2.దేవీ ఖడ్గమాల  ఒకటి రేఖా యంత్రము.రెండవది మాలా మంత్రము.మహా మాలా మంత్రము.  స్థూలముగామనచుట్తు-సూక్ష్మముగా లోగుట్టు తానే నిండిన చైతన్యమే ఆ దేవీ.  స్తోత్ర సంకల్పములో "మమఖడ్గ సిద్ధ్యర్థే"అని సాధకుడు తల్లి అనుగ్రహమనే ఆయుధమును సాధనముగా అభ్యర్థిస్తూ,మూలాధారము నుండి బిందువు వరకు ఒక్కొక్క మాయ అనే మూటను విడిచిపెడుతూ తల్లి ఒడిని చేరగలుగుతాడు.  ఈ పయనములో తొమ్మిది ఆవరణములను దాటవలసి వస్తుంది.  ప్రతి ఆవరణములోను చక్రేశ్వరి ఇతర సహాయక శక్తులతో సాధకునికి సహాయపడుతుంటుంది.  మొదటి మూడు చక్రములపయనమునందు స...

SREE CHAKRAPARICHAYAMU

Image
   "శ్రీ యన గౌరి నా బరగు" అన్న సూక్తి ప్రకారము మహాభట్టారికయైన యైన పరమేశ్వరి శ్రీ శబ్దముతో బహువిధములుగాప్రస్తుతింపబడుతున్నది. 1శ్రీయతే ఇతి " శ్రీః"  చేతనులు ఆశ్రయించే పరాత్పరి "శ్రీ." 2.శ్రేయతే ఇతి "శ్రీః"   ఆశ్రయించబడిన చేతనులకు పురుషకారత్వము/సహాయరూపముగా మారునది "శ్రీ" 3.శ్రుణోతి ఇతి "శ్రీః"   శరణార్తుల మొరలను ఆలకించునది "శ్రీ" 4.శ్రావయతి ఇతి "శ్రీః"   శరణార్తులమొరలను స్వామికి హృద్యముగా విన్నవించేది "శ్రీ". 5.శృణాతి ఇతి "శ్రీః"   పాపాలను నశింపచేయగల శక్తిస్వరూపిణి "శ్రీ" 6.శ్రీణాతితి ఇతి "శ్రీః"   కారుణ్యాది గుణములచే జగమంతా వ్యాపించి యుండి భక్తులకు కైంకర్యభాగ్యమును అనుగ్రహించే తల్లి "శ్రీ"   ఆ మహాకామేశ్వర కామేశ్వరి "యంత్ర " రూపముగా సాధకుని అనుగ్రహించు విధానమే చక్రము.  శ్రీచక్రము అంటే సులభతరముగాసాధకుడు తనమనోఫలకమున  అమ్మ తత్తమును ఆకారములుగా ఊహిస్తూ అర్చించే విధానము.  శ్రీచక్రము లోని వివిధ ఆకారములలో దాగిన స్వరూప-స్వభావములను సంకేతించిన , ప్రమాణములను-పరి...

UGADI GREETINGS-KRODHI

Image
 ఉగాది శుభాకాంక్షలు.  *****************  కామ-క్రోధ-లోభ-మోహ-మదమాత్సర్యాలలో   క్రోధిని నేనేనంటూ,అరవై వత్సరముల తరువాత,  అరుదెంచుచున్నావా   "ఆత్మీయ స్వాగతము."  ప్రకట క్రోధమెప్పుడును పరమాత్మ అనుగ్రహమే  స్థితప్రజ్ఞతనందించే పరిణామపు అనుభవమే   అసలు, అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని. మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60 అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.   ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,  , అరవై సంవత్సరములు,   జాబిలి కూతురులో లేదా నారద కుమారులో   వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని   వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో   వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో   గురువు-శని తమ  గమనములో ప్రతికూలమో/అనుకూలమో  కదులుతూనే ఉన్నారుగా.   గుణ-దోష భూఇష్ఠముల వాటిగమన  పరిణామములే   ప్రతి ఒక్కరి ముందునున్న పంచాంగ ప్రమాణాలు.   ఏది ఆదాయమో/ ...

DEVIKHADGAMALA-YOGINULU

Image
    దేవిఖడ్గమాల-యోగినులు    ****************  "అణిమాదిభిరావృతామ్మయూఖైః అహమిత్యేవ విభావయేత్ భవాని"  "యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా' అనికీర్త్స్తున్నది లలితా రహస్య సహస్ర నామ స్తోత్రము ఆ జగజ్జననిని.   హ్రీంకారాసనల గర్భితానల శిఖ నుండి అనేకానేకములుగా ప్రకాశవంతముగా ప్రసరింపబడే కిరణములే యోగినులు.వీరిని "పరివార దేవతలు/శక్తులు"అనికూడా అంటారు.   నిరాకార-నిరంజన-నిర్గుణ మూలశక్తిని అర్థము చేసికొనుటకు సహాయపడు శక్తులు ఇవి.  ఒక విధముగా చేతనులకు యోగమునుకలిగించు శక్తులు.సాధకుడు ద్వంద్వమును వీడి తనలోని చైతన్యమునుగుర్తించుటకు ఆలంబనముగా ఈ సక్తుల సహాయమును తీసుకుంటాడు.  "దేహములో?ఉపాధిలో సూక్ష్మముగా దాగి దానినిచైతన్యవంతము చేయుచున్న మహాద్భుత శక్తిని తెలిసికొనుటయే "యోగము"   శ్రీదేవి ఖడ్గమాల అమ్మవారి యంత్ర స్వరూపమునకు సాకారమును దర్శింపచేయు స్తోత్రము.  ఈ యోగినులు ఒక్కొక్క ఆవరనములో నిర్దేశింపబడిన విధులను నిర్వర్తిస్తూ సాధకుని తరువాతి చక్రమును చేరుటకు సహాయపడుతుంటాయి.  నిర్దిష్ట పద్ధతిలో విస్తరించిన పరివార దేవతలు కొన్ని గుప్తముగాను,ఇంకొన్ని బాహాట...

DEVIKHADGAMALA INTRODUCTION-03

Image
   దేవిఖడ్గమాల-ఉపోద్ఘాతము-03  *********************  మహా మహిమాన్వితమైన దేవిఖడ్గమాలస్తోత్రము/శుద్ధసక్తి మాలా మహామంత్రముసనాతన సంప్రదాయమునూనుసరిస్తూ, 1.స్తోత్ర నామము 2.స్తోత్రమునూ అనుగ్రహించినఋషి 3.స్తోత్రములో నిక్షిప్తమైన దేవత/స్వభావము 4.స్తోత్రములో ప్రయోగించబడిన ఛందస్సు 5.స్తోత్ర సూక్ష్మరూపమైనబీజము 6.స్తోత్ర  బీజములో దాగిన శక్తి 7.స్తోత్ర మహాత్మ్యమును తెలియచేయు కీలకము/ఉపాయము 8.స్తోత్ర పారాయనమునుచేయూఅవశ్యకత/లక్ష్యము 9.మూలశక్తీనుగ్రహము అను తొమ్మిదీంసములతోనవనవ లావణ్య నిధి నవనవోన్మేషముగా విరాజిల్లుచున్నది అన్నమాట నిర్వివాదము.  కొంచము విశదముగా తెలుసుకునే ప్రయత్నముచేద్దాము.  శ్తోత్రము పేరు/స్తోత్రములో దాగిన మంత్రము పేరు,  "అస్య-శ్రీ-శుద్ధ-శక్తి-మాలా-మహామంత్రస్యా అని చెప్పబడినది.   స్తోత్రమునకు-పరమాత్మకు భేదములేదు. అస్య-ఈ పరమాద్భుత స్తోత్రము మూడు శుభలక్షనములను కలిగియున్నది.అవి, శ్రీ-శుభప్రదమైనది శుద్ధ-అతిపవిత్రమైనది. శక్తి-శక్తివంతమైనది. అమ్మతో పాటుగా తొమ్మిది  ఆవరనములలోనున్న పరివారదేవతా శక్తులను సైతము గుర్తించి,అర్చి,ంచే మంత్రముల సమూహముకనుక ఇది...

DEVIKHADGAMALA-INTRODUCTION-02

Image
   దేవిఖద్గమాల-02  ****************** దేవిఖడ్గమాలా స్తోత్రమునే "శ్రీ శుద్ధశక్తి మహా మాలా మంత్రము"అనికూడా కీర్తిస్తారు.  మహిమాన్విత నాదమే మంత్రము.అంతే కాదు, "మననాత్ త్రాయతే మంత్రః" ఎవరు మననము చేస్తారో/మనసులోనిధిధ్యాసము చేసుకుంటారో వారిని రక్షించేది "మంత్రము"   మనము ఏ దేవతను/మూలశక్తిని సాకారముగాభావించి ఆ శక్తికిసంబంధించిన మంత్రమును మననము చేస్తామో అదిమహామంత్రము.   ఆ మూలశక్తి తో పాటుగా అనేక పరివార శక్తులను సైతము ఆరాధించగలిగితే అది"మాలా మహా మంత్రము."   దేవి ఖడ్గమాలా/శుద్ధశక్తి మాలా మహా మంత్రము, ప్రతి స్తోత్రము , 1 దేవత 2.ఋషి 3.ఛందస్సు 4.బీజము 5.శక్తి 6,కీలకమును  కలిగియుంటాయి.   దేవిఖడ్గమాలా మహా మత్రము, 1 మహా త్రిపుర సుందరి దేవతగా 2.వరుణ్-ఆదిత్యులను ఋషులుగా 3.దేవీ గాయత్రీ ఛందముగా 4,ఐం-బీజముగా 5.క్లీం-శక్తిగా 6.సౌః-కీలకముగా,   సర్వాభీష్ట సిద్ధిప్రదముగావిరాజిల్లుతున్నవి.  వీటి గురించి తదుపరి భాగములో వివరముగా తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.   శ్రీ మాత్రే నమః.

DEVIKHADGAMAALA-INTRODUCTION

Image
     శ్రీ మాత్రే నమః      గం గణపతియే నమః     ****************  అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ దయతో,  'దేవు ఖడ్గమాల స్తోత్రము" శుద్ధసక్తి మహామాల" అంటే ఏమిటి?తెలుసుకోవాలనే జిజ్ఞాసను నాలో అంకురింపచేసిన ఆ అమ్మయే"అమ్మ దయ ఉంటేఅన్నె ఉన్నట్లే" అన్న నానుడిని మరొకసారినిరూపిస్తూ,నాచేతిని పట్టుకుని,నన్నొకకలముగా మలచుకొని తన దివ్యమహిమానుభవములను తానే తెలియచేస్తుందన్న ప్రగాఢ విశ్వాసముతో అమ్మను ప్రార్థిస్తూ,అడుగులను కదుపుదాము. "Yఆదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః"   ఖడ్గమాల అంటే ఏమిటి?  ఖండించగలిగే శక్తికల ఆయుధము ఖడ్గము.అజ్ఞానమును-అధర్మమును-అయోమయమును ఖండించకలిగేది.అదే అమ్మానుగ్రహము.అమ్మ అనుగ్రహమును వివరముగా తెలియచేయు స్తోత్రము " దేవిఖడ్గమాలస్తోత్రము.  మూలశక్తితో పాటుగా నున్న పరివారశక్తులను తెలిసికుని,వారిప్రాముఖ్యమును సైతము గుర్తించి,ఆరాధించు అర్చనావిధానమును తెలియచేయు స్తోత్రము"దేవిఖడ్గమాల స్తోత్రము."   మనము చర్మచక్షువులతో నేరుగా చూసి తెలిసికోలేని అపరిమిత అనుగ్రహ శక్తులను తెలిసికొను...
Image
    జై శ్రీరాం  **********  ఎంతటి చమత్కారి అగస్త్యభగవానుడు.రామచంద్రునకు 'తతో యుధ్ధమునా చింతా శోకములను తొలగించుటకై రాముని సమీపించి,స్తోత్రమును ఉపదేశించి నిజస్థానమునకు తరలినాడట.ఇంకాచమత్కారము రామచంద్రుడు భక్తి-శ్రధ్ధలతో ప్రార్థించగానే సూర్యనారయణుడు సంతుష్టుడై రామునిసమీపించి,రావణునికి మరనము ఆసన్నమైనదని కాల స్వరూపునిగా/యమునిగానిర్దేశించి,రాముని దీవించి,సంతసముతోనిజస్థానమునకు చేరినాడట.  అంటే అతి పవిత్రమైన ఆదిత్యహృదయస్తోత్రము కేవలము రామునికిసంబంధించినదా/లేక సకల చేతనులనూద్దేశించి,వెలుగు మార్గమును చూపించుటకు పరోక్షముగా ప్రసాదించినదా అన్న ఒక్కఆలోచన    మనకు నామికి-నామమునకు భేదము లేదని,సకలములో అంతర్యామిగా దాగిన పరమాత్మ తానొక మానవ ధర్మమును అనుసరిస్తూ,ధర్మసంస్థాపనమును ఏ విధముగా నిలిపినాడో విశదపరుస్తుంది.   నారాయణుడే రామచంద్రుడు/సూర్యనారాయణుడు/అగస్త్యభవ్గవానుడు,ఆంజనేయుడు/విభీషణుడు/యుధ్ధభూమి,సీతమ్మ,సర్వము/సకలము పరమాత్మే.  అయినప్పటికిని, " గోచరంబగు జగములోపలగోప్యమైనది రామనామము."  తాను గోప్యముగా ఉండి మనందరిచే,రాముడు యుధ్ధభూమిలో ఉన్నాడు/రాముడు చింతా-శోక...