ASYA ASTI ITI KASI @KASIPAMCHAKAM TATVABODHA-03
"విశ్వేశేయం తురీయః
సకలజన మనస్సాక్షి భూతోంతరాత్మ"
భూతము అనగా ఉన్నది/కనులకు కనబడుతున్నది.నింగి-నేల-నీరు-నిప్పు-గాలి అనుపంచభూతములుగా విశ్వములో/జీవునిలో నిండియున్నవి.నిజమునకు అవిచేతములుగా అనిపించే అచేతనములు.వానిలో దాగిన చిత్శక్తి వాటిని చైతన్యవంతముచేస్తుంది.కాని కొంతకాలము మాత్రమే.ఆ కొంతకాలములో జీవిస్తున్న శరీరములు కోశములు అను నామముతో ఐదు విభాగములుగా /తొడుగులుగా ఉండి జీవులచే ఐదు తప్పులను/ఒప్పులుగా భావింపచేస్తుంటాయి.
కానివిచిత్రము వానిలో పరిమితముగా-పరిమిత కాలము సంచరిస్తున్నప్పటికిని వాని ప్రభావమునకు లోనుగాక సత్+చిత్ శక్తివాటిచర్యలను గమనిస్తున్నప్పటికిని వాటి కర్మలను-కర్మఫలితములను పట్టించుకోదు.కనుకనే సాక్షీభూతము అని కీర్తింపబడుచున్నది.
" ఆట కదద్వైతంబు-ఆట అద్వైతంబు
ఒకటి-రెండు ఒకటే-ఆటనీకు.(తనికెళ్ళ భరణిగారు)
పంచకోశములుగా నిర్మితమైన ఐదు తొడుగులు చీకటిలో నుండి తమను చేతనులుగా భావింపచేస్తున్న చిత్ప్రకాశమును కాంచలేవు.
1.మొదటిదైన అన్నమయకోశము,
"దేహమే నేను" అన్న సిద్ధాంతముతో దాని తెరుతెన్నులను,
పొడుగు-పొట్టి,నలుపు-తెలుపు,లావు-సన్నము,అంటూఅనేకత్వములను ఆపాదించుకుంటూ,"నిత్య-సత్యప్రకాశ్వము(కాశి)యొక్క ఏకత్వమును గుర్తించలేదు.
2.రెండవదైన ప్రాణమయ కోశము
"శక్తియే నేను" అన్న సిద్ధాంతముతో శ్వాస ప్రక్రియ తన శక్తియే అనినమ్ముతూ,అదేకనుక నిజమయితే ఎందరో,
విడిచిన ఊపిరినితిరిగిపొందలేక,పీల్చిన ఊపిరిని తిరిగి విడువలేక "మరణమునకు" గురియగుచున్నారన్న (కాశిని) గుర్తించకుండా ఉంటుంది.
3.మూడవదైన మనోమయకోశము,
" ఆలోచనలే నేను" అన్నసిద్ధాంతముతో అవి నడిపించినట్లు నడుస్తూ కష్ట-సుఖములను అనుభవిస్తుంటుంది.మనసు ఇంద్రియాధీనమై వ్యవహరిస్తుంటుంది కనుక అది ఇంద్రియప్రభావములకు గురికాని(కాశిని/ప్రకాశమును) గుర్తించలేదు.
4.నాల్గవదైన విజ్ఞానకోశము
"బుద్ధియే నేను " అన్న సిద్ధాంతముతో సంసారబంధములలో చిక్కుకుని తనదేహమైన/గేహమైన శాశ్వతముకాదన్న సత్యమును (కాశిని) దర్శించలేదు.భ-పుట్టుక పుట్టుక కలిగియున్నది భవాని.ప్రకృతి.భవానిలో దాగియున్నదిభవుడు.జీవుడు ప్రకృతిని చూస్తూ అంతర్లీనముగా నున్న శక్తిని(పురుషుని)దర్శించలేడు.
గృహము అమ్మాయితే దానిలో నివసిస్తున్నది భవుడు.ఆ నివాసము పంచకృత్యములు ముగియువరకే .
5.ఆనందమయకోశము సర్వప్రకాశము.సర్వ ప్రజ్ఞామయము.
ఇక్కడ ఇంద్రియముల ప్రసక్తిలేదు.ద్వైతములేదు.కర్త-భోక వేరుగా ఉండరు.
జీవుడు ముముక్షువై పరమాత్మాత్లో ఏకమై అధిరాజమానమైన కాశిగా మారతాడు.భవామి-భవునిలో ఏకత్వమునుపొందుతుంది.అదియే ఆనందసిద్ధి.పరమావధి.
దేహములోబుద్ధితత్త్వముగానున్న భవానీ అధిరాజమానతత్త్వములోనికి జీవుని ప్రవేశింపచేస్తుంది.
"జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థా
"విజితేంద్రునిగా "
పరివర్తన చెందుటకు అంతర్యామి యైన కాశి కరుణయే కారణమవుతుంది.
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment