MARGALI MAALAI-05
మార్గళి మాలై-05
****************
ఐదవ పాశురం
***************
మాయనై మన్ను వడమదురై మైందనై
తుయపెరునీర్ యమునై యరైవరై
ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం
తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
************************
శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము
యమున దాటి వచ్చినాడు ఉత్తర మధురకు వాడు
యశోదా నందనుడు లీలా మానుష రూపుడు
పదునాలుగు భువనంబుల కట్లను విప్పువాడు
పసిబాలునిగ రోటికి కట్టుబడిపోయినాడు
దామోదరుడైనాడు తామర కన్నులవాడు
పాహి-పాహి అనగానే పాపాలు పారతోలేస్తాడు
మనసారా స్మరియిస్తూ పరిమళ పువ్వులు చల్లగ
తరలివచ్చినది తల్లి తానొక గోపికయై
పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో !గోపికలారా.!
గోదమ్మ ఈ పాశురమును "మాయనై"మన్ను వడమదురై-మైందనై" అని ప్రారంభించినది.మైందనై-రాజుగా-బాలునిగా-రక్షకుడిగా-బలవంతుడిగా -నాయకుడిగా-సౌదర్యభూషితుడిగా అనేక రూపములతో చేష్ఠలతో మాయావి ఉన్నాడు.ఎక్కడ?అని గోపికలు ప్రశ్నించగా మన్ను వడమదురై లో అంటే,స్వామితోశాశ్వతసంబంధముగల
ఉత్తర మధురలో,పవిత్ర జలపూరితమైన యమునకు రేవుగా ఉన్నాడట. .స్వామి అనుగ్రహ బధ్ధుడు అన్న విషయమును వివరించుతు దామోదరనామ వైభవమును కీర్తించినది గోదమ్మ.
"తూయోమాయ్ వందునాం" త్రికరణ శుధ్ధులై రండి.దేనికి అంటే తుమలర్ పరిశుధ్ధ పుష్పములను తీసుకొని,వాయినాల్ పాడి-నోరార కీర్తిస్తూ,మనత్తినాల్ శిందిక్క మనసారా స్మరిస్తూ,తుమలర్ తూవివళదు-స్వామిపై పూవులు చల్లుదాము అంటున్నది తల్లి.
ఈ పాశురములో తల్లి మధురను-యమునను-మాతృగర్భ ప్రకాశమును స్తుతించినది. .ఇది వాచ్యార్థము.
" మాయావై" అన్న పదము స్వామి మూలతత్త్వమును-దాని బహుముఖ ప్రజ్ఞను సంకేతిస్తుంది.తల్లిగర్భమును ప్రకాశింపచేశాడు కన్నడు.మంత్ర గర్భులైన ఆచార్యులు మంత్రమును ప్రకాశవంతముచేస్తారు.అందరికి దాని వైభవమును అందచేస్తారు.
.ఆచార్యులు మంత్రగర్భులై మంత్రమును ప్రకాశింపచేస్తారు.అంతే కాదు తమ అనుగ్రహమును ప్రసరించుటకు ఆగామి-సంచిత-ప్రారబ్దములనుండి మనలను సంస్కరించవలెనను బంధమునకు తమకు తాము కట్టబడి యుంటారట.వారు అనుగ్రహ బంధితులు.
వారిసేవనము మన పాపరాశులను మాయము చేస్తుంది అన్నది తల్లి.
ఇప్పుడు మనము రంగనాథ కరుణామృత సాగరములో గోదా అనుగ్రహమనే నావలో పర-వ్యూహ-విభవ-అంతర్యామి తత్త్వములను అధిగమించి,నారాయణనే నమక్కే అను అష్టాక్షరిని జపిస్తూ,హరి అను ద్వయ మంత్రమును మననము చేస్తూ,త్రిక్రమ వైభవమును చూస్తూ,మేఘములో దాగిన అంతర్యామి తత్త్వ దర్శనులమై,ఈ నాలుగు లక్షణములతో మధురలో నున చిన్ని కృష్ణుని మూల తత్త్వమును,దాని బహుముఖతవములను కొంచము కొంచముగా తెలుసుకుంటూ.శ్రీవ్రతాచరణమునకు అభిముఖులైనాము.ఇది మొదటి దశ.ఈ దశ నుండి రెండవ దశ యైన ఆశ్రయణత్వమును పూర్తిగా చేరుటకు మనలను దగ్గరుండి నడిపించగల వ్రతమును తమ అనుష్ఠాముతో-అనుగ్రహముతో చక్కగా నిర్వహించగల ఆళ్వారులు కావలెను.కాని వారు ఇప్పుడు గోపికా రూపధారులై భగవదనుభవమును వివిధరకములుగా అనుభవిస్తూ,ఆనందలోలులై ఉన్నారు.వారిని బహిర్ముఖులుగా మార్చి ఆధ్యాత్మికకు చేరువ కాగలుటయే ఈ పది గోపికల మేలుకొలుపుల ప్రహసనము.సంభాషణా మరంద పానీయము.భగవత్ తత్త్వమును పదివందికి పంచుటకు మనము రేపటి నుండి అత్యంత మనోహరమైన ఆ ఆళ్వారుల లీలా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
.
.
Comments
Post a Comment