MARGALI MALAI-03
MAARGALI MAALAI-03
మార్గళి మాలై-03
********************
మూడవ పాశురం
***************
ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మురి పెఉదు
ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్
పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్తమాలై పత్తి
వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
**************************
శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము
శ్రీగోదారంగనాథుల అనుగ్రహము అనవరతము.
పెరిగి లోకములను కొలిచిన పెరుమాళ్ సంకీర్తనలు
కురిపించును నెలకు మూడువానలను కరువుతీర్చు
పంటచేలు మింటితాకు పరమానందమును కూర్చు
పడిలేచే చేపలతో సెలయేళ్ళు పరవశించు
అందమైన పూలలో తుమ్మెదలు ఆదమరచి నిద్రించు
సురభుల శిరముల క్షీరము సుభిక్షరూపమును దాల్చు
శాశ్వతైశ్వర్యములు-శాంతిసౌభాగ్యముల నీయగ
తరలివచ్చినది తల్లి తాను ఒక గోపికగా
పాశురములు పాడుకొనుచు,పాశములన్నిటిని విడిచి
నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో? గోపికలారా!
" బ్రహ్మ కడిగిన పాదము-బ్రహ్మమురా నీ పాదము
చెలగి వసుధ కొలిచిన నీపాదము" అని కీర్తించాడు అన్నమయ్య.
స్వామి " ఓంగిఉలగలందన్ ఉత్తమన్" -పెరిగి తన పాదముతో భూమిని కొలిచిన స్వామి నీవుఉత్తముడవు అని కీర్తించినది.స్వామి ఎటువంటి దోషములు తాకలేనంత ఎత్తున ఉన్నాడన్నమాట.కనుకనే త్రివిక్రముడై తన పాదస్పర్శచే మూడులోకములను పవిత్రముచేయగలిగినాడు.పేర్పాడి -అటువంటి ఉత్తముని గుణగానము చేద్దామంటున్నది గోదమ్మ.
తల్లి మొదటి పాశురములో అష్టాక్షరిని నారాయణన్ నమక్కే అంటూ,రెండవ పాశురములో ద్వయమంత్రమును (పరమన్)స్మరించి,మూడవ పాశురములో గీతాచార్యము లోని మమేక శరణం వ్రజ తత్త్వమును ప్రస్తావించి,తారకము-భోగ్యము-పోషకము అను మూడు విషయములు వివరించునది.ఆచార్య కుల సంబంధమును (త్రివిక్రమ తత్త్వమును) గోపికలుగా భావింపబడు మనకు పరిచయము చేసినది.
స్వామి నీవుమాదగ్గర లేకున్నను నీ నామము ఎప్పుడు మాతోనే ఉంటుంది.స్వామి నీ గుణవైభవమును కీర్తించగల శక్తిలేని వారము.కాని నీ గుణవైభవములు మమ్ములను కీర్తించకుండ ఉండనీయవు.అంతటి గొప్పవి.కనుక చదువు లేని మేము అతిశయమైన భక్తితో ఆలపిస్తాము.
సిరి ఉరమున గల హరి సురులశ్రేయమును కోరి యాచకుడైనాడు.త్రివిక్రముడై బలి చక్రవర్తి అహమును పాతాళమునకు దించినాడు.అహంకారముతో కూడిన విహిత కర్మకు కూడ స్వామి పాదస్పర్శ అనుగ్రహించుట స్వామి స్వభావము.
మంచి-చెడు,చిన్న-పెద్ద,పాప-పుణ్య అను భేదములు అధిగమించి,స్వామి పాదస్పర్శ చే సకలము పునీతమైనది.
"తింగళ్ ముమ్మురి పెయిదు" అన్నది అమ్మ.నెలకు మూడువానలను పిలిచినది.ఏమిటా మూడు వానలు .బాహ్యమునకు జలసమృధ్ధి కరములైనప్పటికిని,వానిలో దాగిన విషయమేమిటి?
1.అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షకత్వము అను మూడు వానలు మనలను సత్వగుణ సంపన్నులను చేస్తుంది.
2.అకర ఉకార మకార మిళితమైన ప్రణవమును "ఓం" ను అమ్మ మూడు వానలుగా కీర్తిస్తున్నది.సస్వరూపమును దర్శింప చేస్తు,నిశ్చలభక్తి అనె ఏపుగా పండే పంటలకు ఎదురయే ఆటంకములను అధిగమింపచేసేవి ఆ వానలు.
3.పాలకులు-స్త్రీలు-బ్రహ్మజ్ఞానుల సత్ప్రవర్తనానుభవమును అమ్మ మూడు వానలుగా కీర్తించినది.
స్వామి నీవు నడిచిన నేలను నెలకు మూడు వర్షములు కురియాలి నెలకు మూడు వానలు అను విషయము అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షణత్వము అను మూడు విషయములను గుర్తుచేస్తున్నది.బీడులు పడిన మన మనసు ఈ మూడు వానలతో తడిసి తాపమును తగ్గిస్తుంది..మేము మార్గళి స్నానమును చేయాలి.పంటచేలు మింటిని తాకాలి.వాటి మధ్యనున్న సెలయేళ్ళలో చేపలు సంతోషముతో గంతులేయాలి.కోనేటిలో పద్మములు విరగబూయాలి.వాటి మకరందమును ఆస్వాదిస్తూ తుమ్మెదలు మత్తుగా నిద్రించాలి.
స్వామి గుణమనే తామరపువ్వులలోని అనుగ్రహమను మకరందము త్రాగి భక్తులను తుమ్మెదలు వీడి రాలేక యున్నవి.
గోపాలా ! నీ విభవమనే సెలయేటిలో సామీప్య సంతోషమునందుచున్న చేపలవలె నిన్ను చూస్తు మమ్ము తుళ్ళనీ.
అని ఆండాళ్ తల్లితో కూడిన గోపికలు స్వామిని కీర్తిస్తున్నారు.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
మార్గళి మాలై-03
********************
మూడవ పాశురం
***************
ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మురి పెఉదు
ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్
పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్తమాలై పత్తి
వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.
తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
**************************
శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము
శ్రీగోదారంగనాథుల అనుగ్రహము అనవరతము.
పెరిగి లోకములను కొలిచిన పెరుమాళ్ సంకీర్తనలు
కురిపించును నెలకు మూడువానలను కరువుతీర్చు
పంటచేలు మింటితాకు పరమానందమును కూర్చు
పడిలేచే చేపలతో సెలయేళ్ళు పరవశించు
అందమైన పూలలో తుమ్మెదలు ఆదమరచి నిద్రించు
సురభుల శిరముల క్షీరము సుభిక్షరూపమును దాల్చు
శాశ్వతైశ్వర్యములు-శాంతిసౌభాగ్యముల నీయగ
తరలివచ్చినది తల్లి తాను ఒక గోపికగా
పాశురములు పాడుకొనుచు,పాశములన్నిటిని విడిచి
నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో? గోపికలారా!
" బ్రహ్మ కడిగిన పాదము-బ్రహ్మమురా నీ పాదము
చెలగి వసుధ కొలిచిన నీపాదము" అని కీర్తించాడు అన్నమయ్య.
స్వామి " ఓంగిఉలగలందన్ ఉత్తమన్" -పెరిగి తన పాదముతో భూమిని కొలిచిన స్వామి నీవుఉత్తముడవు అని కీర్తించినది.స్వామి ఎటువంటి దోషములు తాకలేనంత ఎత్తున ఉన్నాడన్నమాట.కనుకనే త్రివిక్రముడై తన పాదస్పర్శచే మూడులోకములను పవిత్రముచేయగలిగినాడు.పేర్పాడి -అటువంటి ఉత్తముని గుణగానము చేద్దామంటున్నది గోదమ్మ.
తల్లి మొదటి పాశురములో అష్టాక్షరిని నారాయణన్ నమక్కే అంటూ,రెండవ పాశురములో ద్వయమంత్రమును (పరమన్)స్మరించి,మూడవ పాశురములో గీతాచార్యము లోని మమేక శరణం వ్రజ తత్త్వమును ప్రస్తావించి,తారకము-భోగ్యము-పోషకము అను మూడు విషయములు వివరించునది.ఆచార్య కుల సంబంధమును (త్రివిక్రమ తత్త్వమును) గోపికలుగా భావింపబడు మనకు పరిచయము చేసినది.
స్వామి నీవుమాదగ్గర లేకున్నను నీ నామము ఎప్పుడు మాతోనే ఉంటుంది.స్వామి నీ గుణవైభవమును కీర్తించగల శక్తిలేని వారము.కాని నీ గుణవైభవములు మమ్ములను కీర్తించకుండ ఉండనీయవు.అంతటి గొప్పవి.కనుక చదువు లేని మేము అతిశయమైన భక్తితో ఆలపిస్తాము.
సిరి ఉరమున గల హరి సురులశ్రేయమును కోరి యాచకుడైనాడు.త్రివిక్రముడై బలి చక్రవర్తి అహమును పాతాళమునకు దించినాడు.అహంకారముతో కూడిన విహిత కర్మకు కూడ స్వామి పాదస్పర్శ అనుగ్రహించుట స్వామి స్వభావము.
మంచి-చెడు,చిన్న-పెద్ద,పాప-పుణ్య అను భేదములు అధిగమించి,స్వామి పాదస్పర్శ చే సకలము పునీతమైనది.
"తింగళ్ ముమ్మురి పెయిదు" అన్నది అమ్మ.నెలకు మూడువానలను పిలిచినది.ఏమిటా మూడు వానలు .బాహ్యమునకు జలసమృధ్ధి కరములైనప్పటికిని,వానిలో దాగిన విషయమేమిటి?
1.అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షకత్వము అను మూడు వానలు మనలను సత్వగుణ సంపన్నులను చేస్తుంది.
2.అకర ఉకార మకార మిళితమైన ప్రణవమును "ఓం" ను అమ్మ మూడు వానలుగా కీర్తిస్తున్నది.సస్వరూపమును దర్శింప చేస్తు,నిశ్చలభక్తి అనె ఏపుగా పండే పంటలకు ఎదురయే ఆటంకములను అధిగమింపచేసేవి ఆ వానలు.
3.పాలకులు-స్త్రీలు-బ్రహ్మజ్ఞానుల సత్ప్రవర్తనానుభవమును అమ్మ మూడు వానలుగా కీర్తించినది.
స్వామి నీవు నడిచిన నేలను నెలకు మూడు వర్షములు కురియాలి నెలకు మూడు వానలు అను విషయము అనన్య భోగత్వము-అనన్య శరణత్వము-అనన్య రక్షణత్వము అను మూడు విషయములను గుర్తుచేస్తున్నది.బీడులు పడిన మన మనసు ఈ మూడు వానలతో తడిసి తాపమును తగ్గిస్తుంది..మేము మార్గళి స్నానమును చేయాలి.పంటచేలు మింటిని తాకాలి.వాటి మధ్యనున్న సెలయేళ్ళలో చేపలు సంతోషముతో గంతులేయాలి.కోనేటిలో పద్మములు విరగబూయాలి.వాటి మకరందమును ఆస్వాదిస్తూ తుమ్మెదలు మత్తుగా నిద్రించాలి.
స్వామి గుణమనే తామరపువ్వులలోని అనుగ్రహమను మకరందము త్రాగి భక్తులను తుమ్మెదలు వీడి రాలేక యున్నవి.
గోపాలా ! నీ విభవమనే సెలయేటిలో సామీప్య సంతోషమునందుచున్న చేపలవలె నిన్ను చూస్తు మమ్ము తుళ్ళనీ.
అని ఆండాళ్ తల్లితో కూడిన గోపికలు స్వామిని కీర్తిస్తున్నారు.
( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)
Comments
Post a Comment