MARGALI MALAI-12

  మార్గళి మాలై-12
 *******************

  పన్నెండవ పాశురం
  ******************



 కనైత్తిళం గత్తెరుమై కన్రు క్కిరంగి
 నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర
 ననైత్తు ఇల్లం శేర్కాక్కుం నర్చెల్వన్ తంగాయ్
 పనిత్తలై వీళనిన్ వాశల్ కడైపత్తి
 శినత్తినాల్ తెన్నిలంగై క్కోమునై చ్చెత్త
 మనత్తుక్కు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్
 ఇనిత్తాన్ ఎళుందిరాయ్ ఈ తెన్న పేరు రక్కం
 అనైత్తు ఇల్లత్తారుం అరిందు ఏలోరెంబావాయ్.


   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
  ************************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదారంగనాధుల అనుగ్రహము అనవరతము

  పాడిగేదెలు పిలుచుచున్నవి పాలనీయగ దూడలకును
 పాడి కాదిది పనిని వదిలి కన్నడిని మీ అన్న కూడుట

 శిరముల వర్షించిన క్షీరము చిత్తడిని చేసినది నేలను
 గగనము వర్షించు హిమము తడుపుతున్నది గోపికలను

 రామబాణము తాకినంతనే రమ్యమైనది లంకద్వీపము
 రామ నామము సాగుచున్నది రక్షయైనది గోకులమును

 చూడవమ్మ మేము నీకై చూరు కిందనే ఉన్నాము
 తరలి వచ్చినది తల్లి మనకై,తానొక గోపికయై

 పాశురములను పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావాయ్ కు రారాదో ఓ సుధామసోదరి!

 మహాద్భుతమైన ఈ పాశురములో మహిషి నామమును స్వీకరించిన పట్తమహిషి, మనకు ఆజ్ఞ-అనుజ్ఞ స్వభావమును,నిత్యకైంకర్య-విశేష కైంకర్య స్థానములను, అవ్యాజకరుణతో నిండి యున్న గేదెల మాతృప్రేమను-తల్లిని దరిచేరలేక యున్న మూతికి చిక్కము కట్టి,తాళ్లతో బంధించియున్న దూడల పరిస్థితిని,వానిని తలచినంతనె చేపుకొనిన శిరముల క్షిప్ర ప్రసాదత్వమును,శిరముల విశ్లేషణ విశేషములను,పరీవాహములై ప్రవహించుచున్న పాలు,పాలతో తడిసిన చిత్తడి నేలను స్పర్శించిన గోపికలు ప్రకటించిన శ్రీరామావతార విశేషములు,లంకద్వీప మను మన దేహ విసేషములు ,వానిని సంస్కరించు మాధవుని సఖుడైన గోపిక అన్న గొప్పతనమును తెలియచేస్తు,గోపికను మేల్కొలిపినది


  భవంతునిచే నిర్దేశింపబడిన కైకంర్య విధానము ఆజ్ఞ.భక్తుడే మనఃపూర్వకముగా ఏ ఫలితమును ఆశించకుండా తనకు తాను తన్మయముతో చేయు కైంకర్యము అనుజ్ఞ. అనుజ్ఞ కైంకర్యము సమయ సందర్భములను పట్టి ఒక్కొక్కసారి నిత్య కైంకర్యముగాము-మరొక్కసారి విశేష కైంకర్యముగాను ప్రకటింపబడుతుంది. ఉదాహరణకు  రామాయణములోని లక్ష్మణుడు
అరణ్యవాస సమయమున తన నిత్య విధులకు బదులుగా (నిద్రాహారములను విడిచి)శ్రీరామ సంరక్షణనే తన కైంకర్యముగా మలచుకొనినాడు.అదే విధముగా (శ్రీమాన్ తిరుప్పణ్యాళ్వారులు గా భావించే) ఈ గోపిక అన్న కూడ తన నిత్య కైంకర్యమైన పాలుపితుకుట మాని,విశేష కైంకర్యమైన స్వామి ప్రభల సేవకు వెళ్లినాడు.ముగిసిన తరువాత యధావిధిగా నిత్యకైంకర్యములు చేస్తాడు.


 ఇప్పుడు గేదెల మాతృవాత్సల్యము-దూడల అసహాయత చెప్పబడినది.దూడలు తమ మూతులను చిక్కములతోను,తమను రాటకును బంధించబడియున్నవి.అవి కదలలేవు.క్షీరములను తాగలేవు.అదే విధముగా చేతనులు అని పిలువబడు మనము సంసార బంధములను చిక్కములో చిక్కుకొని,కదల లేని స్థితిలో నున్నవారము.తగిన ఉపాయమును గ్రహించలేక ఉన్న వారము.ఏ విధముగా గేదెలు తమ పిల్లకై శిరములను చేపి క్షీర ధారలను వర్షించుచున్నవో,అదేవిధముగా ఆచార్యులు తమ జ్ఞాన ధారలను వర్షించు చున్నారు. అదియే గోపికలై పడుతున్న హిమమను (మంచు) చల్లని ఆశీర్వచనామృతము.

 శిరములు కేవలము గేదెల శరీరావయమేనా? లేక నిక్షిప్త పరమార్థములా?

 నాలుగు వేదములు,శృతి-స్మృతి-పురాణ-ప్రబంధములు,ధర్మార్థకామమోక్షములు,
 శ్రీ భాష్యము-గీతా భాష్యము-భగవత్ విషయములు-రహస్యములుగా,మన పెద్దలు గుర్తించారు.



 వానిక్షీరముతో తడిసిన చిత్తడి నేలను తాకిన గోపికల భాగ్యమేమని వర్ణించగలను? కనుకనే వారు శ్రీరామ వైభవమును పొందిన లంకద్వీపమును,శ్రీరామ నామముతో కీర్తింపబడిన గోకులమును తత్త్వ దర్శినులై ప్రస్తుతించ గలిగినారు.లంకద్వీపము అంటే ఏమిటి?  శిరములు కేవలము గేదెల శరీరావయమేనా? లేక నిక్షిప్త పరమార్థములా?

 నాలుగు వేదములు,శృతి-స్మృతి-పురాణ-ప్రబంధములు,ధర్మార్థకామమోక్షములు,
 శ్రీ భాష్యము-గీతా భాష్యము-భగవత్ విషయములు-రహస్యములుగా,మన పెద్దలు గుర్తించారు.



 వానిక్షీరముతో తడిసిన చిత్తడి నేలను తాకిన గోపికల భాగ్యమేమని వర్ణించగలను? కనుకనే వారు శ్రీరామ వైభవమును పొందిన లంకద్వీపమును,శ్రీరామ నామముతో కీర్తింపబడిన గోకులమును తత్త్వ దర్శినులై ప్రస్తుతించ గలిగినారు.లంకద్వీపము అంటే ఏమిటి? మన శరీరమే? శిరములు కేవలము గేదెల శరీరావయమేనా? లేక నిక్షిప్త పరమార్థములా?

 నాలుగు వేదములు,శృతి-స్మృతి-పురాణ-ప్రబంధములు,ధర్మార్థకామమోక్షములు,
 శ్రీ భాష్యము-గీతా భాష్యము-భగవత్ విషయములు-రహస్యములుగా,మన పెద్దలు గుర్తించారు.



 వానిక్షీరముతో తడిసిన చిత్తడి నేలను తాకిన గోపికల భాగ్యమేమని వర్ణించగలను? కనుకనే వారు శ్రీరామ వైభవమును పొందిన లంకద్వీపమును,శ్రీరామ నామముతో కీర్తింపబడిన గోకులమును తత్త్వ దర్శినులై ప్రస్తుతించ గలిగినారు.లంకద్వీపము అంటే ఏమిటి?  మన శరీరమే? ఇంకేమిటి?

 అందుకనే గోపికలు నమమ నేను కాదు ఇవన్నీ నేను కాదు అని అనవరతము గుర్తుచేసుకొను ఆధ్యాత్మిక చూరు క్రింద నిలబడినారు.


వనదుర్గము-జల దుర్గము-గిరి దుర్గము అను మూడు దుర్గములతో సంసారసాగరమున మునిగియున్న ద్వీపము.బాహ్య శరీరము వనదుర్గము-లోపల జరుగు రక్తప్రసరణ విధానమే జలదుర్గము.కదిలే-కదలలేని-కదిలే కదలని ఎముకల సమాహారమే గిరిదుర్గము.దీనిని పది ఇంద్రియములను పదితలల మనసు అను అసురుడు బుధ్ధిని చేరనీయక
పాలించుచున్నాడు.వానిని కూలదోయకలవాడు రమ్యమైన రాముడు అని తెలిసియు ఉలక-పలుక తలుపు తీయకనున్నావు.సంకీర్తములతో స్వామిని అర్చించి పర ను పొందుద మని గోదమ్మను కూడి వచ్చిన గోపికల పిలుతో.జాగరూకయై,వేరొక గోపికను మేల్కొలుపుటకు తల్లిని అనుసరిస్తూ,బయలుదేరినది నత్త్చెల్వం తంగచ్చి.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



వనదుర్గము-జల దుర్గము-గిరి దుర్గము అను మూడు దుర్గములతో సంసారసాగరమున మునిగియున్న ద్వీపము.బాహ్య శరీరము వనదుర్గము-లోపల జరుగు రక్తప్రసరణ విధానమే జలదుర్గము.కదిలే-కదలలేని-కదిలే కదలని ఎముకల సమాహారమే గిరిదుర్గము.దీనిని పది ఇంద్రియములను పదితలల మనసు అను అసురుడు బుధ్ధిని చేరనీయక
పాలించుచున్నాడు.వానిని కూలదోయకలవాడు రమ్యమైన రాముడు అని తెలిసియు ఉలక-పలుక తలుపు తీయకనున్నావు.సంకీర్తములతో స్వామిని అర్చించి పర ను పొందుద మని గోదమ్మను కూడి వచ్చిన గోపికల పిలుతో.జాగరూకయై,వేరొక గోపికను మేల్కొలుపుటకు తల్లిని అనుసరిస్తూ,బయలుదేరినది నత్త్చెల్వం తంగచ్చి.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)








.






Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)