ALO REMBAVAY-18

పద్దెమినిదవ పాశురము ******************* ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్ కందం కమళుం కుళలీ కడై తిరవాయ్ వందు ఎంగుం కోళి అళైత్తనగాణ్; మాదవి పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవిణగాన్ పందార్ విరలి; ఉన్ మైత్తునన్ పేర్పాడ శెందామరైక్కైయ్యాల్ శీరార్ వళై యెళుప్ప వందు తిరవాయ్ మగిందేలో రెంబావాయ్. గోదమ్మ ఈ పాశురములో నీలాదేవిని,నందగోపాలుని మేనకోడల!అని నర్మగర్భముగా తాము కోరినది కాదనకుండా అనుగ్రహహించమని ప్రార్థిస్తూ మేలుకొలుపుతున్నది. నీ మేనమామ అయిన నందప్రభువు అర్థికి లేదనకుండా అనుగ్రహించు యశోభూషితుడు.అదే పరపరను నీవును పాటిస్తున్నావన్న నమ్మకముతో నిన్ను నోమునకు తీసుకుని వెళ్ళుటకు వచ్చాము తల్లి అని తెల్లవారినదని సూచించే కొన్ని సంకేతములను వివరిస్తూనీళాదేవిని మేల్కొలుపుతున్నారు.ఇక్కడ మేల్కొలుపబడేది తల్లికి వారిపై గల అనుగ్రహము. తల్లీ చూడు అంటున్నది. దేనిని? ఎంగుం-అన్నిచోట్ల, కోళి-కోళ...