ADITYAHRDAYAM-SLOKAM-20

ఆదిత్యహృదయము-శ్లోకము-20 *********************** ప్రార్థన ******* "జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్య మూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము *********** పూర్వ శ్లోకమును "తప్త-చామీకరాభాయ వహ్నియేవిశ్వకర్మిణే"అంటూ పరమాత్మను ప్రస్తుతిస్తుంది. చామీ కరము-బంగారు కిరణము.ఆ బంగారు కిరణము మేరుపర్వతమును పరమాత్మ స్పృశించుటచే ఏర్పడినది. .ఆ బం గారు కిరణము స్వామి అనుగ్రహమే. వేడిచే-వెలుగుచే తప్తమైనది/కాల్చబడినది.అంటే ఇతర లోహ ధాతువులను సైతము విడదీయలేంతగా తనలో కలుపుకొనిన బంగారపుకొండ స్వామి స్పర్శచే దోషములను ఆవిరిరూపములో/ద్రవరూపములో కరిగించుకుని/తొలగించుకుని,తప్తము చేసికొని,పుటమై,మేలిమిముద్దగా ప్రకాశిస్తున్నది.ఇది వాచకము. జీవుల ఉపాధి/దేహము మేరుపర్వతమే..అది మంచి-చెడులను విడదీయలేనంతగా తనలో కలుపుకుని సందిగ్ధములో ఉంది.స్వామి తన కరుణ అనే అగ్నితో దానికి పుటము వేసి శాశ్వతమైన-ఆత్మను-అశాశ్వతమైన ఉపాధిని వేరుచేసి ప్రకాశింపచే...