ADITYAHRDAYAM-SLOKAM-09

 


  ఆదిత్యహృదయం-శ్లోకము-09

   *********************

 ప్రార్థన

 ******

 ' జయతు  జయతు సూర్యం-సర్వ లోకైకదీపం

   హిరణ సమిత పాపద్వేష దుఃఖస్యనాశం

   అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం

   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."


  పూర్వ రంగము

  ***********

  రశ్మిమంతుడు లోకరక్షణావిధానమునకై కొన్ని శక్తులను-వాటికి సహాయకారులగు మరికొన్ని బృందశక్తులను తన కిరణముల ద్వారా ప్రసరనముచేస్తూ,వాయు-వహ్ని రూపములతో తాను ప్రాణశక్తిగా ప్రకాశించుచున్నాడు.

  ప్రస్తుత శ్లోకము 'మరీచిమాన్" అన్న ,

 మారయతి యత్ మరీచి అంటు,సంహారము చేసే శక్తి మరీచి అని,అందులో శ్రేష్ఠుడు కనుక మరీచిమాన్ అంటూ సంహారకుడు కూడా సూరెయశక్తియే అని స్తుతిస్తున్నది.

 శ్లోకము.

 ******

 " హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్

   త్మిరః ఉన్మథనః శంభుః త్వష్టా మార్తాండ-అంశుమాన్"


   


  పరమాత్మ మార్తాండుడు.ఈ శబ్దమును రెండు విధములుగా అలంకారికులు అన్వయిస్తారు.

అదితి తన గర్భములో పెరుగుతున్న పరమాత్మను స్తుతిస్తూ,ఉపవాసాది నియమనిష్ఠల వలన,నీరసమైన వేళ,కశ్యపుడు ఆమెను నీ ఉపవాసములతో పిండమును చంపేస్తావా అనగానే పిండము నేలజారినదని,(అచేతనమైనదని) దానికి సమాధానముగా అదితి తన శిశువు మృతమును అమృతముచేయువాడే కానే,మృటుడు కాదని సమాధానపరచినదని చెబుతారు.ఇది కథనము.

  సర్వము సమానమైనవేళ (మృతమైనవేళ) పరమాత్మ రశ్మి భావనతో మార్తాండమైన ,

 అంశువులతో కిరణములతో సజీవులను చేస్తున్నాడు కనుక మార్తాండాంశుమాన్-నమో నమః.

 హరిత-అశ్వః-హరిదశ్వః

 ***************

 హరిదాగినదే హరితము.

 1.హరించు శక్తియే-హరి.

  చీకట్లను హరించునది-పాపములను హరించునది-అజ్ఞానమును హరించునది-మాంద్యమును/జడత్వమును హరించునది -హరితము.

 2 సప్తసప్తి

   *******

  ఇది  స్వామి వాహనము/ సూర్యరథము.ఏకచక్రము.ఏక ఆశ్వము.ఒకే ఆశ్వము ఏదుగా భావింపచేయునది.ఇది సంకేతికపదము.

1.కాంతి పరముగా-ఒకే వర్ణము సప్తవర్ణములుగా ప్రకటింపబడుట.

2.కాల పరముగా-ఒకే కాలము ఏడు వారములుగా పరిగణింపబడుట

3.ఒకే ఉపాధిలో-ఏడు ధాతువులు కలిసియుండుట.

 స్వామి సప్తాశ్వరూఢుడై,

 ఉన్మథనః-తొలగించుచున్నాడు/పారద్రోలుచున్నాడు,


4త్వష్టా-తొలచువాడు-మలచువాడు,చీకటివెలుగుల మిశ్రమము నుండి చీకట్లనుతొలగించి,వెలుగును ప్రకాశింపచేయువాడు,

 తిమిర-ఉన్మథనః-చీకట్లను పారద్రోలి,కాంతులను వెదజల్లుచున్నాడు కనుకశుభములను కలిగించుచున్నాడు-శంభునిగా ప్రస్తుతింపబడుతున్నాడు.

  కనుకనే,

"దీపం జ్యోయి పరబ్రహ్మ"

  అంటూ,పరంజ్యోతికి ప్రతీకగా దీపప్రజ్వలనమును చేసుకుంటున్నాము అని అగస్త్యమహాముని-రామచంద్రుని ప్రత్యక్షముగాను,మనకు పరోక్షముగాను వివరించువేళ,

 "తం సూర్యం ప్రణమామ్యహం." 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)