ADITYAHRDAYAM-SLOKAM-14


 


 ఆదిత్యహృదయం-శ్లోకము-14

 *********************

 ప్రార్థన

 ********

"జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం

 హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం

 అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

 సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము

 ***********

 ఏదీ అంటని ఆత్మస్వరూపమైన పరమాత్మ ఆదిత్యునిగా ఆకాశ నివాసియై,మండలము నుండి తన రశ్ములను భూమందలముపై 

ప్రసరింపచేయుటకు నక్షత్రములను-తారలను-గ్రహములను కొన్ని పరికరములను ఏర్పరచి,తాను అంతర్యామియై వానిలో ప్రవేశించి,పన్నెందు విభాగములుగా కాలమును,పది ఇంద్రియములు బుద్ధి-మనసు అను విభాగములను చేతనులలో ఏర్పాటుచేసిన విధానమును 

వివరించిన,అగస్త్య భగవానుడు "కవి" గా          స్వామి ప్రపంచ కల్పనాచాతుర్యమును కన్నులముందుంచిన తరువాత,

 ప్రస్తుత శ్లోకములో స్వామి ఉదయాస్తమాన ప్రక్రియను ప్రశంసిస్తున్నారు.


  శ్లోకము.

  *****

 " నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః

   జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః."


  తూరుపు దిక్కును తన రశ్ములచే ప్రకటింపచేసినసూర్యునకు నమస్కారములు.

 ( పశ్చిన దిక్కును చేరి మరొక ప్రదేశములో తన రశ్ములచే ఉదయిస్తూ తూరుపుదిక్కుగా ప్రకాశిస్తున్న) పశ్చిమ అద్రిపై వాలుచున్న  సూర్యునకు నమస్కారములు.


" దర్శయేత్- న దర్శయేత్ అన్నది వాస్తవము.

 న ఉదయతి-నాస్తమితి అన్నది సత్యము."


 వస్తుప్రపంచము అనుభవించునది వాస్తవము కాని అది సత్యము కాదు.



 మార్పు కలది వాస్తవము-మార్పు లేనిది సత్యము.


   పరమాత్మ ప్రకాశము తనచుట్టు తాను తిరుగుచుండు భూమి గ్రహణమును బట్టి దివారాత్రములు అన్నది వైజ్ఞానికము

.

 "స్వామి పగటిపూట అగ్ని నుండి తన శక్తిని స్వీకరించి,అస్తమాన సమయము నుండి ఉదయించు సమయము వరకు తిరిగి అగ్నిలో తన తేజస్సును నిక్షిప్త పరుస్తాడనికూడా భావిస్తారు."


 దాని ఫలితమే సౌరశక్తి రాత్రివేళల యందు  చంద్రకళల ద్వారా ఔషధ శక్తిని ఉత్పత్తి చేసుకుంటుంది.



 పరమాత్మ తన రశ్ములను పగటి పూట ఆహార ఉత్పత్తికి-రాత్రివేళల యందు ఔషధ ఉత్పత్తికి అనుగుణముగా అనుగ్రహిస్తుంటాడు."నమోస్తుతే."

  సనాతనము "గిరులు" అన్న పదమునకు వాక్కులు/వేదములు అనికూడ అన్వయిస్తుంటుంది.

  పూర్వాయ గిరయే-ఎప్పుడు పుట్టిందో చెప్పలేని,అపౌరుషేయములైన వేదములు/దివ్యశబ్దములు గిరులు.(ఆకాసమునకు శబ్దము తన్మాత్ర కనుక సహజమే.)


 వాక్కుల ద్వారాచేతనమైన లోకములు,మద్యాహ్న సమయమునకు కార్యరూపమును దాల్చి /గమనము చేసి /అస్తమాన సమయమునకు అద్రి (గమ్యమును) చేరుతాయి/అంటే,

 ప్రయత్నములు ఫలితములను పొందుతాయి.అనిచెబుతారు.

  అద్రి అగ్రస్థానము అన్న అర్థమును స్వీకరిస్తే ,

 ముముక్షువులు ముక్తపురుషులవుతారు.వారే 

 "జ్యోతిర్గణములు"వారికి ఆ స్థానమును/స్థితిని అందించు పరమాత్మ

 "జ్యోతిర్గణానాంపతి"

 ఇది ఒకభావనయైతే ఆకాశములోని ఉల్కలు-తోకచుక్కలు,పాలపుంతలు తదితర ఖగోళ ప్రకాసములు కూడ జ్యోతిర్గణములే.

  వేదములనే తూరుపు దిక్కున ఉదయొస్తున్న రశ్మిమంతుడు లోకానుగ్రహమునకై ఉపనిషత్తులనే (సులభగ్రాహ్యమనే ) బ్రహ్మజ్ఞానమును అందించుచున్నాడు.

 అలసతకు-విశ్రాంతి

 వేడిమికి-చల్లదనము

 ఆహారమునకు-ఆరోగ్యము

 అజ్ఞానమునకు-జ్ఞానము

   కలిగించుటయే దినాధిపతి అనుగ్రహము.

 దినము అంటే,

 

 అసతోమ- సత్ గమయ

 తమసోమ-జ్యోతిః గమయ

 మృత్యోర్మ-అమృతం గమయ

 పరమాత్మ నన్ను,

 

 అసత్యము నుండి(వాస్తవము) సత్యము వైపునకు

 తమసోమ-చీకటి నుండి(అజ్ఞానము)-జ్యోతివైపునకు (జ్ఞానము)

 మృత్యోర్మ-ఉపాధి నైజమునుండి-అమృతం గమయ

   అమృతత్త్వము వైపునకు,

 దినాధిపతివై నీ రశ్ముల అనుగ్రహముతో నడిపించుము,అని మనకు తెలియచేయుచున్నవేళ,

 "తం  సూర్యం ప్రణమామ్యహం."





 



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)