ADITYAHRDAYAM-SLOKAM-12


  




   ఆదిత్యహృదయము-శ్లోకము-12


   **********************




   ప్రార్థన


   ******


 "జయతు జయతు సూర్యం- సప్తలోకైకదీపం


  హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం


  అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యవర్ణం


  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."


 పూర్వరంగము


 **********


 ఆకాశాధిపతి ప్లవంగము( దక్షిణదిశ వైపునకు)వలెదుముకుతూ,వేదవేద్యుడై,వేదపూజ్యుడై,కరుణ నిండిన కరిమబ్బులతో వర్షములను గురిపిస్తూ,జలములను సమృద్ధి పరచుచున్నాడన్న,అగస్త్యుడు,


 ప్రస్తుత శ్లోకములో సూర్యమండలమును సంకీర్తిస్తూ,పరమాత్మ పింగళ వర్ణుడై ఉత్తరాభిముఖుడై,ఉత్తర దిశగా తన గమనమును సాగిస్తూ,అనురక్తితో విశ్వ నిర్మాణమును స్థితి సంహారములను గావిస్తున్నాడో వివరిస్తున్నారు. అదియే మండల విన్యాసము.సామూహిక శక్తుల సమన్వయము.


 శ్లోకము


 ******


 " ఆతపీ మండలీ మృత్యుః పింగళః  సర్వ తాపనః


   కవిః విశ్వో మహాతేజః రక్త సర్వ భవోద్భవః."


  భవిష్యోత్తర పురాణము శ్రీకృష్ణార్జున సంవాదముగా,


 " యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం


   ఉత్పత్తి రక్ష ప్రళయ ప్రగల్భం


   యస్మిన్ జగత్ సంహర లేఖనంచ


   'పునాతుమాం తత్ సత్ వరేణ్యం"


 అంటూ ప్రస్తుతించింది.


   పరమాత్మను మాతృమూర్తిగా అన్వయించుకుంటే,


 'భాను మండల మధ్యస్థా భైరవి భగమాలిని ' అని ప్రస్తుతిస్తున్నది.


  


  మండలం  అంటే ఏమిటి?


 1."ఋగ్వేదము" పునారావృత్త పనివిభాగ నిర్మాణమును మండలం అని నిర్వచిస్తోంది.


 2. భౌగోళిక శాస్త్రము,


   దక్షిణ కక్ష్యనుండి  ఉత్తర కక్ష్యవైపునకు-ఉత్తర కక్ష్యనుండి దక్షిణకక్ష్య వైపునకు ఆవృత్తమగు 12 సూర్యశక్తుల సమన్వయము(ద్వాదశాదిత్యులు) మండలము అనిచెబుతుంది.


 3.రేఖాశాస్త్రము,


 దేవతాశక్తి నివాసమును కేంద్రీకరించు వృత్తాకార బింబమును మండలము అంటుంది.


 4.ఉపాసన పరముగా 40 రోజుల ఆధ్యాత్మిక పయనము మండలమని పరిగణించబడుతున్నది.


 5.స్థూలగా విశ్వము-సూక్ష్మముగా జ్ఞానము పొందిన మనసు "మండలములే."


 ప్రస్తుత శ్లోకము,


 "ఆతపీ మండల" అన్న శబ్దముతో ప్రారంభమగుతున్నది.


 ఆ-సమస్తాత్ అన్న అని అర్థముచేసుకుంటే,


 సర్వమును తపించచేసే ,ఘర్మ (స్వేదము) సర్జన కిరణ ప్రసరణ

 ప్రభావమే "ఆతపీ మందలం"


 ఉపాసన పరముగా అన్వయించుకుంటే,


 సకల తాపసుల తపశ్శక్తి కేంద్రమే "ఆతపీమండలము"


  వేద పరముగా అన్వయించుకుంటే ఛందోశాస్త్ర

 సమ్మేళనమే "ఆతపీ మందలము"




 " కవయః క్రాంతదర్శనః "అన్నది నానుడి..


 క్రాంతము అంటే మార్గమును.మార్గమునువేయువాడు/మార్గమును చూపువాడు కవి.


 పరమాత్మ సూర్యునిగా విశ్వమునకు సృష్టి -స్థితి-సంహారము అను పనులకు ఖగోళమునుండు-భూగోళము వరకు తనకిరణములను వ్యాపింపచేస్తూ,మార్గములను వేస్తున్నాడు.


 విశ్వం-విష్ణుం అంటూ తానే విశ్వమై తన రశ్ములను మార్గములద్వారా పరిపాలిస్తున్నాడు.


 కవులు అనగా మరొక అర్థము మంత్రములు.శబ్దమును సూక్ష్మీకరించి,మంత్రముగా మార్చి,ఆత్మజ్ఞానమును పొందుటకు మంత్రమను మార్గమును చూపుతున్నాడు కనుక పరమాత్మకవి.


 ప్రకృతి యొక్క జాగ్రదావస్థయే విశ్వము.దానిని దర్శించుతకు రశ్ములను మార్గములను చూపువాడు కనుక ఆదిత్యుడు 'కవి."

 పింగల శబ్దము,

 " అసౌ తామ్రౌ-అరుణౌ-పింగలః" అని వర్ణభావముతో ప్రస్తుతిస్తుంతే,

 నాడీ వ్యవస్థ ఇడ-పింగళ నాడిగా గౌరవిస్తుంది.


  మృత్యు శబ్దము సర్వతాపములను నశింపచేస్తున్నది/సర్వమును తపింపచేస్తున్నది.


 స్వామి పింగళ  వర్ణుడై సకలమును తపింపచేస్తాడు.పింగళ నాడియై సకలమును జీవింపచేస్తాడు.


 రక్త శబ్దము రాగమునకు/అనురాగమునకు ప్రతీక.


 సూర్య భగవానుడు రాగరంజితుడై సమస్తమును తాపమునుండి రక్షిస్తాడు.



 అనురాగముతో సర్వమును ఉద్భవింపచేస్తాడు సర్వ భవోద్భవుడు.


 మహా తేజస్సుతో విశ్వమును దర్శింపచేస్తాడు.


 సర్వమును అచేతనము చేస్తాడు.


 పంచకృత్యములకు తాను మార్గదర్శి,


 " బ్రహ్మజ్యోతి-శృతి నికర ఘనీభవుడైన ' ఆదిత్యుని అగస్త్యుడు ,రాముని ప్రార్థించుమని ఉపదేశించిన న వేళ,


 తం సూర్యం  ప్రణమామ్యహం.





  



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)