Posts

Showing posts from March, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SAPTASAPTIMAREECHIMAAN)-10

Image
  ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥   పూర్వభాగ పరిచయమును ముగించుకొని,ప్రస్తుత శ్లోకము నుండి మనము ఆ పరమాత్మ యొక్క నేకానేక గౌణ నామములద్వారా జగత్పాలనా విశషములను అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.  ఆదిత్యుడు,సవితుడు,సూర్యుడు,ఖగుడు,పూషుడు,గభస్తిమానుడు,హిరణ్యసద్రుశుడు,భానుడు,సువర్ణరేతస్సుడు,దివాకరుడు అనే నామ ప్రాశస్త్యము వివరింపబడుతోంది.  ఆదిత్య నమోనమః   ...............  దితి ఖండింపదగినది.విడదీయబడునది.దానికి విరుద్ధముగా అఖండముగా అవిభాజ్యముగా నున్నది అదితి.అదియే అఖండము.  అదియే "ఆత్మజ్ఞానము-అసలు వీడనిది."స్థిరముగా మనలో నిలిచి మనలను ఉద్ధరించునది.దానిని అనుగ్రహించువాడే ఆదిత్యుడు.  సవితః నమోనమః  .............  సువి ప్రాణ సవిత.ప్రసవము అని మనము ఉపయోగించు పదము సవితాశక్తియే.సృష్టి చేయుటకు,విస్తరించుటకు అనుకూలమైన సూర్యశక్తియే సవిత అని గౌణనామముగా ఉపయోగించబడుతున్నది.  సూర్య  ......  సువతి రమయతి సూర్య అన్నది ఆర్యోక్తి.సుష్టు ఇరయతి సూర్యః.వాయు సంచారమునకు తగిన ఉష్ణమును అందించువాడు సూర్యుడు...

ANIRVACHANEEYAM ADITYAHRDAYAM(PRAJA-PRANA)-10

Image
  పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥  పితరో నమః  ***********  పరమేశ్వరుని ఇంద్రియములే/శక్తులే దేవతలు అని పెద్దలు చెబుతారు.ప్రస్తుత శ్లోకము గనములకు సంకేతమైన బహువచనమును అన్వయించుచున్నది.   పితృగణమును-వసుగణమును,సాధ్యగణమును,అశ్వినీదేవతలను ఇద్దరిని,మరుత్ గణములను,మనుగణములను,వాయుగణములను,వహ్నిగణములను,ఋతుగణములను,ప్రభాకిరణములను ప్రస్తావించుచున్నది.  రుద్రములో చెప్పినట్లు"పత్తీనాం పతయే" మార్గములను ఏర్పరచి నడిపించుపరమాత్మ కిరణ సమూహములే బహు రూపములతో,తత్త్వములతో సమీకరింపబడుతూ సహాయపడుచున్నవి.  పితరో నమః  *********  " మాతాచ-పితాచ పితరో" ఆర్యోక్తి.తల్లి-తండ్రులే పితరులు.  జీవునికి జన్మజన్మలయందు ఉపాధికి తగిన అనుగుణమైన ఆహారమును అందించు వ్యవస్థయే పితృదేవతా వ్యవస్థ. పితృయానమునకు సహాయపడు కిరణ సమూహములు.  సనాతన ధర్మముననుసరించి ఉపాధిని వీడిన జీవుడు వసు రూపమును,రుద్ర రూపమును,ఆదిత్యరూపమును క్రమముననుసరించి పొందుతాడని దానికి అనుగుణమైన కర్మలను ఆచరించవలసిన బాధ్యత వారసులదని నమ్ముతుంది.ఒక విధముగా జీవుల వివిధ ఉప...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VIVIDHA KARTA ESHA)-09

Image
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః    ప్రతి స్తోత్రము పూర్వము-పరము అను రెండు కొసలను కలుపుటకు సంగతి అను నడుమనున్న విషయములను ప్రస్తావించును.అదేవిధముగా ఆదిత్యహృదయ స్తొత్రము ఉపెద్ఘ్హ్తమను పూర్వభాగమును పఠించు అవశ్యకతను పూర్వభాగములో తెలియచేసినది.తరువాత సంగతిగా స్వామి యొక్క కిరనవ్యాపకత్వమును-లోక పాలకత్వమును తెలియచేయుచున్నాది.   ప్రస్తుత శ్లోకము గౌణ నామములైన బ్రహ్మ-విష్ణు-శివ-స్కంద-ప్రజాపతి-మహేంద్ర-ధనద-కాల-యమ-సోమ అను నామ విశేషముల ద్వారా స్వామి మనలను ఏ విధముగా అనుగ్రహిస్తున్నాడో మరింత స్పష్టము చేస్తున్నది.  ఏష-బ్రహ్మ-నీవే బ్రహ్మ రూపములో దాగిన అంతర్యామివి.    బృహత్వాత్-బ్రహ్ణత్వాత్-ఇతి బ్రహ్మ  ------------------------  అన్నింటికన్నా ఏది ఉత్కృష్టమో అది బ్రహ్మము.అదియే బృహతత్త్వము.అన్నింటియందు ఏది వ్యాపించి యున్నదో అంతర్యామిగా అదియే బ్రహ్మణత్వము.బ్రహ్మణత్వము ను ప్రకటించువాడే బ్రహ్మ.సర్వజీవులయందలి ఆత్మస్వరూపమే బ్రహ్మము.స్థావర-జంగమ స్వరూపముగా భాసించుచున్నది బ్రహ్మము.తాను కదలకుండా యుండి అన్నింటిని కదిలించు ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ESHALOKAAN PAATI)07

Image
  సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥  ప్రస్తుత శ్లోకములో" ఏష" అను శబ్దము స్వామియొక్క అంతర్యామి తత్త్వమును వివరించుచున్నది.   మరియును స్వామి యొక్క లోకపాలకత్వమును ప్రతిబింబించుచున్నది.  సర్వ-అన్ని-సమస్త-  దేవగణాన్-దేవతా సమూహములలో  ఆత్మన్-అంతర్యామిగా నుండి వారిచే ప్రకటింపబడుతున్నది  దేవ-అసుర-గణాన్   సత్వ-రజో-తమోగుణములుగా ప్రకటింపబడుతున్న వానిలోదాగినది  ఏష-నీవే-ఏకైక ఛిత్శక్తివి.అనుపమానమైనది.  శ్రీ లలితారహస్య సహస్రనామములో చెప్పబడినట్లు  'సమానాధిక వర్జితా"   హే పరమాద్భుత శక్తి!  నీతో సమానమైనది కాని-అధికమైనది కాని లేదు.  ఆ శక్తియే ఆదిత్యహృదయ స్తోత్రములో ఏష శబ్దముగా సంబోధింపబడి-సంభావింపబడుచున్నది.  ఏష దేవ  ఏష సర్వదేవ  ఏష సర్వదేవాత్మక  ఏష-దేవాసుర గణ-గుణ  ఏష-తేజః  ఏష-తేజస్వి  ఏష-రశ్మి  ఏష ఏస్మిభావన  ఏష-గ-గమనము  ఏష-భ-ప్రకాశము  ఏష-గభస్తిభిః-గమనముతో ప్రకాశమును కలిగించువాడవు.  చీకట్లను తొలగించువాడవు.   ఏష-లోకాన్ ...

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(BHASKRAM-BHUVANESVARAM)-07

Image
 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥  ఆదిత్యహృదయ ఉపోద్ఘాత-ఫలశృతి   అనంతరము అగస్త్యుడు ప్రస్తుత శ్లోకములో స్వామి యొక్క అతిశయ గుణవిశేషములను  మనకు అనుగ్రహించుచున్నాడు.  ఇదే విషయమును విశ్వామిత్రుడు, "కౌసల్యా-సుప్రజా రామా-పూరాసంధ్యా ప్రవర్తితే  ఉత్తిష్ట నరశార్దూల-కర్తవ్యం-దైవమాహ్నికం"  అని తెలియచేసాడు.  స్వామి యొక్క ఉదయము సముద్యంతం గా ప్రస్తుతింపబడుతున్నది.  స్వామి" సమ్యక్-ఉద్యంతి" సమస్త లోకములను-చరాచరములను జాగృతము చేయుచున్నాడు.నిద్రావస్థ నుండి చేతనావస్థకు తరలించుచున్నాడు.అంటే స్వల్పకాలిక లయమును ముగించుకొని  అనుష్ఠానమును ప్రారంభించవలసిన  సమయమాసన్నమైనదన్నమాట.   సూర్య భగవానుడు భువనములకు సంపదలను-ఈశ్వరత్వమును ప్రసాదించువాడు.కనుక భువనేశ్వరుడు.భువనములను పరిపాలించువాడు.  ఇక్కడ మనము స్వామి అనుగ్రహమును-మనము చేయవలసిన అనుష్ఠానము ఒకచర్యకు గల రెండు పార్శ్వములను తెలియచేస్తున్నారు.  స్వామి రశ్మిమంతుడు.అనగా తన కిరణ ములతో సకలచరాచరములను జాగృతము చేయుశక్తి కలవాడు.  సకలదేవతా చైతన్య సంకే...

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(SARVAMAANGALYAM)-06

Image
  సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥   ప్రస్తుత శ్లోకములో ప్రవృత్తి-నివృత్తి అను రండుచిషయములు చెప్పబడినవి.అంటే కొన్ని సుగుణములను అనుగ్రహిస్తాడు-మరి కొన్నింటిని తొలగిస్తాడు ఆదియ్త్య రూపములో స్తుతింపబడుచున్న పరమాత్మ.  పాపము అనగా బుద్ధిని -విచక్షణను విస్మరించి ఇంద్రియలోలులమై ప్రవర్తించిన తీరుకు కలిగే ఫలితము.అవి మానసికము కావచ్చును-కాయకము కావచ్చును.వాటిని నాశనము చేసేది/పూర్తిగా తొలగించేది ప్రణాసనం-పరిపూర్ణముగా నిర్మూలించునది స్వామి స్తుతి.  అంతే కాదు చింత-ఆలోచనము-విచారము అను రెండు అర్థములలో చింత అను పదమును అన్వయించుకుంటే " యద్భావం తద్భవతి" అన్నట్లుగా  మన ఆలోచనాప్రవృత్తులను అనుసరించి వాటి ఫలితములు అనుసరిస్తాయి.  కనుకనే ధూర్జటి మహాకవి,  చింతాకంతయు చింత చేయరు కదా శ్రీకాళహస్తీశ్వరా అని స్వామి నిన్ను స్మరించరు మోహభ్రాంతితో అన్నాడు.  అదియే కనుక  సత్ చింతయ న శోక అని అన్వయించుకుంటే   సత్తు-చిత్తు యైన పరమాత్మను స్మరించిన-తత్త్వమును ఆలోచించినను శోకముండదు కదా అని కూడ భావింపవచ్చును.  ప్రస్తుత శ్లోకము...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05

Image
  ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥  ప్రస్తుత శ్లోకము సర్వాంతర్యామిని సంకేతిస్తూ,అఖిలమునకు మూలమైన ఆదిత్యహృదయ స్తొత్రమును నిత్యము జపించిన కలుగు ఫలప్రాప్తిని వివరించుచున్నది.  జయము-శివము-నిత్యము అను మూడు విశేషములు ప్రస్తావించబడినవి.పదములలో దాగిన నిగూఢార్థములను గ్రహించే ప్రయత్నము చేద్దాము.  1.ఆదిత్య అను శబ్దమునకు అనేకానేక సమన్వయములు చెప్పబడినవి.  ప్రణవముగా ఆదిత్యశబ్దము కీర్తించబడుతున్నది.  ప్రకాశముగాను స్పష్టమగుచున్నది.  కాలగమనమునకు సంకేతముగాను నిర్ధారింపబడుచున్నది.  కిరనముల ద్వారా ప్రత్యక్ష వ్యాపకత్వముతో పరిపాలించుచున్న పరమాత్మ అనుట నిజమే.    హృదయము అనగా మూలము.అనంతవిశ్వరచనకు ఏది మూలమో,అనంతవిశ్వభ్రమణమునకు ఏది కారనమో,అనంత పోషకత్వమునకు ఏది ప్రధానమో,అనంత వికాసమునకు ఏది ఆధారమో అదే ఆదిత్యహృదయము.  సాహిత్య పరముగను-సాంకేతిక సమన్వయమునకు అనుసంధానము చేయుచున్న అద్భుత చేతనాశక్తియే ఆదిత్యహృదయము.  జపము అను పదము  అట్టి మహత్తర చైతన్యశక్తిని నామము-స్మరనము-సమయము-సమర్పణము-విశ్వాసము అను నమః చేయుచున్న...

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

Image
  రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥  ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.  ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.  మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.  అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.  ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.  ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.  అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు  సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా   కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.   అంతే కాకుండ  వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.  వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాద...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03

Image
   కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.  అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును  ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.  రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ  తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా  కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.  రఘువంశ కులదైవము సూర్యభగవ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(UPAGAMYAA AGASTYO)-02

Image
  దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః   ప్రస్తుత శ్లోకములో రెండు పాత్రలు ప్రవేశింపబడినవి.అవి, 1.అగస్త్య మహాముని 2.దేవతలు.  ఇంకొక విశేషము మొదటి శ్లోకములో యుద్ధమునకు సిద్ధముగా సమీపించిన రావణుని ప్రత్యర్థి రామచంద్ర ప్రభువుగాను పేర్కొనబడినది.  రాముడు భగవానుడు.  రామునికి ఉపాగమ్యా-సమీపమునకు వచ్చినవాడు ఋషి అగస్త్యమహాముని.  ఇంకొక విచిత్రము ఈ యుద్ధమును వీక్షింపచేయుటకు అగస్త్యుడు దేవతలందరిని తనతో కలుపుకొని/కూడి వచ్చెను.  అగస్త్య-గమ్య అగస్త్యుడు వచ్చెను.  అగస్త్య సమాగమ్యా-అగస్త్యుడు-దేవతలతో కలిసి వచ్చెను.   వచ్చిన అగస్త్యుడు  రామం ఉపాగమ్యా-రాముని దగ్గరకు సమీపించెను.   అంటే రామునికి అగస్త్యమహాముని ఆదిత్యహృదయమును ఉపదేశించునపుడు మిగిలినవారు వినలేదా/యుద్ధము జరుగలేదా అను అనుమానములు కలుగ వచ్చును.  అది సామాన్యమైన రామ-రావణ యుద్ధము కాదు.అంతా నిమేషము-రహస్యము-రమణీయము.  అంతే కాదు అభ్యాగతో అన్న పదం ప్రయోగించబడినది.అంటే వారు అనుకోకుండా,తిథి-వార-నక్షత్రములను గమనించకుండా వచ్చే అతిథులు కారు.ఎప్పుడెప్ప...

ANIRVACHANEEYAM- ADITYAHRDAYAMU(TATOE YUDDHAM)-01

Image
  తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥   ప్రస్తుత శ్లోకములో మహర్షి అనుగ్రహించిన పదములు,    తత్-ఆ  యుద్ధము,సమరము,చింత-అగ్ర-దృష్టి,రావణ-స్థితం-సముపస్థితం.పరిశ్రాంతం మొదలగునవి.  రావణ-అను ఒక్క నామము మాత్రమే చెప్పబడినది.  సమరము-యుద్ధము-పరిశ్రాంతము-దృష్ట్వా-(చూచెను)స్థితం-సముపస్థితం   అను క్రియా పదములు(పనుల) గురించి చెప్పబడెను.  అగ్రతో-పైకి,పరి-మిక్కిలి,విశేషములను చెప్పబడినవి.  రావణం చ-అనగా రావణునితో కూడి యున్నది ఆ యుద్ధరంగము అని,చ అను భూతకాలమును అన్వయించుకుంటే ఈ యుద్ధము ఎప్పుడో జరిగినది అని రెండు విధములుగా భావించవచ్చును.కాని రావణునికి ఎవరికి మధ్యన ఈ యుద్ధము జరిగినదో ప్రత్యేకించి చెప్పలేదు.  సమరే చింతయాస్థితం-అన్నారు మహర్షి.  యుద్ధమును గ్య్రించిన ఆలోచనలతో నున్నారట. అంటే ఇరుపక్షములవారా లేక కేవలము రావణుడు మాత్రమేనా అన్న సంసయము కలుగవచ్చును అజ్ఞానమునకు.  రావణ ప్రసక్తి వచ్చినది కనుక లంకలో యుద్ధము జరిగినదనుకొనుటలో తప్పులేదు.  కాని నిలకడలేని ఆలోచనలు స్థిరముగా నున్నవట.ఇది ఒ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-INTRO

Image
         ఆదిత్యహృదయము         *************  "ఏకం సత్ విప్రా బహుధా వదాతి"    వాల్మీకి విరచితమైన "శ్రీమద్రామాయణము" లోని యుద్ధకాండమునందు "ఆదిత్యహృదయస్తోత్రము"  అగస్త్యమహాముని చే అనుగ్రహింపబడినదని ఆర్యోక్తి.  కథాకథన ప్రకారముగా,  దక్షప్రజాపతి కుమార్తె అదితి.కశ్యప ప్రజాపతి ధర్మపత్ని.వీవివి సంకేత నామములు.వానినే గౌణ/గుణమును తెలియచేయు నామములని చెబుతారు.అదితి అనగా అఖండము.కష్య అనగా ప్రకాడము.అకహండ ప్రకాశమే వారి దాంపత్యము.   మాతృస్వరూపిణి అయిన అదితీదేవి ధర్మసంరక్షణమునకై "అదిత్యోపాసనమును" ఉపాయముగా భావించి,తన భర్త అనుమతిని స్వీకరించి,పరమాత్మను ప్రార్థించుటకు పూనుకొనెను.   పరమాత్మ(సూర్యభగవానుడు) తల్లికి ప్రత్యకముగా కనబడి,సుష్మ్న అనే కిరణము ద్వారా ఆమె గర్భవాసము చేసే వరమును ప్రసాదించెను.  తరువాత జరిగిన కథను మనము ముందు సంచికలలో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.    అదితి అనగా అఖండముగా మనము భావించుకుంటే అఖండమునకు లభించిన అనుగ్రహమే "ఆదిత్య హృదయము".  పరంజ్యోతిని అదితిగా భావించుకుంటే పరమాత్మ ప్రకాశమే ఆ...

SIVATANDAVA STOTRAMU(ANUGRAHAMU)-15

Image
  పూజావసానసమయే దశవక్త్రగీతం యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే | తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15.  ప్రస్తుత శ్లోకము కథాపరముగా అన్వయించుకుంటే పూజను ముగించే సమయమున,సాయం సంధ్యా సమయమున చదివినటయితే అశ్వములు-ఏనుగులు-రథములు లభించుటయే కాక అవి మరలిపోక స్థిరముగా ఉంటాయని చెప్పబడినది.పది నాలుకలు కల రావణుడు దీనిని పఠించినట్లు-పరమేశ్వరునిచే అనుగ్రహింపబడిన కథనము కలదు.ఒక విధముగా ఇది సంప్రదాయ మంగళాశాసనము.సంపదలను అనుగ్రహించేవాడు శంకరుడు.అనగా సంకరుడు అను నామము-శిరముపై జటలు-గంగ-చంద్రవంకను ధరించి,మెడలో పాములను హారములుగా ధరించి,డమరు నాదమును మ్రోగించుచు ,అమ్మ పార్వతీదేవిని కూడి తాండవమాడు స్వామిని స్మరించుకుంటే అసమాన సంపదలను పొందుతారని ఆర్యోక్తి.  కాని కొంచము నిశితముగా పరిశీలితే ఎన్నో విశిష్ట పదముల వివరణను గ్రహించగలిగితే మనము తప్పక మన మనసును పరమేశ్వరార్పనము చేయకుండా ఉందలేము.   స్వామి తాందవమును వర్ణించిన సాధకుడు ఆ పవిత్ర తాండవము తనలో కూడా నిరంతరము జరుగుచున్నదని,ఆ నర్తనమును గమనించుకొనుటయే లక్ష్మీ సుముఖత్వముగా గ్రహించగలగాలి.  తన స్వస్వరూపమును అర్థముచ...

SIVATANDAVASTOTRAMU(VISUDDHIM ETI SAMTATAM)-14

Image
  ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ | హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||  క్రిందటి శ్లోకములో సాధకుడు తాను పొందవలసిన సమాధిస్థితిని తెలియచేస్తూ,కనుబొమలమధ్యలో తన ఏకాగ్రతను నిలిపి ఆ పరమాద్భుతమును దర్శితూ,ధ్యానిస్తూ , స్తవములలోఎల్లా అత్యుత్తమమన శివతాండవస్తొత్రమును  1.పఠన్-స్మరన్-బ్రువన్  చదివినను-స్మరించినను-జపించినను  ఇదమ్హి నిత్య ఏవ ముక్తం  శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.  2.అంతే కాదు న అన్యధాగతి-అంతకంతే తక్కువ స్థితికి తీసుకుని వెళ్లదు.అంటే అదే స్థితిలోనే సాధకుని చిత్తమును నిలుపుతుంది. 3.అట్టి స్థితికి అనుకూలమగు  నరో విశుద్ధ ఏతి సంతతం  ఇక్కడ నరులకు అను శబ్దము ప్రయోగించబడినది. ఆకారములు వికారములకు ప్రేరకములు.నరులకు చూపు ఆకారములపై నున్నంతకాలము వికారములు వారిని వేధించక మానవు.  ఆకారములో దాగి చైతన్యవంతము చేస్తున్న అసలును గ్రహించిన వేళ ఆకారములేదు-అది కల్పించు వికారములుండవు.  అప్పుడు ఆ హృదయకుహరములో సుభక్తి ప్రవేశించి ఆ పరమాత్మను గురువుగా తనను అను...

SIVATANDAVA STOTRAMU(SIVETI MAMTRAMUCHCHAREN KADA-WHEN)-13

Image
  కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్ విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ | విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||   క్రిందటి శ్లోకములో సాధకునకు కావలిసిన మనోస్థితిని సమస్థితిగా వివరిస్తూ,అట్తి స్థితిని పొందుటకు బాహ్యవస్తువులలోని వైవిధ్యమును గమనిస్తూ ద్వంద్వములో దాగియున్న మూలమును గ్రహింకలిగే సంస్కారమును పొందాలి అని చెప్పబడినది.    ప్రస్తుత శ్లోకములో ఆసనమును గురించి ఎటువంటి ప్రదేశము అనువైనది నాలుగు విధములుగా ఐదవది ఫలితముగా చెప్పబడినది.అవియే 1.వసనము 2.స్మరనము 3.లగ్నము 4.వందనము 5.సుఖము                           1.వసనము.    *******  బాహ్యమునకు   నిలింపనిర్ఝరీ ప్రవాహ తటమున కల కుటీరము అనువైనదట.భ్రూమధ్యక్షే త్రమైన కాశీక్షే త్రమున ప్రవహించుచున్న గంగానదీ తీరమున నున్న పవిత్ర ఆశ్రమములో అధిష్ఠించి ఉపాసనను ప్రారంభించవేల్ననెను.   మనసులో కదిలే ఆలోచనలన్నీ నిలింపనిర్ఝరీ తరంగములు కావలెని.వాటి తీరమున నున్న హృదయ కుహరము కుటీరముగా కావించుకొనవలెను. ...

SIVATANDAVA STOTRAMU( KADA SADASIVAM BHAJE--ELIGIBILITY TO WORSHIP)-1212

Image
  దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్- -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః | తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||   మొదటి శ్లోకములో జటాజూటమునుండి జారిన నిలింప-దేవతలయొక్క-నిర్ఝరీ-జల ప్రవాహము శివతాండవ వేదికను పునీతము చేసినది.ప్రస్తుత శ్లోకములో సాధకుని హృదయపీఠిక స్వామి తాండవమునకు ఏ విధముగా సిద్ధము చేసుకొనవలెనో తెలియచేయబడుతున్నది.  ఇంతవరకు చెప్పబడిన శ్లోకములలో సర్పములు ఒకసారి ఆభరణముగాను-మరొకసారి ఆయుధముగాను-ఇంకొకసారి అగ్నిని ప్రజ్వలించేసిన జ్వాల గాను స్వామి తాండవములో భావింపచేసినది.  అదే విధముగా స్వామి కంఠము సైతము ఒకసారి అమావాస్య కటికచీకటిగాను మరొకసారి చంద్రోదయమునకు వికసించుచున్న కలువకాంతిగాను ప్రస్తావింపబడినది.   గజము ఒక సారి గర్వచిహ్నముగాను మరొకసారి ఉత్తరీయముగాను భావింపబడినది.   చంద్రవంక ఒకసారి స్వామి జటలో ఆభరణముగాను మరొకసారి చకోరమునకు వెన్నెలనందించు అమృతమూర్తిగాను వర్ణింపబడినది.  అమ్మవారు సరేసరి .అగ్నిసోమాత్మక సంకేతముగాను,అర్థనారీశ్వర పరమార్థముగాను,మరొకసారి జగన్మాతగా స్థితికార్యమును నిర్వహించుటకు సూర్యచ...