SIVATANDAVASTOTRAMU(VISUDDHIM ETI SAMTATAM)-14

 ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||


 క్రిందటి శ్లోకములో సాధకుడు తాను పొందవలసిన సమాధిస్థితిని తెలియచేస్తూ,కనుబొమలమధ్యలో తన ఏకాగ్రతను నిలిపి ఆ పరమాద్భుతమును దర్శితూ,ధ్యానిస్తూ ,
స్తవములలోఎల్లా అత్యుత్తమమన శివతాండవస్తొత్రమును 
1.పఠన్-స్మరన్-బ్రువన్
 చదివినను-స్మరించినను-జపించినను
 ఇదమ్హి నిత్య ఏవ ముక్తం

 శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది. 
2.అంతే కాదు న అన్యధాగతి-అంతకంతే తక్కువ స్థితికి తీసుకుని వెళ్లదు.అంటే అదే స్థితిలోనే సాధకుని చిత్తమును నిలుపుతుంది.
3.అట్టి స్థితికి అనుకూలమగు
 నరో విశుద్ధ ఏతి సంతతం
 ఇక్కడ నరులకు అను శబ్దము ప్రయోగించబడినది.
ఆకారములు వికారములకు ప్రేరకములు.నరులకు చూపు ఆకారములపై నున్నంతకాలము వికారములు వారిని వేధించక మానవు.
 ఆకారములో దాగి చైతన్యవంతము చేస్తున్న అసలును గ్రహించిన వేళ ఆకారములేదు-అది కల్పించు వికారములుండవు.

 అప్పుడు ఆ హృదయకుహరములో సుభక్తి ప్రవేశించి ఆ పరమాత్మను గురువుగా తనను అనుగ్రహించమని వేడుకోగలుగతుంది.జీవాత్మను శిష్యునిగా స్వీకరించి పరమాత్మ గురువై అంధకారమును తొలగించుతకు నామ సమరనము-పఠనము-జపము అను అనువగు మార్గములను చూపిస్తూ దేహి యొక్క దేహభ్రాంతిని విడిచి శంకరుని సుచింతనను పొందగలుగుతారు.
 ఏక బిల్వం శివార్పణం. 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)