Ananda Lahari-14

 "సర్వ మంగళ మాంగళ్యే  శివే సర్వార్థ సాధికే
   శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే."

    "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః".తల్లి తన చేతివేళ్ళగోళ్ళనుండి దశావతార నారాయణులను సృష్టించి,వారిని ధర్మ సంస్థాపనకు ఉపకరణములు చేసి,వారి శక్తులను తనలో అంతర్లీనము(కల్కి)తప్ప అంతర్లీనము చేసుకొన్నది.ఇది చర్మ చక్షువులకు అర్థమైనది.సూక్షమను ఒకింత ఆలోచిస్తే 1.కర్త-2.కరణము-3.కార్యము-4.ఫలము/ఫలితము అని నాలుగుగా విభజింపబడిన శక్తియొక్కటే.కనుక కర్తగా తలపోసి,కరణములను సృష్టించి,కార్యరూపము దాల్చి,ఫలితములను ఫలములను అందుకొనుచున్నది అమ్మ.చిఛ్చక్తియే  సర్వవ్యాపకమై (వైష్ణవమై)  త్రికూటాచల పర్వత మధ్యమున మాయాసతి శిరోభాగము సర్వ శ్రేష్ట జ్వాలాయాం శక్తిపీఠముగా మనలను అనుగ్రహించుచున్నది.

    త్రికూటాచల పర్వతశ్రేణులలోని జ్వాలా క్షేత్రములో,మాయాసతియొక్క శిరోభాగము పడిన ప్రదేశములోఒకే శిలపై ఊర్థ్వ భాగమున శక్తిస్వరూపము గాను,అథోభాగమున మహాలక్ష్ని-మహావాణి-మహా గౌరి శక్తులైన మూడురూపములలో ద్యోతకమగుతు,మనలను దీవిస్తుంటుంది తల్లి.

  త్రికూట పర్వతము ఏనుగు దంతాకారముగాను,పై భాగము ఏనుగు నుదురుగాను లక్ష్మీసంకేతములై,అమ్మను పూజించుచున్నవి.

        స్థలపురాణము ప్రకారము బంచాలి గ్రామములో శ్రీధరుడు అను పండితోత్తముడు సదాచార సంపన్నుడై,సంతానము కొరకు అమ్మని అత్యమ్యభక్తితో ఆరాధించేవాడట.అతనిని కరుణించదలచిన తల్లి,

  " అధాత: సంప్రవక్ష్యామి కుమారీ కవచం శుభం
    త్రైలోక్య మంగళం నామ మహాపాతక నాశనం."

    శ్రీధరుని కరుణించిన కౌమారిదేవి అతనికి దర్శనమిచ్చి,అన్న సంతర్పణమును చేయమని కోరినది.పేదరికిముతో స్నేహముచేయు అతడు అమ్మ మాటలకు విస్తుపోయి,తల్లి
ఆనను శిరసావహించి,అన్న సంతర్పణకు ఊరిజనమునందరిని ఆహ్వానించి,ధ్యానమగ్నుడాయెను.అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లేకదా.భావనా మాత్రముచేతనే బహుపదార్థములు ప్రత్యక్షమాయెను.పంక్తి భోజనమును కౌమారి మాత్రుప్రేమతో మమతలుపంచుచు వడ్డించుచున్న సమయమున,దురహంకారియైన భైరవుడనువాడు అమ్మను మద్య-మాంసములను తినుటకు వడ్డించమన మనెను.వీలుకాదనిన అమ్మపై వాడు ఆగ్రహించి,బంధించుటకు ప్రత్నించిచిన మార్గమే,ఆట-పాటలతో అలుపన్నది తెలియక భక్తులు చేయు వైష్ణవీదేవి ఆధ్యాత్మిక అద్భుత యాత్ర.

       అమ్మ తొలిమజిలీ హంసవిల్లి గ్రామము.ఇక్కద దేవామాయి మందిరము ఉంది.శ్రీగురుడనే భక్తునికి అమ్మవారు బాలెంతగా దర్శనమిచ్చినదని,కై ఖండోబా మాత అని కూడ కొలుస్తారు.అక్కద అంతర్ధానమయిన తల్లి అనేక మజిలీలు చేస్తున్నప్పుడు అమ్మను అనుసరిస్తున్న నరులకు/వానరులకు దాహమేసి,డస్సిపోయిన తరుణమున అమ్మ  బాణమేసి జలను అందించినదట.దీనిని "బాణగంగ" అంటారు.అమ్మ తన కేశములతో ఈ జలమును పవిత్రము చేసినదని "బాల్ గంగ" అని పిలుస్తారు.ఉత్తరాది వాడుక భాషలో బాల్ అంటే కేశములు/శిరోజములు అని అర్థము.శిరోజానుగ్రమును పొందిన గంగ కనుక శిరోజ తీర్థము అని కూడా అంటారట.    భైరవుడు తనను ఇంకా వెంబడిస్తున్నాదేమో నని అమ్మ ఒకనిముసము వెనుతిరిగి చూసినదట.ఆ సమయములో అమ్మపాదుకలు భక్తులను ఆశీర్వదించుటకు అక్కదే నిలిచిపోయాయట.అందుకే ఆ స్థలము చరణ పాదుకా తీర్థమని కొలుస్తారు.
  కాలస్వరూపమైన కౌమారి తన లీలగ అక్కడ గుహలో తొమ్మిదినెలలు గర్భస్థశిశువు మాదిరి దాగి బయటకు వచ్చినదట.
 లీలారూపిణి కొంతముందుకుసాగి జ్యోతి స్వరూపిణియై, ,అవలీలగ బైరవునికి ముక్తిని ప్రసాదించినది.జైమాది నమో నమ:. 


  కట్రా త్రికూట పర్వత ప్రారంభములో ఉంది.నడవలేని వారు గుఱ్ఱాల మీద,పల్లకీ లలో వెళతారు.అమ్మ
 నామస్మరణతో,ఆశీస్సులతో బయలుదేరిన భక్తులు ముందుగా
 దర్శించేది 'కోల్  కండోలి మాతను.మాత దయతో ముందుకు సాగుతూ, దేవీమాయాను దర్శించుకుంటారు. తల్లి పిలవాలే కాని మనము
  తలచుకుంటే వెళ్ళలేము .కదులుతున్న కొన్ని మజిలీల తరువాత భైరవుడు తనను ఇంకా
  వెంబడిస్తున్నా
  డేమోనని ఒకసారి వెనుదిరిగి చూచిన
  దట.అనుగ్రహముగా అమ్మ
  చరణములు అక్కదనే తమ ముద్రికలను నిలిపాయట.కనుక ఈ ప్రదేశమును
  చరణ పాదుకా ప్రదేశముగా కొలుస్తారు.

   అమ్మను అనుసరిస్తు నడుస్తున్న నరులు/వానరులు దప్పిగొని బడలినవారైనా
  రట.కనికరించిన తల్లి తన బాణమును సంధించి జలమును అందించినదట.అ పవిత్ర తీర్థమును 'బాణ గంగ" అని కొలుస్తారు.మరి కొందరు అమ్మ తన
  శిరోజములతో అ జలమును అతిపవిత్రము గావించినదని "బాల్-గంగ" అని కొలుస్తారు.కేశతీర్థము అనికూడా కొలుస్తారు.

  అమ్మ అ తాంత్రికుని బారినుండి తప్పించుకొనుటకు, అక్కడి గుహాలయములో తొమ్మిది నెలలు ,గర్భస్థ శిశువు వలె ఘోరతపమాచరించినదట.అందువలన
  అమ్మను ఆదికుమారి అని కొలుస్తారు.  గర్భజూన్  అనికూడ అం
  టారు.
  అక్కడ భైరవుడు తలప
  డబోగా అమ్మ వానిని ఎదిరించి ,క్షమించి అంతర్ధానమయ్యెను.సాగుతూ సాగుతూ
  త్రికూటమను
  పర్వత మధ్యభాగమునకు చేరెనట.మూర్ఖుడైన భైరవుడు తన తప్పిదమును,అమ్మ క్షమాగుణమును గుర్తిం
  చని భైరవునితలను తన ఖడ్గముతో దునిమి,వాని కోరికపై,వాని తలను దర్శించిన తరువాతనే వైష్ణోదేవి తీర్థ యాత్ర ముగియునట్లు వరమిచ్చెను.

      "జంబూ కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" నే శ్లోకమాధారముగా ఈ

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)