SIVA SANKALPAMU-98
ఓం నమః శివాయ-98
********************
సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు
నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు
పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు
కందర్ప దర్పునికి కర్పూర దీపములు
పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు
జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు
ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు
ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు
మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు
దీపములను పేర వెలుగు నీ నామ రూపములు
జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.
శివుడు చాలా పిరికివాడు.చీకటి అంతే భయపడుతు ఎవరు,ఎప్పుడు-ఎక్కద దీపములను వెలిస్తారా అని ఎదురుచూస్తూ,వెలించిన దీపముల నుండి తనకు కావలిసిన శక్తులను గ్రహిస్తూ,తనకు ఒక కన్నులో అగ్గి ఉందని,తాను జంబుకేశ్వరములో జలస్వరూపుడనని చెబుతూనే జలములో అరటిదొన్నెలలో భక్తులు పెట్టు దీపములకై ఎదురుచూస్తుంటాడు.చిదంబరములో ఆకాశతత్త్వమే నేనంటు భక్తులు ఇంకా ఆకాసదీపములను వెలించలేమిటబ్బ అని ఆలోచిస్తుంటాడు.పైగా తాను విరాగిని కనుకనే మన్మథుడిని సంహరించానని చెప్పుకుంటూనే "కర్పూరదీపం మయర్పితం" అని భక్తుడు అనగానే ముక్కుపుటాలను విస్తరింపచేస్తు,"కర్పూరదీపం మయ స్వీకృతం" అంటు సువాసనను పీలుస్తూనే ఉంటాడు.పైగా తాను కర్పూరగౌరం అంటు తన తెల్లని మేనిఛాయను గుర్తు చేసుకుంటుంటాడు.పరంజ్యోతికి ప్రమిదలలోని దీపమెందుకండి.సూర్యుని ముందు దివిటీల కాని మన స్వామి వద్దనడు.అవి ప్రమదభరితమే అంటూ పరుగులెత్తి మరి తీసుకుంటాడు.సుగంధపుష్టి కర్తట.ఏట్లా అయ్యడో చూసారా.సుప్రభాత దీపములనుండి సద్దుచేయకుండ తనకు కావలిసిన శక్తులన్నిటిని సంగ్రహిస్తాడు.(సద్దుచేయక్యండ)ప్రతినిధే ఇట్లా ఉంటే పాపము నమ్ముకున్న ప్రమథగనము పరిస్థితి ఊహిస్తేనే,ఉమాపతి నీ బండారం బయటపడుతోంది.ఇంకా చీకటి పడనేలేదు..కొంచంకొంచముగా ఆవరించుకుంటోంది.వెలుగు తాను తప్పుకోవాలనుకుంటోంది.ఇంతలోనే ,
ప్రదోషదీపములు వెలిగించండి అంటూ ఒకటే హడావిడి.గమనించారు అందరు శివుని బాగా.కాసేపు పొగిడి జ్వాలా తోరణము లోనికి ప్రవేశించి బయటకు రమ్మన్నారు.పాపము శివునికి చీకటి అంటే భయము పోగొట్టడానికే సుమండి.చాకచక్యముగా తప్పించుకొనే చతురతలేక , చేసేదిలేక సరేనన్నాడు.-నింద.
దోషము నమః శివాయ-ప్రదోషము నమః శివాయ
జ్యోతి నమః శివాయ-పరంజ్యోతి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" కృష్ట పచ్యంచమే-అకృష్ట పచ్యంచమే" రుద్రము.
వ్యవసాయమునకు అనుకూలముగా ఉన్నిన నేలలో-దున్నని నేలలో సమబుధ్ధితో ప్రకటితమవుతానుతకు ఇంతకన్న ఏమి నిదర్శనముంటుంది శివా.దున్నని క్షేత్రమైన(శరీరమునును పంటకు పక్వము చేసిన పరమేశా! పాహిపాహి.నీ దృక్కులను నాగలితో (సీరంచమే) నా మనసనే బీడునేలను దున్ని,నీ కృపాకటాక్ష వృష్టితో చదునుచేసి-పంటను (నీ అనుగ్రహమే) పండించుటకు సిధ్ధము చేసిన కర్షకుడా దానిలో భక్తి-విశ్వాసము అను విత్తులను వేసి నన్ను అనుగ్రహింపుము.నా అజ్ఞానము కొంచము కొంచము నన్ను వీడుచున్నది.నీ అనుగ్రహము నా దారిని చూపించుచున్నది శుభసూచకముగా.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment