Posts

Showing posts from November, 2021

TIRUNALAI POVAR NAYANAR

" నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!" తిరునాలైపోవార్ నాయనారు ********************** తిరునాలై -మరుసటిరోజు పోవర్-శివదర్శనమునకు పోవుచున్నాను అని భావించెడివాడు. తనకు చిదంబర నటరాజ దర్శనమునకు తనకున్న ఆర్థిక పరిస్థితి,అసమాన కుల స్థితి అవరోధనమును కలిగించునని తెలిసి నప్పటికి,సదాశివునికరుణపైగల నమ్మకము నందనారును మరుసటిరోజు తాను శివదర్శనమును చేయగలనన్న నమకముగా మారినది. నంది తలను పక్కకు జరిపించిన మహనీయుడు కనుక నందనారుగా ప్రసిధ్ధిని పొందెను. ఆదనూరు మురికివాదలో చెప్పులుకుట్టే వంసమునందు జన్మించిన నాయనారు తనకు జన్మతః లభించిన కళతోచెప్పులను మాత్రమే కాక డమరు-మద్దెల మొదలగు చర్మవాతిద్యములను అయంతభక్తితో తాయారుచేసి స్వామిసేవకు సమ్ర్పిమచేవాడు. **** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా తిరునాలై పోవార్ నాయనారు తిరిపమెత్తువాని భక్తుడు "గీతం సమర్పయామి" అంట...

PUGAL CHOLA NAYANAR

పుగల్ చోళ నాయనార్ ******************** కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం బొందరే వారేరీ సిరిమూటకట్టుకుని బోవంజాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులుం ప్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా పోతనామాత్యుడు పుగల్ -ప్రభువు/పెంపొందించు స్వభావము కలవాడు. చోలన్-చోలరాజ్యమ్ను పెంపొందించి/పాలించు స్వభావము కలవాడు. సమర్థవంత రాజ్యపాలన వృత్తి. సదాశివార్చన ప్రవృత్తి. ఎరిపత్త నాయనారు అభిరామి ఆండారును పై దూకి,నెట్టి,కిందపడవేసినందుకు వచ్చి,క్షమాపణలను చెప్పిన రాజుగా భావిస్తారు. ఉరైయూరును రాజధానిగా చేసుకుని,ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ,పశుపతీశ్వరుని సేవిస్తూ పరమానందముగా కాలమును గడుపుచున్నవేళ, తలపున యైనను శివభక్తులకు చెడును తలపెట్టని నాయనారుకు విషమ పరీక్షను పెట్టదలచాడు. " పరమం పవిత్రం సాంబం విభూతిం పరమ విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం సాంబం విభూతిం ఇదమాశ్రయామి. విభూతి అనగా ఐశ్వర్యము/మహిమ/కరుణ అను అర్థమును కనుక మనము భావించుకుంటే," వి-విశేషమైన-భూతి/బూది-అనుగ్రహమును ఉపకరనమ...

KOTPULI NAYANARU

కోట్పులి నాయనారు ********************* దృశ్యాదృశ్య విభూతి వాహనకరీబ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. తిరునాత్తియన్నగుడి లో వ్యవసాయ కుటుంబము నందు నాయనారు జన్మించెను. చోలరాజునకు సైన్యాధ్యక్షత వృత్తి. ధాన్యరాశులను దేవాలయములోని నైవేద్యమునకు,అన్న సంతర్పణములను అర్పించుట ప్రవృత్తి. అన్నింటిని సరిగా సాగనీయడు కదా అన్నపూర్ణేశ్వరుడు. భక్తి చేయు గమ్మత్తులను బాహ్యప్రపంచమునకు తెలియచేయాలనే సంకల్పముతో ఎన్నో చిత్ర-విచిత్రములను చేస్తుంటాడు. భక్తినే ఆయుధముగా మలచి భక్తుని అరిషడ్వర్గములతో ఆడుకోమంటాడు.తాను వేడుక చూస్తుంటాడు. ఇక్కడ అదే జరిగింది.వ్ర్త్తి-ప్రవృత్తిని రెండు పాచికలుగా మలచుకున్నాడు మహేశుడు. కర్తవ్యపాలనము అంటూ నాయనారుకు ధాన్యము దేవాలయములలోని పంచే అవకాశమును తుంచివేశాడు. రాజాజ్ఞగా ఊరువిడిచి పొరుగు దేశమునకు సైన్యముతో వెళ్ళవలసిన సందర్భమును సృష్టించాడు నాయనారును పరీక్షించుటకై వాని ఇష్టదైవమైన శివుడు. ఒక పక్క కర్తవ్యము.మరొక ప...

cheramaan naayanaar

చేరమాన్ నాయనార్ *************** " ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. పెరుముక్కో అడయార్ నాయనార్ కేరల రాష్ట్రములోని చేర రాజ్య వంశములో జన్మించినప్పటికిని రాజ్యమును తృణప్రాయముగా నంచి,శివభక్తిని పెంపొందించుటకు తన జీవితమును అర్పింపదలచినాదు. కాని శివుడు తన భక్తునకు ఎవ్వరి మనసులోని భావములను కాని,ఏ స్థలము-వస్తువు మొదలగు వాని స్వరూప-స్వభావములౌ చిటికెలో గ్రహించగల వరమును ప్రసాదించి,రాజ్యాభిషిక్తుని చేసెను. ఎవరి మనౌలోని భావములనైన గ్రహించగల శక్తిమంతుడు కనుక పెరుముక్కూ అడయర్ గా ప్రైధ్ధిని పొందెను. రాజ్యము వీర భోజ్యము అన్నది ఆర్యోక్తి.బలపరాక్రమములు-కళరిర్-దయాదాక్షిణ్యములు కల నాయనారును, కళరిర్-అరివర్ గా కీర్తింపబడుచున్నాడు. చేరరాజ్య ప్రభువు కనుక చేరమాన్ నాయనారుగాను ఖ్యాతికెక్కినాడు. సగౌరవ సూచకముగా చేరమాన్ నాయనార్ గజారోహుడై నగరవ...

VIRAALMINdA NAAYANAARU

విరాల్మిండ నాయనార్ ******************** "ధావతే సత్వానాం పతయే నమః" భక్తులను రక్షించుటకు భక్తుల వెనుక ,భక్తులతో పాటుగా,భక్తులచే తరుమబడుతూ లీలలను ప్రదర్శించు శివునకు నమస్కారములు. విరాల్ మిండ విశ్వమంతా పరమాత్మయే అను భావమును నమ్మువాడు.భగవంతునికి మిత్రుడు అన్న అర్థమును కూడా చెప్పుకుంటారు. విరాల్మిండా నాయనారు చేర రాజ్యములోని,చెంగన్నూరులో వ్యవసాయ భూస్వాముల కుటుంబము నందు జన్మించెను. విరాల్ మిండ అనగా సకలజీవులు సర్వేశ్వరుడే అను నమ్మువాడు.భగవంతుని సేవించాలంటే,దర్శించాలన్నా,భక్తుని అంతే భక్తిప్రపత్తులతో సేవించాలన్న నియమము కలవాడు. శివార్చన ఎంతటి మహాభాగ్యమో శివభక్తార్చనయు అంతే అని నమ్మువాడు. విరాల్మిండ యొక్క భక్తితత్పరతలను విశ్వవిఖ్యాతము చేయదలిచాడు విశ్వేశ్వరుడు.శివపుణ్యక్షేత్ర సందర్శనమనే మిషను కల్పించి నాయనారును ఉన్నచోటునుండి కదిలించాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చదలచిన ఉమాధవుని కరుణ ఊహాతీతము కదా. హర హర మహాదేవ శంభో శంకర మహద్భాగ్యమునందించుటకు తిరువారూరు లోని త్యాగరాజ కోవెలను రంగస్థములనుగా సిధ్ధపరిచాడు ముందుముందు త్యాగరాజుగా నాయనారుచే తరుమ...

KALIKAMBA NAAYANAAR

కలికాంబ నాయనారు *************** " నీ పాదకమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయకదె" సహజకవి బమ్మెర పోతన. ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి. అన్నమాచార్చార్యులు సైతము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము అని సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి. నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును. సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు. స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము, శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని , అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దాన...

cheraman nayanar

ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) చిదానందరూపా-చేరమాన్ నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్...

SOMASIRA MAARAN NAYANAR

సోమశిర నాయనారు ******* " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం." శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. " యజ్" అను ధాతువుకు ఆరాధనచేయువాడు/అర్పణమును చేయువాడు అను అర్థమును కనుక గమనిస్తే యజ్ అను కర్త చేయు కార్యమును యజ్ఞముగాపరిగణింపవచ్చును.అగ్నిసాక్షిగా,అగ్ని సహాయమును కోరుతూ,యాగాగ్నిని ఉద్దీపింపచేసి అర్చించే వైదిక కార్యక్రమము. ఇందులో అగ్నిహోత్రుడు మనము అర్పించిన పదార్థములను దైవసమర్పణ మునకు అనుకూలమగు హవిస్సుగా మార్చి వారికి అందచేస్తాడు.వారు హవిస్సును స్వీకరించి ఆశీస్సులతో సుభిక్షమును కలుగచేస్తారు. ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశించి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము ...

ERIPATTA NAYANAR

ఎరిపత్త నాయనార్ *************** ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. " నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవ నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః". రుద్రా! తే- నీయోక్క మన్యవే-కోపమునకు నంస్తే- నమస్కారము రుద్రా నీ కోప ప్రకటనమునకు నమస్కారము. ఉతో-మరియును తే-నీయొక్క బాహుభ్యాం-బాహువులు, కోపమును సూచించు ఆయుధములను ధరించిన బాహువులకు నమస్కారము. రుద్రమంత్రములను సనాతనులు ప్రత్యక్ష మంత్రములుగా భావించి,గౌరవిస్తారు. నీ కోపము,దానిని సూచిస్తూ నీ బాహువులలో ఒదిగిన ఆయుధములు ధర్మసంరక్షనమునకు మాత్రమే ప్రయోగింపబడును గాక. అంతే కాదు, యా తే హేతిః మీడుష్తమ య-ఏ-తే-నీ యొక్క ఖడ్గము/గొడ్డలి మీడుష్టమ- సజ్జనులను స...

VIRALMINDA NAYANAR

నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు." చిదానందరూపా- విరాల్మిండ నాయనారు ************************************** "బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో" చిదానందరూపా-విరాల్మిండు నాయనారు ************************************ కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె శివభక్తుల చేరనీక సుందరు చేసినది శివాపరాధమనె దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును తరుముచు తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు ...

MURUGA NAYANARU

మురుగ/మురుగర్ నాయనార్ ********* " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నిండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాశక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సంహరణము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము...

KOTTALI NAYANAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులత...

SOMASIRA NAYANAR

" జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ | సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే- చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ" చిదానందరూపా--సోమశిర నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు పరహితమును కోరు అనిశమును పూజను మానడు గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక . యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడ...

ERIPATTA NAAYANAARU

ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు, చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు. ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో. భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో. ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరిక...

MURUGA NAYANAR

మురుగ/మురుగర్ నాయనార్ ************************ " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నుండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాసక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సమ్హరనము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరా...

NESA NAYANAR

నేశ నాయనారు **** హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరి నీ నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! (నృసింహకవి) పరమాత్మ యొక్క శబ్ద స్వరూపము నామము. హనుమ రామనామ మహిమ స్వామినే ఎదిరించినది.నామికి-నామమునకు కల అభేదమును వివరించినది.పిబరే రామ రసం అంటూ ఎందరినో రామనామామృతమును గ్రోలుతూ,ధన్యులను చేసినది.శివ నామమునకు కూడా జపించిన వారిని అనుగ్రహించుటలో ఏమీ మినహాయింపు లేదు అని తెలియచేసే అనుగ్రహవీక్షణమే , నేశనాయనారు దివ్య చరితము. " పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః కాండేన తేన యజురేవ విభాతి నిత్యం ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః" శివా నీనామమునకు స్థానమై ,రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థకాండము మహిమాన్వితముగా ప్రకాశించుచున్నది. నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే, శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తమిళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది. మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి. మ...

TIRU NAVUKKU ARASAR APPAAR NAAYANAAR

తిరునవుక్కు అరసర్ నాయనారు/అప్పార్ నాయనార్ **************************** "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే" వైదిక ధర్మమునకు గ్లాని సంభవించుచున్నవేళ దానిని పునరుధ్ధరించుట్కు పరమాత్మ ప్రత్యేక నామరూపములతో ప్రకటితమవుతాడు అని తెలియచేస్తునది శ్రీమద్భగవద్గీత. నాయనారుకుగల మరో పేరు అప్పర్/తండ్రి. జ్ఞానసరస్వతీదేవి నాయనారును కాళిదాసును శ్యామలాదేవి అనుగ్రహించినట్లు బీజాక్షరములతో అనుగ్రహించినది కనుక, తిరు పవిత్రమైన నవుక్కు-మాటలకు అరసర్-అధిపతి. నామములకు అధిపతి కనుక నవుక్కు అరసర్ అనియు,నామములు పవిత్రమైనవి కనుక తిరు నవుక్కు అరసర్ గా నాయనారు కీర్తింపబడుతున్నాడు. కొన్నివర్గముల వారి అభిప్రాయము ప్రకారము రావణాసుర రుద్రవీణాగానమునకు సహాయము చేసిన వాగీశ్వర్ అను మునియే శాపవశమున నవుక్కు అరసర్ గా జన్మించాడని నమ్ముతారు. అప్పర్ని-అతని అక్కయైన తిలకవతిని వేదాధ్యన సంపన్నులను చేశారు వారి తండ్రి అప్పటి మతవిద్వేషములు చేయుచున్న మారణకాండలను దృష్టిలో నుంచుకొని.వేదధ్యయనందు తన పిల్లలకు ఆసక్తిని కలిగించారు.ఆకర్షితులను చేసారు.కాని, ...

NESA NAYANAR

నేశ నాయనారు *************** " శంభో మహాదేవ శంభో శివ శంభో మహాదేవ శంభో ఫాలావలనమ్రత్ కిరీటం ఫాలనేత్రార్చిధా దగ్ధ పంచేషు కోటం శూలాహలా రాతి కూటం శుధ్ధమర్థేంద్రుచూదం భజేమార్గ బంధుం భజే మార్గబంధుం.(శ్రీ అప్పయ్య దీక్షితులు) శిరస్సున కిరీటమును ధరించినవాడు,మూడవనేత్రముతో మన్మథుని జయించినవాడు,త్రిశూలముతో శత్రువులను సంహరించినవాడు,శుభకరుడు,మాయాతీతుడు,సిగలో చంద్రకళను ధరించినవాడు,మార్గ బంధువు అగు శివునికినమస్కరించుచున్నాను. *** హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరి నీ నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ, వశమె హరి శ్రీకృష్ణా! (నృసింహకవి) నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే, శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తముళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది. మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి. మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి. కామేశుని భక్తులకు పం...

TIRUNEELA NAKKAR NAAYANAAR

తిరునీల నక్కర్ నాయనారు ******** " బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రనమామి సదాశివ లింగం." సాక్షాత్తుగా బ్రహ్మయే దిగివచ్చి ఆరాధించిన శివుని ఆలయము , అయ-వంద-ఈశ్వర ఆలయము.అయవందీశ్వరుని అనుగ్రహపాత్రుడైన నాయనారు నక్కర్ నాయనారు. చోళరాజ్యములో అనవరతము వేదము నినదించు "తిరుచత్తాత మంగై పురములో జన్మించిన మన నాయనారు అసలుపేరు మరుగునపడి,నక్కర్ వేదవిజ్ఞానమును అవగతము చేసుకొని ఆచరించువానిగా ,తిరునీలకంఠుని భక్తునిగా, తిరునీల నక్కర్ నాయనారుగా కీర్తింపబడుచున్నాడు. నిత్యము తన ధర్మపత్ని తో పాటుగా,నీలకంఠుని నిండార సేవిస్తూ,అన్యమెరుగక ధన్యతనొందుచుండెడివాడు. ఉన్నచోట,ఉన్నతీరున,ఉండనీయడు కదా తన భక్తులను ఆ మూడుకన్నులవాడు..కరుణ చూపుతాను అంటూ,కఠిన పరీక్షలను పెట్టుతూ,వానిని దాటిస్తుంటాడు.కొంతసేపు కరుణను దాటవేస్తుంటాడు. చిక్కులు కల్పిస్తూ,మక్కువతో తొలగిస్తూ వేడుకగ కొందరిని పాపులుగా/ పావులుగా మారుస్తూ,నిరపరాధులైనను నిందలకు గురిచేస్తూ,మోదమందుతుంటాడు ఆ నందివాహనుడు. పాలించేవాడు సాలెపురుగును లాలించదలిచాడో/నాయన...

MANA KAMCHARA NAYANAR

మన కంచార నాయనారు ******************* స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము శాశ్వతత్త్వ పునీతముగాగ గంగావతరణము మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము మరువకే ఓ మనసా! శివ నామస్మరణము. శ్రీ వేదసార శివస్తోత్రము. కంచార-సఖుడు. మన కంచార-మనసులో నిండిన సఖుడు. పరమేశుని తన మనసులో నిండిన సఖునిగా భావించి పూజించుట వలన ఈ నాయనారు కంచార నాయనారు/మన కంచార నాయనారుగా ప్రసిధ్ధిపొందినాడు.(ఆంతరంగికము) కాంచారూరు పట్టణములో భూస్వాముల కుటుంబమునందు జన్మించిన వాడగుటచే మన కాంచార నాయనారు అని కూడా భావిస్తారు.(బాహ్యము) వంశానుగతముగా లభించిన/వారసత్వముగా లభించిన చోళ సేనా నాయకత్వమును వృత్తిగాను/ షడ్వర్గ సేనలను సమర్థవంతముగా శివభక్త పాదసేవార్పనమునకు పరమార్థవంతముగా పనిచేయించు ప్రవృత్తిగాను కాలమును సద్వినియోగము చేసుకునే వాడు. మన నాయనారును శివానుగ్రహము గృహస్థాశ్రమములోనికి ప్రవేశింపచేసినది. కాలముతో పాటుగా సాగుతున్న శివుని మాయాజాలము మనలను ఆశ-నిరాశలను ఊయలలో ఊగిస్తుంది కదా. నాయనారు ఇంట ఊయలలో బిడ్డ ఊగే తరుణము కరుణను మరచినదా యన్నట్లుగా తాత్సారముచేస్తూ,శరణాగత రక్షకుని చరణసేవాసక్తతకు నాయనారున...

RUDRA PASUPATI NAYANAR

ఉరుత్తిరు రుద్ర పశుపతి నాయనారు. ***************************** " పంచాక్షరీ శివపదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్ఫురతి తేన చతుర్య్హ కాండః కాందేన తేన యజురేవ విభాతి నిత్యం ఋక్సామ మధ్య మణివాచ విభాంతి వేదా" నమః శివాయ అను పంచాక్షరి మంత్రము "శివ" అను పదము చేత ప్రకాశించుచున్నది. శివపంచాక్షరిని ప్రశంసించి నిర్దేశించుటచే రుద్రాద్యాయము ప్రశస్తమగుచున్నది. రుద్రుడు తేజోరూపము. రుద్రాధ్యాయము వైదికమగు స్తుతి.రుద్రాధ్యాయమనగా నమకము మరియు చమకము.నమః అను శబ్దము పలుమార్లు ఆవృత్తమగుటచే నమకము అనియును,చ-మే పలుసార్లు చెప్పబడుటచే చమకము అనియు సార్థకనామములను సంతరించుకున్నవి. "తిరుతొండర్దొగై" సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు. " నమః కాట్యాయచ-నీప్యాయచ నమః సూద్యాయచ-సరస్యాయచా" కొండమీది నుండి జారిపడే జలము నీప్యము.కొద్దిపాటి జలము కాటము. " నమో నాద్యాయచ-వైశంతాయచ" నదీ జలములములలో నుండువాడు నాద్యాయచ, స్వల్పజలము కలది వేశంతము.అవి మన భాషలో చెప్పుకోవాలంటే, కోవెలలోని దైవ తర్పణము కొరకు ఏర్పరచిన దేవ ఖాతములు.పుష్కరిణులు. ...

KAMCHARA NAYANARU

" నమో కపర్దినేచ-వ్యుప్త కేశాయచ." చిదానందరూపా-కంచార నాయనారు ***************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా కంచార నాయనారు చోళదేశ సేనాపతి శివతపోఫలితముగా కుమార్తె జన్మించింది యుక్తవయసు రాగానే యోగ్యుని అల్లుడు అనుకొనె దీవించగ ఏతెంచెను మహా వ్రతుడు "వధువును" విధేయముగా వధువు వంగి పాద నమస్కారమును చేసె విచిత్రముగా అతిథి వధువు కేశపాశమును కోరె సందేహించక ఏమాత్రము కోసి ఇచ్చేసెనుగా కైవల్యమును పొందగ కోసిన కేశపాశము కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక శివ భక్తులను కొలుచుట ఆదరించుట శివపూజగా భావించు కంచార నాయనారు చోళరాజ్య సేనా నాయకుడు.సదాశివుడు నాయనారు భక్తికి మెచ్చి సకల సద్గుణరాశియైన ఒక కుమార్తెను అనుగ్రహించాడు.యుక్త వయసువచ్చిన ఆమెకు శివ భక్తడైన ఇయర్కాన్ కాలికమార్నుని వరుడుగా నిర్ణయించాడు శివుడు. " ఆట కదరా శివా ! ఆట కద కేశవ- ఆట కదరా నీకు అన్ని పనులు." భక్తుని చరిత్ర అందముగా మరందముచిందాలని నిందను స్వీకరించుట...

DANDI ADIGAL NAYANAR

దండి అడిగళ్ నాయనారు ********************* బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం. ఏ సంకేత రూపముగా నున్న పరమాత్మ లింగమును బ్రహ్మ విష్ణువు మొగిలిన దేవతలు అర్చింతురో,నిర్మలమైన ఏ లింగము సకల చరాచర జన్మలకు ముడిపడియున్న కర్మపాశములను విడదీసి,దుఃఖములను నశింపచేయునో అట్టి సదాశివునికి నా నమస్కారములు. ******** చోళదేశములో తిరునావూరులోని పరమ శివభక్తుడు దండి అడిగళ్ నాయనారు. అడిగల్ పాదపద్మములు-పరమేశ్వర పాదపద్మములను దండిగా అపరిమితముగా నమ్మిన వాడగుటచే దండి అడిగళ్ గా కీర్తింపబడుచున్నాడు.వారు సార్థకనామధేయులే సదాశివునికి ప్రియమైన వారే. దండి అడిగల్ బాహ్యమునకు అంధుడు.అంతర్దర్శనశక్తిమంతుడు. కన్ను తక్క నాలుగు ఇంద్రియములను స్వామిసేవకు మిక్కిలి ప్రేమతో సమర్పించే సమర్థుడు. స్వామి లీలలు వినుచు తన శ్రవణేంద్రియమునకు సౌఖ్యమును కలిగించేవాడు. స్వామిని తాకుతు స్పర్శను పరవశమొందించేవాడు. సామి కరుణ యను సుగంధములను ఆఘ్రాణించుచు ఆనందపడేవాడు .పరమేశుని గుడి చుట్టు ప్రదక్షిణములను లక్షణముగా చేస్తూ మురిసిపోయేవాడు. నిర్మల...

MAIPORUL NAYANARU

మెయిపొరుల్ నాయనరు **************** అంతా పరమాత్మ స్వరూపమే అని నమ్మేవాడు పొరుళ్ ఈ విశ్వము విశ్వశ్వరుని స్వరూపము అన్న సత్యమును నమ్మేవాడు కనుక మెయి పొరుళ్,మై పొరుల్ నాయనారుగా కీర్తించబడుతున్నాడు.తిరుక్కోయిలూరులో వీరత్తరేశ్వరుని కొలుచు పరమ శివ భక్తుడు.సేది దెశమును ఏలినవానిగా కొందరు సేది నాయనారు అని కూడా కీర్తిస్తారు రాజుగా ఉత్తమ నాయకుడిగా ప్రజాపాలనను కొనసాగించినవాడు కనుక ఆ హోదాను గౌరవిస్తూ, మిలాద్ ఉడయార్-మిలాద్ నాయకుడు అని కూడా సంబోధిస్తారు. ఈ నాయనారు బద్దెన కవి సుమతీశతకములో చెప్పినట్లు, 'అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అన్న సుభాషితమునకు నిలువెత్తు నిదర్శనము. తమ ఊరిలోని శివాలయములలోనే కాక రాజ్యములో పలుప్రాంతములలో పరమేశ్వారాధనమును కొనసాగించేవాడు.స్త్రీ-పురుషులు.పిన్నలు-పెద్దలు,ధనిక-పేద,మొదలగు బాహ్య వ్యత్యాసములను అధిగమించి ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుని చూడగలిగి,భావించగలిగి,భాషించగలిగి,ఆరాధించగలిగిన ప్రావీణ్యమును పొందిన పుణ్యశాలి. రాజ్యము-రాజు-ప్రజలు సుభిక్షముగా నున్న సమయమున ఆది భిక్షువు తన ఆతను ప్రారంభందలచాడు.ఆపగలవారెవరు? పొరుగు రా...

RUDRA PASUPATI NAYANARU

URUTTIRU PASUPATI NAYANAR తిరుతొండర్దొగై సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.త్రికాలములందు తలలోతు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి రుద్రపారాయణను అదే నమ్మినవాని అర్చనగా నమకచమక పారాయణమును చేసేవాడు.భవ పాశములను తొలగించే పతి ని కొలిచేవాడు శివుడుగా -- నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది. ఇక్కడ మనము కొంచము పరిశీలితే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభిచాలంటే దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ సక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది. మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే , పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మ...

MURKHA NAYANAR

మూర్ఖ నాయనారు ***************** ఈ నాయనారు అసలు పేరు మరుగున పడినప్పటికిని,జూద నిపుణుడు కనుక నర్సూదన్ నాయనారు అని అన్నదానమునకు సప్తవ్యసనములలో మొదటిదైన జూదమును ఆధారముగా చేసికొనిన వాడు కనుక మూర్ఖ నాయనారుగా ప్రసిధ్ధిపొందెను. తొండైనాడు లోని తిరువెర్కుడం లో జన్మించిన నాయనారు, " అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః" అన్న సిధ్ధాంత ప్రకారము, యజ్ఞము చేత వర్షము వర్షము వలన అన్నము అన్నము వలన సమస్త ప్రాణకోటి ఏర్పడును. అన్నం అంటె అన్నమయకోశ శరీరముగా మనము భావించుకోవాలి. అంటే అణు-పరమాణు సముదాయమైన శరీరము. నాయనారు తన చిన్నతనము నుండి శివభక్తులను శివస్వరూప భావంతో సేవిస్తూ,వారికి మధురపదార్థములను అన్నముతో పాటు వడ్డిస్తూ,వారు తృప్తిగా తినిన తరువాతనే తాను భుజించేవాడు. అనవరతము ఆతంకములేకుండా దేనిని సాగనీయడు కదా ఆ సాంబశివుడు. హరుని ఆన దాటనంటూ నాయనారు సంపదలను హరించివేయసాగినది కాలము.ఉన్న వస్తువులన్నీ అమ్ముడుపోయి కిమ్మనకున్నాయి.అయినా ఏమాత్రము బాధపడకుండా, అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్ని...

SAKTI NAYARAR

శక్తి నాయనారు ************* కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా ప్రకటిత ప్రకాశ యజ్ఞదీక్షితునకు దండాలు శివా నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా ***** శక్తి నాయనారు పరింజియార్ గ్రామమునకు సంబంధించిన భూస్వామి.పరమ శివభక్తుడు.శివడమరుక అనుగ్రమైన అక్షరములను సలక్షణముగా గౌరవించే వాడు.నిక్షేపములైన అక్షరములను ఆక్షేపిస్తూ ,దుర్భాషలాడిన వారిని శిక్షించక వదిలేవాడు కాడు. అసలే వ్యవసాయ పాండిత్యమున్నవాడేమో,లక్షణ అక్షర సేద్యమునకు కంకణ బధ్ధుడైనాడు. దానికి కారణము నాయనారుకు శబ్ద ప్రాశస్త్యము పై గల అవగాహనయే.సాక్షాత్ తాను నమ్మిన శివుని శబ్ద స్వరూపమే వాక్కుగా భావించేవాడు.దాని ప్రయాణమును ను ప్రమాణముగా స్వీకరించేవాడు. సకల చరాచర జగత్తులో వాక్కు సలక్షణముగా నున్నప్పటికిని ,సమస్తమునందు సంపూర్ణముగా నుండదను విజ్ఞుల అభిప్రాయా నుసారము , రాళ్ల యందు వాక్కు పరా రూపంలో ఉంటుంది, వృక్షాదులయందు పశ్యంతీ రూపంలో, పశువులయందు మాధ్యమా రూపంలో, మానవుని యందు వైఖరీ రూపంలో వ్యక్తమౌతోంది అని విశదీకరించబడింది. అయితే, కేవలము మానవుడి యందే ఈ నా...

AMARANEETI NAYANARU

అమరనీతి నాయనారు ***************** [03:20, 11/11/2021] విమల: ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా. అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు. వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు. తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను ...

murty nayanar

మూర్తి నాయనారు ************ శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా వెండికొండ చరియలందుండు వానికి దండాలు శివా మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా ******** [08:46, 10/11/2021] విమల: మూర్తి నాయనారు. ******* నిరాకార భగవత్స్వరూపముగా తాను సాకారముగా ప్రకటింపబడుటయే మూర్తిమంతము.ప్రకటింపబడిన స్వరూపముయే మూర్తి. మనము ఈ రోజు సాకారరూపియైన భగవంతుని మూర్తినాయనరుగా కీర్తించుకుందాము. " గంధము పూయరుగా-కస్తూరి గంధము పూయర్య్గా" అని యదునందనుని గంధపుసేవు గానముతో చేస్తూ పరవశిస్తూ ధన్యుడైనాడు త్యాగరాజస్వామి. అదే విధముగా షోడశోపచారములలో ఒకటైన గంధపుసేవా ప్రాశస్త్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు మన మూర్తి నాయనారు. మంగళకరమైన మధుర పట్టనమున వ్యాపారకుటుంబములో జన్మించిన మూర్తి నయనరు గంధపుచెక్కల వ్యాపారమును చేసేవాడట. మధురలోని చొక్కనాథస్వామికి చందనసేవార్చనాసక్తుడు. ప్రతి ఉదయము స్వామికి తానే స్వయముగా చందనమును అరగదీసి స్వామికి అలంకరించి ఆనందించేవాడు.ఇది బాహ్యార్థము. కాసేపు మనము రాయిని పాంచభౌతిక ప్రపంచమన...

SAKKIYA NAYANAR

సక్కియ నాయనారు ****************** [05:42, 09/11/2021] విమల: ఆపదద్రి భేద టంక హస్తతే నమః శివాయ పాపహారి దివ్య సింధు మస్తతే నమః శివాయ పాపధారిణే లసన్నమస్తతే నమః శివాయ శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ ఆపదలు నశింపచేయు ఆయుధునకు దండాలు శివా పాపములు నశింపచేయు గంగాధరునకు దండాలు శివా శాపములు తొలగచేయు భక్తవశంకరునకు దండాలు శివా దండాలు స్వీకరించు దయాసింధువునకు దండాలు శివా.(చంద్రుని శాపమును/పాపమును నశింపచేసిన శివా) చిదానందరూపా-సక్కియ నాయనారు ************ కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివపూజకు అనుమతిలేని పాలనలో ఏమి తక్కువచేసెను స్వామి లాలనలో కనపడులింగము పూర్వము తానును రాయియే కదా ఆ రాయికి రాతిపూజ అపూర్వపు సేవయే కదా దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ చాలు చాలు భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబ నా చింతలు తీర్చు గాక. సత్యాన్వేషణ సాధనముగా ఏ మతమ...

TIRU MOOLAR NAAYANAAR

తిరుమూలర్ నాయనారు ******************* మూలర్ అను సత్తనూరు గ్రామవాసియైన విగతజీవుడైన పశువుల కాపరిశరీరములోనికి ప్రవేశించిన వాడు కనుక ,నాయనారు అసలుపరు మరుగున పడి,తిరుమూలర్ నాయనారుగా ప్రసిధ్ధి చెందినాడు. తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవుల...