KOTTALI NAYANAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులతో శివుని చేరిన ధన్యాత్ముడు. ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది అని తెలిసిన నాయనారుకోత్తిలి నాయనారు.తన శక్తి వంచన గాకుండా శివాలయములకు ధాన్యరాశులను పంపించుతు,స్వామి ప్రసాదమును సర్వజీవులు స్వీకరించుటలో శివుని దర్శించి,పులకరించేవాడు.వ్యాస మహర్షిని సైతము కుపితునిచేసిన అన్నలేమి కలుగకుండ చూడమని అన్న పూర్ణేశ్వరుని అర్థించేవాడు. ఆదిదేవుడు ఆ నాయనారు భక్తి-ప్రపత్తులను లోకవిదితము చేయాలనుకున్నాడు.రాచ కార్యమును కల్పించి,రానున్న ఫలితములను దరహాసముతో చూస్తున్నాడు.స్వామి కార్యము స్వకార్యమునకన్న ఒక మెట్టెక్కినది.అజ్ఞాబద్ధుడైన నాయనారు అన్న ప్రసాదమునకై ధాన్యపురాశులను అయినవారనుకొనే తన బంధువులకిచ్చి,స్వామి దేవాలయములకు పంపించమని కోరి,ఊరు వెడలి వెళ్ళెను.కపర్దికి కావలిసినదదే కదా.క్షణాలలో కరువు కోరలు చాచి,బంధువులు మాట తప్పునట్లు చేసినది.స్వామికైంకర్యము స్వార్థ కైంకర్యమైనదని తెలుసు కొనిన నాయనారు తాళలేక,వారందరిని శివాపరాధమునకు,శిక్షగా తన కరవాలమునకు బలిచేసెను. ప్రత్యక్షమై వారిని పునర్జీవితులను చేసి,నాయనారును కటాక్షించిన సదాశివుడు సర్వవేళల మనందరిని రక్షించును గాక. ( ఏక బిల్వం శివార్పణం.) తక్కువ

Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI