SIVA SANKALPAMU-32

ఓం నమ: శివాయ-32 ******************** కాళ్ళుజారతాయని చూడకుండ నీళ్ళూ పోస్తుంటావు తుడిచేందుకు బట్ట వేస్తే దానిని తడిపేస్తావు ఏనుగులు కొలిచాయాని బాగానే చెబుతావు ప్రత్యక్షపూజ కోరితే వృక్షము కమ్మంటావు అప్పులింగేశ్వరుడనంటు గొప్పలెన్నో చెబుతావు పప్పన్నానికి మాత్రము ఒప్పుకోను అంటావు గురువును నేను నీకు అంటు గౌరితో అంటావు అమ్మ శక్తిని కుదించి అఖిలాండేశ్వరి అంటావు నీళ్లమడుగుపైన కన్నులపండుగగా వెలిసావు తుళ్ళుచున్న ఆశలపై.నీళ్ళుజల్లుతుంటావు నీళ్ళదొరని నేనంటు భక్తుల పెళ్ళికి అనుమతించని ముక్కంటివి నీవటర ఓ తిక్కశంకరా. నీళ్ళమడుగులో నుండి( కావేరి జలము) ప్రకటింపబడిన శివుడు నీళ్ళతో ఆడుతు వాఈఇని కింద పారపోస్తుంటాడు.భక్తుల కాలుజారి పడతారని ఆలోచించడు.ఏనుగులు ఈ క్షేత్రములో తనను పూజించాయని గొప్పలుచెప్పుకుంటాడు.శంభుడు అను యోగి ప్రత్యక్షపూజానుగ్రహమును కోరగా నేరేడు చెట్టుగా మారి తనను పూజించమన్నాడు.గౌరీదేవికి తాను గురువునని కనుక ఆమెను పెండ్లిచేసుకోనని చెప్పాడు.తాను చేసుకోపోతే మానె,ఎవరైన ఉత్సాహంగా పెళ్ళిముచ్చట్లను చేస్తే వాటిపై నీళ్ళుజల్లి నిరుత్సాహ పరుస్తాడు.అంతే కాదు తన క్షేత్రములో ఎవరైనా సరే కళ్యాణమును చేసుకోవటానికి అనుమతించను అని పట్టుబట్టి కూర్చున్నాడు.-నింద. జలము నమః శివాయ-జగము నమః శివాయ గురువు నమః శివాయ-గురుతు నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. జంబూపతే మాంపాహి-పాహి.జటాధారియే జలరూపియై జగమేలు శ్రీమత్ తీర్థము స్వామి నివాసము. జ్ఞానక్షేత్ర జగదీశా జయము జయము. తిరువనై క్కావల్ ఈశా శరణు శరణు. .ఇక్కడ స్వామికి అర్చకులు మధ్యాహ్నార్చనను అఖిలాండేశ్వరీ గా స్త్రీమూర్తిగా అలంకరించుకొని కపిల గోపూజను,స్వామి నివేదనలను సమర్పిస్తారు.అన్నాభిషేకము కన్నుల పండుగగా జరుపుతారు.శివరాత్రి ఉత్సవాలను మండలదీక్షతో జరుపుతారు.ఆ ఉత్సవాలలో అమ్మవారిని అయ్యవారివలె-అయ్యవారిని అమ్మవారివలె అలంకరించి ఆలయ ప్రాంగణములన్నీ ఊరేగిస్తారు. "నమః స్స్రోతస్యాయచ" రుద్రనమకం. స్రోతస్సులనగా దేహమునందలి రక్తనాళముగా కూడ అనుసంధానము చేసుకుంటే సకల హృదయ నివాసి యైన ఆ జలలింగేశ్వరుడు జగదానందమును కలిగించుగాక-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)