PRAPASYAMTEE MAATAA-10

ప్రపశ్యంతీ మాత-10 **************** " కమలాంబ నా చింత తీర్చవమ్మా "అంటు ఆర్తితో ఆలపించాడు ముత్తుస్వామిదీక్షితారు ముక్తిని పొందగలిగారు.ఆ కీర్తనను నవావర ణ కీర్తన అంటారు.కాళి సక్తితో ప్రారంభమైన మన శక్తి దర్సన ప్రయానము తార-షోడసి-భువనేశ్వరి-భైరవి-ఛిన్నమస్తక-ధూమవతి-బగళముఖి-మాతంగి అను తొమ్మిది విధములైన శక్తుల స్థూల తత్త్వము-సూక్ష్మ తత్త్వమును పరిచయము చేసుకొని,బహిర్దర్శనముతో బాహ్య ప్రవృత్తులను సాధనములు చేసుకొని వాటికి మూలమైన అంతర్డర్శనమునకు తల్లి కమలాంబిక అనుగ్రహముతో ఉద్యుక్తులమగుచున్నాము.చీకతి తొలగి కాంతి-శబ్దము మనకు పరిచయమైనవి.సుందరము-సుభిక్షము అను బాహ్య-అంతర విషయములు బయటపడినవి.వాటిని వరుచేసుకొనుట-పనికి రాని వాటిని పరిత్యజించుట అవసరమని తెలుసుకున్నాము.క్రమక్రమముగా నలుపు-తెలుపు రంగులలో నున్న శక్తి తత్త్వము తన నలుపును చీకటిని తొలగించుకొని,శుధ్ధ సత్వ ప్రకాశముగా శుభపరిణామముగా ద్యోతకమగుచున్నది.అంటే సూర్యోదయమగుచున్నది స్థూలములో.శక్తి తత్త్వము అవగతమగుచున్నది సూక్ష్మములో.ఆ విధముగా లోపల -బయట వెలుగులు విరజిమ్ముతు సూర్యోదయమున ప్రకాశించుచున్న జ్ఞానమే కమలాంబిక.తొలగి పోయిన తమస్సు,ఉషస్సు అనే ...