POOGAL CHOLA NAAYANAAR
" నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః."
త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః."
చిదానందరూపా-పూగళ్ చోళ నాయనార్-22
కలయనుకొందునా నిటలాక్షుడు కలదనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పూగళ్ చోళరాజు పాశుపతేశ్వర స్వామిభక్తుడు
కరూరు రాజులను సామంతులుగ చేసిన కార్యదక్షుడు
కరూరు రాజులను సామంతులుగ చేసిన కార్యదక్షుడు
మనసు వజ్రకఠినము రాజ్యధిక్కారమునకు
కప్పము కట్తలేదని ఆడిగళ్ కోటను ముట్టడి చేసెను
కప్పము కట్తలేదని ఆడిగళ్ కోటను ముట్టడి చేసెను
ఆ మనసే పుష్ప కోమలము శైవ సత్కార్యములకు
పూజించెనుగ ఎరపాతు నాయనారును పెద్దమనసుతో
పూజించెనుగ ఎరపాతు నాయనారును పెద్దమనసుతో
ఖండిత శత్రుతలలలో శివ భక్తుని శిరము కానబడియెగ
ఖండోబాకు ఆత్మార్పణమంటు అగ్నిప్రవేశము కారణమాయెగ
ఖండోబాకు ఆత్మార్పణమంటు అగ్నిప్రవేశము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
పూగళ్ చోళ నాయనారు చోళదేశములోని ఉరైయూరు రాజు,రాజధర్మమును సమర్థవంతముగా నిర్వర్తించుచు,శివుని-శివభతులను పరమప్రీతితో సేవించేవాడు.చోళ నాయనారు తనసామంతురాజైన ఆదిగల్ తనకు కప్పము కట్టలేదని తన సైన్యమును దండెత్తమని ఆదేశించెను కాని శివభక్తులకు హానిచేయవలదని సూచనను ఈయలేదు.వారు రాజాజ్ఞగా దండెత్తినంతనే ఆదిగన్ భయపడి వెన్నుచూపెను.మిగిలిన సైన్యముతో పోరి వారిని వధించి,తమ రాజు సంతసించునని ఆదిగల్ ధనరాశులను,చంపినవారి శిరములను తీసుకొని వచ్చి చోళ నాయనారు ముందుంచారు.
రాజు ధర్మపాలనకు శివభక్త లాలనకు మధ్యన గలమర్మమును జగద్విఖ్యాతముచేయాలనుకున్నాడు .తెచ్చిన తెగిన శిరములలో , విబూది రేఖలతో ప్రకాశించే ఒక శివభక్తుని శిరమును చూసి హతాశుడైనాడు.అయ్యో ఎంత ఘోరము జరిగినది.
"కిం వాஉనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
ఙ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్"
ఓ పరమేశా!నా అజ్ఞానమును క్షమించుము.గుర్రములు-ఏనుగులు-సైన్యము-రాజ్యము మొదలగు అశాశ్వతములను మోహించి,నీ ఎడ ఘోర అపరాధమును చేసితిని.పశ్చాతపుడై ఒక బంగరు పళ్ళెమునందు ఆ పవిత్ర శిరమును పెట్టి,దానిని తన తలమీద అత్యంత భక్తిశ్రద్ధలతో పెట్టుకొని,శివ పంచాక్షరి మంత్రమును జపిస్తు అగ్నిప్రవేశము చేసిన ఆ నాయనారుకు ముక్తినొసగిన ఆ కార్తీక దామోదరుడు మనందరిని అనుగ్రహించుటకు అనురక్తిని చూపును గాక.
"కిం వాஉనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్రకలత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ |
ఙ్ఞాత్వైతత్క్షణభంగురం సపది రే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ మన శ్రీపార్వతీవల్లభమ్"
ఓ పరమేశా!నా అజ్ఞానమును క్షమించుము.గుర్రములు-ఏనుగులు-సైన్యము-రాజ్యము మొదలగు అశాశ్వతములను మోహించి,నీ ఎడ ఘోర అపరాధమును చేసితిని.పశ్చాతపుడై ఒక బంగరు పళ్ళెమునందు ఆ పవిత్ర శిరమును పెట్టి,దానిని తన తలమీద అత్యంత భక్తిశ్రద్ధలతో పెట్టుకొని,శివ పంచాక్షరి మంత్రమును జపిస్తు అగ్నిప్రవేశము చేసిన ఆ నాయనారుకు ముక్తినొసగిన ఆ కార్తీక దామోదరుడు మనందరిని అనుగ్రహించుటకు అనురక్తిని చూపును గాక.
( ఏకబిల్వం శివార్పణం.)
Comments
Post a Comment