PASUPATI NAAYANAR

" న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం "
చిదానందరూపా-పశుపతి నాయనారు
**********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పశుపతి రుద్ర నాయనారు పుట్టెను తిరువరియూరునందు
పురుతశి నక్షత్రంబున గురుతర పూజలనందు
కంఠములోతు నీటను అకుంఠిత భక్తిని కొలుచువాడు
ఉత్కంఠత నిండగ నమక-చమకములను పలికెడివాడు
నమ్మిన భక్తిమార్గమున మూడు సంధ్యలను వందనములిడు
కమ్మని స్తవములు తెమ్మెరలై ముక్కంటి ముంగిటనుండు
లాలనచేయగ దలచి పశుపతి, పశుపతిని పిలిచెగ
నీలకంఠుని పొందగ కంఠపులోతు నీరు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
" గంగేచయమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలస్మై సన్నిధికురు."
అని భావిస్తూ శుద్ధోదక స్నానముతో తనలోని శివునిని,బాహ్యములోని శివునిని స్నానమును సమర్పించుటసనాతన సంప్రదాయము.
అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియ శివః-అని ఆర్యోక్తి.సాక్షాత్ జల లింగమైన జంబుకేశ్వరునకు అభిషేకములు అవసరమా? ఆయన చల్లదనమునకువచ్చినలోటేమిటి?మంచుకొండ ఇల్లాయె! కట్టి పడేసిన గంగమ్మ కనుసైగ చేస్తే కదిలి ముంచేస్తుందాయె.యోగేశ్వరుని అల్లుకున్న యోగ సాస్త్రాలైనపాములు శీతలత్వముతో అనరతము సేవిస్తూనే ఉన్నాయాయె.అదియే శివ చమత్కారము.అగ్నినిమూడో కన్నుగా,హాలాహలమును కంఠాభరనముగా ధరించిన స్వామి నిత్యాభిషేకములను నిరతిశయ ప్రీతిని చెందుతాడనుట నిర్వివాదాంశము.నిర్హేతుక కృపను వర్షించు స్వామి తనను నీట ముంచిన భక్తులను, వారిలో నున్న శివునికై తాము నీటిలోమునిగి సేవించినను అదరముతో తనదరిచేర్చుకుంటాడనుటకు నిదర్శనమే పశుపతి నాయనారు.ఎంత నీరు తోడినను తిరిగి అదే మట్టమునకు చేర్చు తెల్లనేరేడులో దాగిన చల్లనైనస్వామి తన లోని భువన భాండములను అనిశము చల్లబరచుటకే అభిషేకములకు ఆనందపడతాడు కాని తన కొరకు ఏమీ కోరుకోడు అని గ్రహించిన పశుపతి తనలోని శివుడు,అతని లోని బ్రహ్మాండములు ఎప్పుడుచల్లగా ఉండాలని తాపత్రయపడేవాదు.శివ పూజగా కంఠములోతు నీటిలో మునిగి,నమక చమకములను అత్యంత భక్తితో పఠించెడి వాడు.
కూసిని నీళ్ళు పోస్తే ఖుష్ అవుతాడట శబ్బాషు శంకరుడు.(శ్రీ తనికెళ్ళ్ భరణి గారు.)తొండము నిండా నీళ్ళు నింపి ఆది-అంతము లేని ఆ శివునికరుణను పొందినది దంతి.చెంబును దొంగిలించుటకుచెంబులోని నీటిని అప్రయత్నముగా లింగముపై పోసినందులకు చేరినాడు దొంగ ఆ జంగమదేవరను.త్రి సంధ్యావందనములను చేసిన ఆ పశుపతిని ,తనలోని పశుపతికి నీటిని అందించినవానిని పాశ విముక్తుని చేసిన స్వామి మన సంసార పాశములను తొలగించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)