GAYE MANGALYA GAURIKAA

  గయే  మాంగల్య గౌరికా

 " గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే
   పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని
   త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి
   మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"

  ఫల్గునితీర  బీహారు రాష్ట్రములోని  గయ అను ప్రదేశములో పడిన మాయాసతి యొక్క వక్షోజములు ,దయయే ధర్మముగా గల మాంగల్య గౌరీదేవిగా ప్రకటింపబడి, ఆ క్షేత్రమును "పాలనా పీఠముగా" కీర్తింపబడుచున్నది.మంగళగిరి కొండలపై తూర్పు ముఖాభిముఖియైన్ గుహాలయములో తల్లి స్థితికారకత్వముగల తన రెండు స్తనములను,రెండు శిలారూపములుగా దర్శింపచేస్తూ,దయ చూపిస్తున్నదని పద్మ,విష్ణుస్థలపురాణములు కీర్తించుచున్నవి.

      " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.
  గయ అను పదమునకు పునీతముగావింపబడిన ప్రదేశము అని మరొక అర్థము కలదు.సుదర్శన చక్ర స్పర్శచే పునీతము గావింపబడిన అసురుని శరీరభాగములకు గయ అను నామము సార్థకమగును.

 ఇక కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అన్నారు పెద్దలు.వర్ణవ్యత్యయమును పరిశీలిస్తే గయ అను పదము యగ గా యాగ గా అన్వయించుకుంటే బ్రహ్మర్షుల యజ్ఞవాటిక (యజ్ఞము జరిగిన దేహము) గాను ప్రకాశిస్తున్నదిమంగళగౌరీదేవి అనుగ్రహించిన అనేకానేక కథలు ప్రచారములో కలవు.శ్రావణ మాసములో,ఆశ్వయుజ ,కార్తీక మాసములలోనవరాత్రులందును అమ్మవారి పూజలు వైభవోపేతముగా జరుగును.ప్రతి మంగళవారము.శుక్రవారము ప్రత్యేక పూజలు జరుగును.వక్షద్వయ ప్రతీకలుగా రెండు గోపురములు ఆకలిదప్పికలను తీర్చుచుండును. శాక్తేయులకు-బౌద్ధులకు గయాక్షత్రము కొంగు బంగారము.శ్రాద్ధకర్మ ఫలితమును పితృదేవతలకు అందించు అద్భుతము..

    పూర్వము మగధదేశములో కుండిన నగరములో ధర్మపాదుడూ అను వైశ్యుడు కలడు.అతని భార్య మహా సాధ్వి,ఒక సాధువు ఆమె బిక్షను ప్రతి రోజు తిరస్కరించుచున్నాడని వగచి,తన భర్తకు చెప్పగా,బంగారు కాసులను సాధువునకు భిక్షగా ఇమ్మటాడు ధర్మపాదుడు.మరునాడు ఆమె అత్లే చేయబోవగా సాధువు కుపితుడై భిక్ష నిరాకరణకు కారణమును తెలియచేసి,సాధువులను బంగారు భిక్షతో అవమానపరచినందులకు సంతానము కలుగకుండునుగాక అని శపించెను.పశ్చాత్తాపము పొందిన ఆ పతివ్రతను కరుణించి,సంతానమునకు ఒక ఉపాయమును సూచించి వెడలెను.

  అమ్మ తలచుకుంటే అసాధ్యమేముంది.ధర్మపాదుడు ఊరిచివరగల చూతవృక్షమును సమీపించెను. చూడముచ్చటగ  చూతఫలములతో చూలింతవలెనున్న ఆ చెట్టును చూసిన వెంటనే దురాశ ధర్మపాదునిలో ప్రవేశించి ఆనతిని మీరి,ఒక ఫలమును గాకుండా అనేక మామిడిపండ్లతో తనఒడిని నింపెను.ఎవరికెంత ప్రాప్తమో అంటే కదా.అన్ని పండ్లు ఒక్క పండుగా మారిపోయెను.చేసేదిలేక అయోమయముగనున్న ధర్మపాదునిపై అమ్మ ఆగ్రహించి,ఆ ఫల భక్షణము వలన వారికి అల్పాయుష్కుడగు కుమారుడు కలుగునని సెలవిచ్చి,అంతర్ధానమయ్యెను. 

    అమంగళము ప్రతిహతమగుగాక.

     వారికి అత్త్యుత్తముడైన బాలుడు జన్మించెను.వానికి శివుడు (శుభప్రదుడు) అను నామకరణమును చేసిరి.పుణ్యతీర్థ స్నానము-పుణ్యక్షేత్ర దర్శనము సర్వపాపహరమని తలచి శివుని మేనమామ అతనిని కాశి క్షత్రమునకు తీసుకుని వెళ్ళగా,అక్కడ మంగళగౌరీ భక్తురాలైన సుశీల అను సద్గుణాల రాసితో వివాహమై,ఆమె పాతివ్రత్యమహిమ తల్లి ఆగ్రహమును అనుగ్రహముగా మార్చి ఆశీర్వదించగా వారు ఆనందముగా కలకాలము అమ్మను సేవించి తరించిరి.అకళంకరహిత స్వర్ణవర్ణ శోభితను  

   శ్రీకృష్ణుడు ధర్మరాజుతో త్రిపురాసుర సంహారసమయమున శివుడు ఈ తల్లిని పూజించెనని చెప్పెన
  అంగారకుడు మంగళగౌరిని పూజించి కుజగ్రహ అధిపతియైనాడని మంగళుడు అను పేరును పొందెనని చెబుతారు.
   ఇంకా ఎందరో కథకాటుకను ధరించి కనులకున్న అహంకారపొరలను తొలగించుకున్నారనుట
  నిస్సందేహము

  ఎల్లోర గుహాలయమునందు "కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ ...అనుగ్రహమే అయిన తల్లి మనలను అనుగ్రహించుగాక.

    ( శ్రీ మాత్రే నమః.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)