ADIVO-ALLADIVO NAMMALWARU
సంభవామి యుగే యుగే సాక్ష్యములు హరి సైన్యములు
ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు
తిరునగరిలో కొలివీరి ఉదయనంగ దంపతులకు
మారన్ గా ప్రకటితమాయెను విష్వక్సేనుడు
కను తెరువడు ఏడువడు పాలను స్వీకరించడు
వింతగ చింతచెట్టు తొర్రలో పద్మాసనుడైనాడు
ఉత్తర్-దక్షిణ దిక్కుల ఉజ్జ్వలించు జ్యోతులుగ
మధురకవితో ప్రథమముగ మాటలాడినాడు
నాలుగు వేదములను తమిళములో తిరు గ్రంథములుగ రచించి
నాలుగు దిక్కులను హరి తత్త్వమును చాటించి
నిత్య నిర్గుణ నిరంజనుని నిరతము మది నిలుపుకొని
పరమార్థము చాటిన నమ్మాళ్వారు పూజనీయుడాయెగ
Comments
Post a Comment