MURUGA NAAYANAAR
" ఏలా లవంగి పూలతో జాజి చంపకములతో
మాలతి-మందారలతో మహేశ్వరుని పూజింగ రారె
మాలతి-మందారలతో మహేశ్వరుని పూజింగ రారె
మల్లెలు మొల్లలు మంచి పొన్నలు-పొగడలు తెచ్చి
రంగుల రోజాపూలతో రామేశ్వరుని పూజింపగ రారె"
రంగుల రోజాపూలతో రామేశ్వరుని పూజింపగ రారె"
చిదానందరూపా-మురుగ నాయనారు
***********************************
***********************************
కలనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
యోగుల స్వేదబిందువుల వేదపు పూలగా మారు
శివలీల చాటగ వేదికయైనది తిరువుకలూరు
శివలీల చాటగ వేదికయైనది తిరువుకలూరు
చేతిలో పూలసజ్జ రమణీయము,చేయు జపము అనుసరణీయము
ఆనంద భాష్పాభిషేకము తోడుగ శివునకు పుష్ప యాగము
ఆనంద భాష్పాభిషేకము తోడుగ శివునకు పుష్ప యాగము
తిరుజ్ఞానిని మురుగను స్నేహము బంధించినది
జ్ఞాని పాణిగ్రహణము ప్రాణ నిష్క్రమణ పరీక్షయైనది
జ్ఞాని పాణిగ్రహణము ప్రాణ నిష్క్రమణ పరీక్షయైనది
నిశ్చింతగ అందరు జోతల జ్యోతిని చేరినారుగా
శివసాయుజ్యమును పొందగ స్నేహము కారణమాయెగ
శివసాయుజ్యమును పొందగ స్నేహము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
తమిళవైశాఖి మూలా నక్షత్రము పరమ పవిత్ర మురుగ నాయనారు గురుపూజా పుణ్యతిథిగా కీర్తించబడుతుంది.చోళరాజ్యములోని తిరుపుగలూరులో ప్రతిక్షణము శివ పంచాక్షరిని జపించుచు ,సుగంధ పరిమళ సుమములను సేకరించుచు,అందమయిన మాలలుగా అల్లుచు,మూడు పూటలా శివుని మూరల కొలది పూలమాలలను స్వామికి సమర్పించుచు,సంతసించుచుండెడి వాడు.పశుపతి నాయనారుకు స్నేహపాశమును బిగించ దలచి,జ్ఞాన సంబంధారును తిరుపుగలూరుకి రప్పించి,నాయనారు ప్రాణ మిత్రుని చేసెను. పై అంతస్థుకు చేర్చుటకు నిచ్చెన ఆధారమైనట్లు,శివ సాయుజ్యమును చేర్చుటకు స్నేహ రూపమున జ్ఞాన సంబంధారు భక్తి తాడును పెనవేయుచు భగవద్దర్శనముకై వేచియున్నారు ఇద్దరు.కాలగతిలో ఋతువులతో పాటు మానవదశలు-ఆశ్రమములు మారుట సహజమే కదా. తిరుజ్ఞానుకు కళ్యాణము నిశ్చయమైనది.కళ్యాణమునకు వివాహము.శుభము అను రెండు అర్థములు కలవు కదా.స్వామి లీలలు అర్థముచేసికొన గలమా? వివాహ నిమిత్తము స్నేహితుడుగా{ తోడుగా ఉంటు మేలుకోరువాడు కద స్నేహితుడు! ఆలయమునకు వచ్చిన వారిని జీవన్ముక్తులను చేయాలనుకున్నాడు ఆ లయకారుడు.కన్నుల పండుగ గా జరిగిన కళ్యాణ మహోత్సవము,వారి మానవ శరీర ధారణకు భరత వాక్యమును పలికించబోతుంది.కైవల్య కాలము కనికరించి వధూవరులను,మురుగనాయనారును అగ్నిప్రవేశముచేయమని ఆదేశించినది.పెరుమానం లోని ప్రాణ స్నేహితుని పరిణయము పరమపద సోపానమై,పరమేశ్వరసన్నిధికి చేర్చినది.శాప విముక్తులైనారు ఆ శివభక్తులు.శివోహం-శివోహం.,ఆలయమునకు వచ్చిన వారిని జీవన్ముక్తులను చేయాలనుకొన్నాడు..తక్షణమే జ్యోతులుగా స్వామిని చేరుకున్నారు.వారికీర్తిని చిరస్థాయి చేసిన ఆ నర్తనప్రియుడు మనలనందరిని రక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం.)
Comments
Post a Comment