TIRUNAALAI POEVAR NAMDANAAR NAAYANAAR

" నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!"
చిదానందరూపా-తిరునాలై పోవార్ నాయనారు
******************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరునాలై పోవార్ నాయనారు తిరిపమెత్తువాని భక్తుడు
"గీతం సమర్పయామి" అంటు సంగీత సామాగ్రినిచ్చెడివాడు
తిరువంకూరల్ శివదర్శనమునకు అడ్డమైనది నందివాహనము
శిరముని వంచి ఆదర్శమైనది విడ్డూరముగ నందనారుకు
తిరునాలైపోవార్ అనగా రేపువెళ్ళువాడు అని అర్థము
శివయానై వెళ్ళెను చిదంబరమునకు కనకమహాసభ దర్శనార్థము
చిన్నకులమువాడన్న వాదును చెరిపెను,శివ కులములోనికి చేర్చెను
అగ్నినేత్రుని జ్యోతిగ కొలువగ అగ్నిస్నానమె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
కులము అనే పదమునకు నాలుగుగా పనిని బట్టి విభజించిన విభాగము గాను,సమూహముగాను మనము అన్వయించుకుంటే మహాశివుడు అన్ని విభాగములలోను,అన్ని విభాగ సమూహములలోను స్థూల-సూక్ష్మ రూపములలో నిండియున్నాడనుటకు నిదర్శనమే కదా పరమ భక్తాగ్రేసర నందనారు పుణ్య చరితము.విచక్షణ మరచిన పెద్దలు అంటరానితనమను ముద్రను తగిలించినను, తగవులాడక, అనేక శివ క్షేత్రములను తన్మయత్వముతో దర్శించుచు,"శిశుర్వేత్తి-పశుర్వేత్తి-వేత్తి గానరసం ఫణిః" అను శ్రుతిని అనుసరించి,తన స్వామిని ఆరాధిస్తున్న నాగులకువానిని ఆదరిస్తున్న స్వామికి సంగీతము ఎంతోఇష్టమైనది కావున దేవళములలో భేరి-మృదంగము-వీణ తీగెలు మొదలగు సంగీతోపకరణములను సమర్పించి పులకించిపోయే వాడు.
చిక్కబడ్డ భక్తి చక్కదనమును తెలియచేయాలనుకున్నాడు ముక్కంటి.తిరువంకూరులోని స్వామి దర్శనాభిలాషను కలిగించాడు నాయనారుకు."విఘ్నేశ్వరును పెళ్ళికి అన్నీ విఘ్నాలే" అన్నట్లు స్వామిని చూడాలంటే నంది అడ్డముగా నిలిచినది. పరితప్తుడైన తన భక్తుని ధ్యానమునకు మెచ్చి,క్షిప్త ప్రసాదుడైన (త్వరగా అనుగ్రహించేవాడు) స్వామి పరీక్ష చాలనుకొని,నందిని కొంత పక్కకు తొలగమన్నాడు.తన సర్వస్యమైన స్వామి ఆనను,అనుగ్రహముగా భావించి,కొంచము పక్కకు వంగినది నంది వాహనము. నంది వంగుటకు కారణమైన తిరునాలై నందనారుగా ప్రసిద్ధికెక్కాడు.ఓం నమః శివాయ.
కాలాతీతుడైన శివుడు కాల చక్రమునుతో తోడుగా కోరికలను చట్రములను బిగించి తిప్పుతుంటాడు.అదే జరిగింది మన నందనారు విషయములో." సంఙా రంభ విజృంభితుడు " ఆ సదా శివుడు.కనకమహా సభలో నాట్యమును చూడాలనే కోరిక బలీయము కాసాగింది నాయనారుకు.కులవ్యవస్థ అంతరార్థమును తెలియని అపార్థము పడగ విప్పింది .నందనారు అడుగులను కదలనీయలేదు.తిల్లై బ్రాహ్మణ వర్గముగా మారి వీల్లేదంది.ఘటనాఘటన సమర్థుడు అగ్ని నేత్రుడు నందనారును అగ్ని పునీతునిగా అనుగ్రహించ దలిచాడు.
అగ్ని ప్రవేశమును చేసిన నందనారుని విభూతి రేఖలతో,యజ్ఞోపవీతముతో,జుట్టు ముడితో ,వినూత్న తేజవంతుని గా ఆశీర్వదించిన ఆ సుందరేశ్వరుడు మనలనందరిని పునీతులుగా చేయుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)