VAARANAASYAM VISAALAAKSHI

వారణాశ్యాం విశాలాక్షి

   " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
   విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా
   సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం
   వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ
   అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః
   త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."

   " వారణాస్యాం విశాలాక్షి నైమిశే లింగధారిణి
   ప్రయాగే  లలితాదేవి  కామాక్షి గంధమాదనే."
   
    గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

      మణికర్ణిక అను పదమునకు కర్ణమునకు (చెవికి) ధరించిన మంగళప్రద ఆభరణము.మాతసతి చెవిపోగు ఇక్కడపడిన ప్రదేశములో ప్రకటింపబడిన తల్లి కనుక "మణికర్ణికా దేవి" అని కూడా తల్లిని కొలుస్తారు.మణికర్ణికా ఘాటు   విష్ణువుచే నిర్మించబడినదిగా ఒక కథ ప్రచారములో ఉంది.విశాలాక్షి తీర్థము భక్తుల పాపప్రక్షాళనము చేస్తోంది.

     కలియుగ కైలాసమును ఎందరో కవులు,ఋషులు,యోగులు కీర్తించారు.కీర్తించుచున్నారు-కీర్తిస్తారు.

    
 " మోక్ష ద్వార కవాట పాటనకరీ కాశి పురాధీశ్వరి
  భిక్షాందేహి కృపావలంబనకరీ   మాతాన్నపూర్ణేశ్వరి."

    ఒకసారి స్వామిలీలగా వ్యాస మహర్షికి ,అతని శిష్యులకు  వారమురోజులపాటు భిక్ష లభించలేదట.అందులకు కోపిచిన వ్యాసుడు కాసిని శపించబోవు సమయమున పార్వతీ పరమేశ్వరులు వృద్ధ బ్రాహ్మణదంపతులుగా మారి వ్యాసుని అతని
 శిష్యులకు మృష్టాన్న భోజన ఆతిధ్యమునిచ్చిరి.అనతరము వ్యాసుని ఆగ్రహవశత్వమును క్షమించని శివుడు వ్యాసునికి కాశి బహిష్కరణను శాసించెను.వ్యాసుడు పశ్చాతప్తుడై పరమ శివుని వేడుకొనగా అతని పాదస్పర్శచే  దక్షిణకాశిగా ధన్యతనొందునని వరమిచ్చెను .

    అసి వరుణ అనే నదులు గంగలో సంగమిస్తాయి.అసి-వరుణ మధ్యనున్న ప్రదేశమును వారణాసి అంటారు.ఇరుకైన సందుల గుండా విశాలాక్షి అమ్మవారి గుడికి భక్తులు చేరుకుంటారు.గర్భగుడి ముందు భాగములో ఆదిశంకరులు ప్రతిష్టించిన శ్రీచక్రము సువాసిని పూజలను అందుకుంటుంటుంది.సర్వాభరణ,సర్వ పుష్పాలంకృతయై,సర్వాభీష్ట ప్రదాయినిగా సాక్షాత్కరిస్తుంది తల్లి.అమ్మవారి మూర్తి వెనుక మరొక మూర్తి మహిమాన్వితయై మనలను కాపాడుతుంటుంది.

  అమ్మవారిని దర్శించిన తరువాత సర్వశుభకరుడైన కాశీ విశ్వనాథుని దర్శించుకుంటూ
భక్తిపరవశులై

  "విశ్వేశం మాధవం డుండిం దండపాలంచ భైరవం
   వండే కాశిం గుహాం గంగాం భవానీం మణి కర్ణికాం" అని కీర్తిస్తుంటారు. 

   అహం కాశి గమిష్యామి.నేను కాశికి వెళుతున్నాను అని తలచినంత మాత్రముననే "భావనా మాత్ర సంతుష్టయైన తల్లి భవబంధముక్తులను చేస్తుందట.ఎంతటి వారైన కాశిక్షేత్రములో తమ తుదిశ్వాస విడవాలనుకుంటారు.చివరి క్షణమున పరమేశ్వరుడు కుడిచెవిలో ప్రణవమును చదువుతుంటే,విశాలాక్షి తన పవిటను వింజామరచేసి,విశ్రాంతిని ఇస్తుందట.సకలదేవతలు సాక్షాతాకరించి సన్నిధానమును చేరుస్తారట . 

  "కాశి" అను పదమునలు జ్యోతి.ప్రకాశము అను అర్థములుగలవు,అష్టాదశ శక్తిపీఠము-ద్వాదశ జ్యోతిర్లింగము-సప్తమోక్షపురము-అష్ట మాతృకా స్థలము అయిన కాశి లో వెలిసిన విశాలాక్షి మాత మనలను రక్షించుగాక.

   శ్రీ మాత్రే నమః.     

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)